రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు సరికాదని…అధికారం ఎవరికీ శాశ్వతం కాదని తెలంగాణ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్నగర్ నియోజకవర్గంలోని కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తిక వన మహోత్సవం లో పాల్గొన్నారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పట్ల ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును …
Read More »టీమిండియాకు బిగ్ షాక్
ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్కప్ మ్యాచ్లో గాయపడ్డ హార్దిక్ పాండ్యా ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20 సిరీస్కు దూరం కానున్నాడు. కాలి మడిమకు గాయం కావడంతో.. వరల్డ్కప్లో బంగ్లాదేశ్తో మ్యాచ్ సమయంలో అతను గాయపడ్డాడు. వరల్డ్కప్ కోసం హార్దిక్ పాండ్యా స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణను తీసుకున్న విషయం తెలిసిందే. అయితే వరల్డ్కప్ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగే అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్కు కూడా హార్దిక్ను పక్కనపెట్టేశారు. ఆస్ట్రేలియాతో పాటు సౌతాఫ్రికాతో జరిగే మూడు …
Read More »బీఆర్ఎస్ లో చేరిన బీజేపీ నేతలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని అంబర్ పేట నియోజకవర్గానికి చెందిన బిజెపి నాయకులు ఈరోజు శుక్రవారం స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. బిజెపి హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ఉపాధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ వనం రమేష్, వనం మాలతి దంపతులు, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బిజెపి కార్యదర్శి గోల్నాక నుంచి జిహెచ్ఎంసి ఎన్నికల్లో బిజెపి తరఫున …
Read More »శేరిలింగంపల్లిలో ఎగిరేది గులాబీ జెండా
తెలంగాణ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ, సందయ్య నగర్ లలో గౌరవ కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ గారు మరియు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం చేసిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ అరెకపూడి గాంధీ గారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీ కేటీఆర్ …
Read More »మతి పొగొడుతున్న శ్రీలీల
సోషల్ మీడియాలో శ్రీలీల భామకుండే ఫాలోవర్ల సంఖ్య చెప్పడం కొద్దిగా కష్టమే అని చెప్పాలి. ఈ బ్యూటీ నెట్టింట ఫొటో పెట్టిందంటే చాలు నెటిజన్లకు నిద్రపట్టడం కష్టమే. తాజాగా నలుపు రంగు చీరలో హొయలుపోతూ.. కెమెరాకు ఫోజులిచ్చింది శ్రీలీల. మంత్రముగ్దులను చేసే అందంతో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ధమాకా సినిమాలో తన డ్యాన్స్తో బాక్సాఫీస్ను ఓ ఊపు ఊపేసిన శ్రీలీల.. ఈ ఏడాది మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, …
Read More »వెలుగుల దీపావళి కావాలా? దివాళా తీసిన కర్ణాటక కావాలా?
అధికారం కోసం ఐదు గ్యారంటీలతో కర్ణాటక ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. తెలంగాణలో ఆరు గ్యారంటీలతో మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆ పార్టీ పాలనలో కర్ణాటక ప్రజలు నరకం చూస్తున్నారన్నారు. పాత పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పాతర వేస్తున్నదని, పిల్లలకు ఇచ్చే స్కాలర్షిప్ల్లో కూడా కోత పెట్టిందని విమర్శించారు. అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వడం లేదన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో కాంగ్రెస్ …
Read More »కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరంటే…?
తెలంగాణలో నవంబర్ ముప్పై తారీఖున జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరు!? ఈ ప్రశ్నకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు! ఎన్టీఆర్, వైఎస్ సెంటిమెంట్తో డిసెంబరు 9న ఎల్బీ స్టేడియంలోనే తన ప్రమాణ స్వీకారం ఉంటుందని వెల్లడించారు. సీఎం ఎవరనేది అధిష్ఠానం తనకు చెప్పలేదంటూనే.. పదేళ్లపాటు అధికారం ఉంటే తెలంగాణలో మార్పు చూపిస్తానని, ఆ మేరకు విజన్ ఉందని అన్నారు! ప్రజలకు అన్నీ ఇచ్చానని …
Read More »ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దు.
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రజల నాయకుడు.. ఆయన ఇంటి నిండా ఎప్పుడు చూసినా ప్రజలే ఉంటారని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజల పనులు చేసిపెట్టే ప్రజా నాయకుడిని భారీ మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఎన్నికలు రాగానే ఆగమాగం కాకుండా.. ఈ పదేండ్ల బీఆర్ఎస్ …
Read More »కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధి కేపీ వివేకానందతోనే సాధ్యం
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారికి ఏకగ్రీవ మద్దతు తెలిపిన సోమ వంశ క్షత్రియ సంఘం (సారోళ్లు) సభ్యులు… సూరారంలోని కట్ట మైసమ్మ ఫంక్షన్ హాల్లో సోమ వంశ క్షత్రియ సంఘం (సారోళ్లు) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే కే. పీ.వివేకానంద గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద గారు మాట్లాడుతూ సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతిని కోరుకునే ఏకైక పార్టీ బిఆర్ఎస్ మాత్రమేనన్నారు. మన సంక్షేమం, …
Read More »ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఏకగ్రీవ తీర్మానం
కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే గారి నివాస కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు యూసుఫ్ గారి ఆధ్వర్యంలో అల్ హక్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా మైనారిటీలకు ప్రాధాన్యతనిస్తూ వారి సంక్షేమం పాటుపడిన పార్టీ కేవలం …
Read More »