వచ్చే ఏడాదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మణిపూర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపీసీసీ) అధ్యక్షుడు గోవిందాస్ కొంతౌజాం రాజీనామా చేశారు. పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో కలిసి ఆయన అధికార బీజేపీ పార్టీలో చేరనున్నారు. బిష్ణుపూర్ నుంచి వరుసగా ఆరుసార్లు ఎన్నికైన గోవిందాస్ను మణిపూర్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా సోనియా గాంధీ గతేడాది డిసెంబర్లో నియమించారు. 2022లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. …
Read More »అందుకే TRSలో చేరుతున్న- కౌశిక్ రెడ్డి
హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నానని కాంగ్రెస్ మాజీ నేత పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం మధ్యామ్నం ఒంటి గంటకు తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతానని ఆయన ప్రకటించారు.కొండాపూర్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కౌశిక్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు, తన మద్దతుదారుల కోరిక మేరకు.. టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నాను. …
Read More »దేశంలో కొత్తగా 30,093 కరోనా కేసులు
దేశంలో మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 30,093 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. 125 రోజుల తర్వాత కరోనా కేసులు 30వేలకు చేరాయి. మరో వైపు కొత్తగా 45,254 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. వైరస్ బారినపడి 374 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,11,74,322కు పెరిగింది. ఇందులో 3,03,53,710 …
Read More »పోర్న్ రాకెట్ కేసులో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త –
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పోర్న్ వీడియోలో తీసిన కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఔత్సాహిక నటీనటులతో అశ్లీల చిత్రాలు తీయించి.. వాటిని విదేశీ యాప్ల్లో అప్లోడ్ చేసిన కేసులో ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు కుంద్రాను అరెస్టు చేశారు. ఫిబ్రవరిలో ఈ కేసును నమోదు చేశారు. పోర్న్ చిత్రాల కేసులో కుంద్రానే కీలక సూత్రధారి అని, …
Read More »మత్తెక్కిస్తున్న ప్రగ్యాజైశ్వాల్ లేటెస్ట్ హాట్ ఫోటోలు
కంచె సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై మెరిసి మంచి బ్రేక్ అందుకుంది జబల్పూల్ సుందరి ప్రగ్యాజైశ్వాల్. ఈ భామ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకు క్రేజ్ మామూలుగా ఉండదు. అప్ డేటెడ్ ట్రెండీ కాస్ట్యూమ్స్ లో ప్రతీ రోజూ కొత్తగా కనిపిస్తూ సందడి చేస్తుంది. ప్రగ్యాజైశ్వాల్ మెరూన్ కలర్ అవుట్పిట్ లో అందాలు ఆరబోస్తూ కెమెరాకు ఫోజులిచ్చింది. సాగరతీరంలో బాల్కనీపై స్టన్నింగ్ లుక్లో డిఫరెంట్ యాంగిల్స్ లో హాట్ హాట్ …
Read More »మంచి జోష్ లో ఉన్న రష్మిక మందన్న
అందాల రాక్షసి.. యువతరం అభిమాన నాయక రష్మిక మందన్న వరుస చిత్రీకరణలతో తీరికలేకుండా గడుపుతోంది. ఇటీవలే బాలీవుడ్లో ‘గుడ్బై’ సినిమా షూటింగ్ను పూర్తిచేసుకొని హైదరాబాద్లో అడుగుపెట్టిన ఈ అమ్మడు ప్రస్తుతం అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న ‘పుష్ప’ చిత్రీకరణలో పాల్గొంటున్నది. తెలుగులో ఈ ముద్దుగుమ్మ కథానాయికగా నటిస్తున్న మరో చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ రెగ్యులర్ షూటింగ్ సోమవారం హైదరాబాద్లో మొదలైంది. తాను ఈ చిత్రీకరణలో పాల్గొంటున్నట్లు రష్మిక మందన్న …
Read More »తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ర్ట ప్రజలకు తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఏడాది పొడవునా తెలంగాణ ప్రజల జీవితాల్లో ఆనందాలు నింపే పండుగలకు తొలి ఏకాదశి ఆది పండుగ అని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు శుభాలను, ఆయురారోగ్యాలను అందించాలని సీఎం ప్రార్థించారు. రాష్ర్ట వ్యాప్తంగా వైష్ణవ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నదీ తీర ప్రాంతాల్లో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
Read More »పంచాయతీ సెక్రటరీలకు సీఎం కేసీఆర్ శుభవార్త
తెలంగాణలోని జూనియర్ పంచాయతీ కార్యదర్శుల వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచింది. నెలకు రూ.28,719 వేతనాన్ని ఖరారుచేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఇన్చార్జి కార్యదర్శి, కమిషనర్ రఘనందన్రావు సోమవారం ఆదేశాలు జారీచేశారు. ఇప్పటివరకు జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు నెలకు రూ.15 వేల వేతనాన్ని చెల్లించారు. పెరిగిన వేతనం జూలై 1 నుంచి అమల్లోకి వస్తుందని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు లబ్ధి …
Read More »ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ-ఎందుకంటే..?
తెలంగాణ రాష్ట్ర,ఐపీఎస్ అధికారి, తెలంగాణ గురుకులాల కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. స్వచ్ఛందంగా పదవీ విరమణ చేస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. గత 26 సంవత్సరాలుగా తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తున్నానని పేర్కొన్నారు. ఇంకా ఆయనకు 6 సంవత్సరాల సర్వీస్ ఉంది. కొన్ని రోజుల క్రితం ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఓ …
Read More »దేశంలో కొత్తగా 38,164 కరోనా కేసులు
ఇండియాలో గడిచిన 24 గంటల్లో 38,164 కేసులు నమోదయ్యాయి. నిన్నటి కంటే 7.2 శాతం తక్కువ కేసులు వచ్చాయి. ఇక మరో 499 మంది ఈ మహమ్మారి బారిన పడి మరణించారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.11 కోట్లకు, మరణాల సంఖ్య 4.14 లక్షలకు చేరింది. అత్యధికంగా కేరళలో 13,956 కేసులు నమోదు కాగా.. మహారాష్ట్ర 9 వేల కేసులతో రెండోస్థానంలో ఉంది. 24 గంటల్లో కేసుల …
Read More »