జాతీయస్థాయిలో వైద్య విద్యాప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)లో తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. గతేడాది 135 మంది విద్యార్థులు నీట్లో అర్హత సాధించగా.. ఈ సారి ఏకంగా 305 మంది ఉత్తీర్ణులయ్యారు. గతేడాది 35 మంది సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు అర్హతను సాధించగా.. ఈ ఏడాది ఏకంగా 65 మంది వివిధ రిజర్వేషన్ …
Read More »లైఫ్ సైన్సెస్ ఆర్ అండ్ డీలో హైదరాబాద్ హవా
లైఫ్ సైన్సెస్ రంగానికి సంబంధించిన పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) కార్యకలాపాలకు భారతీయ నగరాలు ప్రపంచంలోనే అత్యంత కీలకంగా మారాయి. వీటిలో హైదరాబాద్ ప్రపంచ ర్యాంకింగ్లో రెండో స్థానంలో ఉన్నట్టు అంతర్జాతీయ అధ్యయన సంస్థ ‘ఎఫ్డీఐ బెంచ్మార్క్’ వెల్లడించింది. ఈ ర్యాంకింగ్స్లో నోయిడా అగ్రస్థానంలో నిలిచిందని, హైదరాబాద్ తర్వాత 3 నుంచి 6 స్థానాల్లో వరుసగా చెన్నై, గుర్గావ్, పుణే, బెంగళూరు ఉన్నాయని తాజా నివేదికలో పేర్కొన్నది. కొవిడ్ వ్యాప్తితో వైద్యారోగ్య …
Read More »బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ భారీ విజయం
ఏపీలో జరిగిన బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధా భారీ మెజార్టీతో గెలుపొందారు. వైసీపీ అధిష్టానం లక్ష మెజార్టీ అనుకున్నప్పటికీ.. అనుకున్నదానికంటే తక్కువగానే మెజార్టీ వచ్చింది. మొత్తమ్మీద నోటా, బీజేపీకి ఎక్కువ ఓట్లు రావడంతో వైసీపీ మెజార్టీ తగ్గిందని చెప్పుకోవచ్చు. మొదటి రౌండ్ నుంచి లాస్ట్ రౌండ్ వరకూ భారీగానే ఆధిక్యంలోనే కొనసాగిన వైసీపీ అభ్యర్థి చివరికి ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి సురేష్పై 90,550 …
Read More »సినిమాల్లోకి సుమ
తెలుగు బుల్లితెరపై తన మాటల గారడీతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న యాంకర్ సుమ(Suma). ఇప్పటికీ బుల్లితెర రారాణిగా ఓ వెలుగు వెలుగుతున్న సుమ నవ్వుతూ.. నవ్విస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. స్టేజ్పై సుమ ఉందంటే చాలు అక్కడ నవ్వులు గ్యారెంటీ. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్లలోనూ ఆమెకు ప్రత్యేక స్థానం ఉంది. టాప్ హీరోలు సైతం ఆమెపై ప్రశంసలు కురిపిస్తుంటారు. సుమ మాతృభాష మలయాళం అయినప్పటికీ.. తెలుగు …
Read More »అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తృణమూల్ పార్టీ హావా
పశ్చిమ బెంగాల్ లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తృణమూల్ పార్టీ దుమ్మురేపుతోంది. నాలుగు అసెంబ్లీ స్థానాల్లోనూ ఆ పార్టీ భారీ ఆధిక్యంతో దూసుకెళ్లుతోంది. అధికార తృణమూల్ పార్టీకి బీజేపీ ఇవ్వలేకపోయింది. కూచ్బిహార్ జిల్లాలోని దిన్హటా స్థానంలో టీఎంసీ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. బీజేపీ స్థానమైన దిన్హటాలో ఈసారి టీఎంసీ తరపున ఉదయన్ గుహ పోటీలో నిలిచారు. అయితే బీజేపీ అభ్యర్తి అశోక్ మండల్పై .. ఉదయన్ సుమారు లక్షన్నర ఓట్ల మెజారిటీతో …
Read More »భారతీయ జనతా పార్టీకి ఘోర పరాభవం
భారతీయ జనతా పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. హిమాచల్ ప్రదేశ్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసిన అన్ని సీట్లను కోల్పోయింది. మండి లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి ప్రతిభా సింగ్.. బీజేపీ అభ్యర్థి కుషాల్ ఠాకూర్పై గెలుపొందారు. దాదాపు పది వేల ఓట్ల మెజారిటీతో బ్రిగేడియర్ కుషాల్ ఓటమి పాలయ్యారు. ఇక ఫతేపూర్, ఆర్కీ, జుబ్బల్ అసెంబ్లీ స్థానాలను …
Read More »యువరాజ్ సింగ్ అభిమానులకు శుభవార్త
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తన అభిమానులకు శుభవార్త చెప్పాడు. ఫ్యాన్స్ కోరిక మేరకు… త్వరలోనే మళ్లీ మైదానంలో అడుగుపెడతానని పేర్కొన్నాడు. అన్నీ సజావుగా సాగితే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో క్రికెట్ ఫీల్డ్లో తనను చూసే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు తన వన్డే కెరీర్లో చివరిసారిగా, ఇంగ్లండ్పై సాధించిన సెంచరీ(150)కి సంబంధించిన వీడియోను ఇన్స్టా వేదికగా పంచుకున్న యువీ.. భావోద్వేగ క్యాప్షన్ జతచేశాడు. ‘‘ఆ దేవుడే నీ …
Read More »వన్డే, టి20ల్లో కెప్టెన్గా రోహిత్
టి20 ప్రపంచకప్ 2021 తర్వాత విరాట్ కోహ్లి టి20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకోనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీమిండియా పాకిస్తాన్, న్యూజిలాండ్తో మ్యాచ్ల్లో దారుణ పరాజయాలు చవిచూసి సెమీస్ అవకాశాలను దాదాపుగా కోల్పోయింది.ఇక టీమిండియా సెమీస్కు చేరాలంటే అద్భుతాలే జరగాల్సిందే. తనకు కెప్టెన్గా ఇదే చివరి టి20 ప్రపంచకప్ కావడంతో ఎలాగైన టైటిల్ అందుకోవాలని భావించిన కోహ్లి ఆశలు గల్లంతయ్యాయి. ఇదిలా ఉండగా.. టి20 కెప్టెన్సీ నుంచి …
Read More »Huzurabad By Poll Results-రోటీ మేకర్ గుర్తుకు 280 ఓట్లు..
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు సంబంధించి తొలి రౌండ్ ఫలితాలు వెల్లడి అయ్యాయి. మొత్తం 30 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. స్వతంత్ర అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్కు తొలి రౌండ్లో 122 ఓట్లు ,సెకండ్ రౌండ్ పూర్తయ్యేసరికి 280ఓట్లు వచ్చాయి. శ్రీకాంత్ గుర్తు రోటి మేకర్.. ఇది కారు గుర్తును పోలి ఉండటం పెద్ద కన్ఫ్యూజన్ను క్రియేట్ చేసిందని చెప్పొచ్చు.తొలి రౌండ్ పూర్తయ్యేసరికి బీజేపీ 166 ఓట్ల ఆధిక్యంలో …
Read More »Huzurabad By Poll Results-తొలి రౌండ్ లో BJP ముందంజ
హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ముగిసిన వెంటనే హుజురాబాద్ మండల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలి రౌండ్లో బీజేపీ ఆధిక్యంలో నిలిచింది. తొలిరౌండ్లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ 166 ఓట్లతో ముందజలో ఉన్నారు. బీజేపీకి 4610 ఓట్లు, టీఆర్ఎస్కు 4,444 ఓట్లు వచ్చాయి
Read More »