మీరు యాపిల్ ఉత్పత్తులైన ఐపాడ్, మొబైల్ ఫోన్స్ వాడుతున్నారా..? .. లేదా మీరు వాటిని కొనాలని చూస్తున్నారా..?. అయితే మీకో షాకింగ్ లాంటి బ్రేకింగ్ న్యూస్ ఇది. టెక్నాలజీ దిగ్గజం యాపిల్ ఉత్పత్తులంటేనే భద్రతకు మారుపేరు. హ్యాకింగ్ కు వీలులేనంతగా వీటిని తయారుచేసి మార్కెట్లోకి విడుదల చేస్తుంది ఈ సంస్థ. అయితే ఈ పరికరాలకు భద్రత పరమైన ముప్పు ఏర్పడిందని యాపిల్ సంస్థ ప్రకటించింది. సాఫ్ట్ వేర్ లో తీవ్ర …
Read More »మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్
మైక్రోసాఫ్ట్ కంపెనీ తమ ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. ఉద్యోగుల శాలరీ దాదాపుగా డబుల్ చేస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించి మెయిల్ ద్వారా సీఈవో సత్యనాదెళ్ల స్టాఫ్కి తెలిపారు. ఉద్యోగులు అద్భుతంగా వర్క్ చేస్తున్నారని.. అందుకే మనకి అధిక డిమాండ్ఉందన్నారు. ఈ విషయంలో స్టాఫ్కి థాంక్స్ చెబుతున్నట్లు సీఈవో తన మెయిల్లో పేర్కొన్నారు. ఉద్యోగులకు గ్లోబల్మెరిట్ బడ్జెట్ను రెట్టింపు చేస్తున్నామని.. లోకల్ డేటా బట్టి శాలరీ ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుందని …
Read More »వచ్చే ఐదేళ్లలో వరంగల్ జిల్లాలో 50వేల ఐటీ ఉద్యోగాలు: కేటీఆర్
వరంగల్ను టెక్స్టైల్ హబ్గా అభివృద్ధి చేయాలనే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంలో మరో ముందడుగు పడిందని మంత్రి కేటీఆర్ అన్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో నిర్మించే ప్రఖ్యాత కంపెనీ కిటెక్స్ వస్త్ర పరిశ్రమకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాబోయే రెండేళ్లలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో పరిశ్రమల ఏర్పాటు జరుగుతోందని చెప్పారు. టెక్స్టైల్ పార్కులో 20వేల మందికి ఉపాధికి లభించనుందని.. వారిలో అధికంగా …
Read More »వర్క్ చేస్తుండగా పేలిన ల్యాప్టాప్.. సాఫ్ట్వేర్ ఉద్యోగికి తీవ్రగాయాలు
లాప్ట్యాప్ ఛార్జింగ్లో ఉంచి వర్క్ చేసుకుంటుండగా అది ఒక్కసారిగా పేలింది. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా మేకలవారిపల్లెలో చోటుచేసుకుంది. సుమతి అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని ల్యాప్టాప్కి ఛార్జింగ్ పెట్టి వర్క్ చేసుకుంటుండగా అది పేలి మంటలు వచ్చాయి. దీంతో సుమతికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను కుటుంబసభ్యులు వెంటనే కడపలోని ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఇలా జరిగిందా? ల్యాప్ ట్యాప్ ఛార్జింగ్లో పెట్టి ఎక్కువసేపు అలా వర్క్ …
Read More »విప్రో కంపెనీ ఉద్యోగులకు బంఫర్ ఆఫర్
ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ అయిన విప్రో కంపెనీ ఉద్యోగులకు ఈ ఏడాది రెండోసారి జీతం పెరగనుంది. జూనియర్ ఉద్యోగులకు జీతాలను పెంచుతున్నామని.. బ్యాండ్ B3 ఉద్యోగుల (అసిస్టెంట్ మేనేజర్ మరియు దిగువస్థాయి)కు పెరిగే జీతాలు సెప్టెంబర్ 1 నుంచి అమలవుతాయని సంస్థ తెలిపింది. 2021 జనవరిలోనే ఒకసారి వీరి జీతాలు పెరగ్గా.. తాజాగా మళ్లీ పెరగనున్నాయి. మొత్తం కంపెనీ ఉద్యోగుల్లో బ్యాండ్ B3 కేటగిరీ వారు 80శాతం వరకు …
Read More »మైక్రోసాఫ్ట్ కొత్త చైర్మన్గా సత్య నాదెళ్ల
ఇన్నాళ్లూ మైక్రోసాఫ్ట్ కార్ప్ సీఈవోగా ఉన్న సత్య నాదెళ్లను కొత్త చైర్మన్గా ప్రకటించింది ఆ సంస్థ. ఇన్నాళ్లూ ఆ స్థానంలో ఉన్న జాన్ థాంప్సన్ను తప్పించి నాదెళ్లకు ఆ పదవి కట్టబెట్టడం విశేషం. 2014లో కంపెనీ సీఈవో అయిన తర్వాత మైక్రోసాఫ్ట్ బిజినెస్ బాగా వృద్ధి చెందింది. ఆయన ఆధ్వర్యంలోనే లింక్డిన్, న్యువాన్స్ కమ్యూనికేషన్స్, జెనిమ్యాక్స్లాంటి కంపెనీలను మైక్రోసాఫ్ట్ సొంతం చేసుకుంది. 2014లో బిల్ గేట్స్ నుంచి చైర్మన్ పదవిని …
Read More »అద్భుత ఫీచర్లతో ఎంఐ నుండి సరికొత్త మొబైల్
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ షియోమి తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త మోడళ్లలో స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. ఎంఐ 10టీ, ఎంఐ 10టీ ప్రో, ఎంఐ 10టీ లైట్ స్మార్ట్ఫోన్లను విడుదల చేసినట్లు సంస్థ పేర్కొంది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ఎంఐ 10టీ ఫోన్ రూ.43,000, 8జీబీ ర్యామ్, 128జీబీ మోడల్ ఫోన్ రూ. 47,200 గా ఉంది. ఎంఐ 10టీ ప్రో రూ. …
Read More »మైక్రోసాఫ్ట్ నుండి బిల్ గేట్స్ ఔట్
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడైన బిల్ గేట్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మైక్రోసాఫ్ట్ బోర్డు నుండి తప్పుకోవాలని బిల్ గేట్స్ నిర్ణయించుకున్నారు. సరిగ్గా 1975లో పాల్ అల్లెన్ తో కల్సి బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ ను స్థాపించారు. అప్పటి నుండి చాలా కాలం సీఈఓగా పని చేశారు. గత కొంతకాలంగా సేవ కార్యక్రమాలపై దృష్టి పెట్టిన బిల్ గేట్స్ సేవపనులపైనే ఎక్కువ సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నారు అని తెలుస్తుంది. అందుకే ఒక పక్క …
Read More »బ్రేకింగ్ న్యూస్..సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు ఇక ఇంటి నుంచే..ఎందుకంటే?
భాగ్యనగరంలో ప్రస్తుతం కరోనా వైరస్ కలకలం రేపుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒకరికి రావడంతో అందరూ భయబ్రాంతులకు గురవురుతున్నారు. ఇది ఇలా ఉండగా తాజాగా మరో ఇద్దరికీ ఈ వ్యాధి సోకినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో బాగంగానే ఒకరు మైండ్ స్పేస్ 20వ అంతస్తులో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా అనుమానిస్తున్నారు. దాంతో అందులో స్టాఫ్ అందరికి ఇంటికి వెళ్ళిపోమని చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో కొన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలను మూసివేస్తున్నారని..ఇక …
Read More »సుడిగాలి సుధీర్.. సాఫ్ట్వేర్ సుధీర్ గా మారిపోయాడు!
జబర్దస్త్, ఢీ, పోవే పోరా’ వంటి టెలివిజన్ షోస్ ద్వారా పాపులరై ప్రేక్షకులకు మన్ననలు పొందుతున్న సుడిగాలి సుధీర్ని హీరోగా పరిచయం చేస్తూ శేఖర ఆర్ట్స్ క్రియేషన్స్ బేనర్ ధన్య బాలకృష్ణ హీరోయిన్గా శేఖర ఆర్ట్స్ క్రియేషన్స్ బేనర్ సాఫ్ట్వేర్ సుధీర్ చిత్రాన్ని ప్రముఖ పారిశ్రామిక వేత్త శేఖర్ రాజు నిర్మించారు. ఈ సినిమా ద్వారా రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇటీవల విడుదలైన టీజర్కి మంచి రెస్పాన్స్ …
Read More »