హుజురాబాద్ నియోజకవర్గంలో ని అర్హులైన ప్రతి దళిత కుటంబానికి దళిత బంధు పథకం వర్తింప చేయడం జరుగుతుందని, ఇందులో ఎలాంటి అనుమానాలు వద్దని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు స్పష్టం చేశారు. శనివారం హుజురాబాద్ నియోజకవర్గ సర్పంచ్ లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధుల తో టేలికాన్ఫరెన్స్ లో వారు మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన ప్రకారం నియోజకవర్గంలో ని 20 వేల కుటుంబాల కు పైగా …
Read More »యాదాద్రిలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం సతీసమేతంగా యాదగిరిగుట్ట వెళ్లిన మంత్రి.. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు మంత్రికి ఆలయ అధికారులు, పూజారులు ఘనంగా స్వాగతం పలికారు. దర్శనానంతం మంత్రి తలసాని దంపతులకు పండితులు వేదాశీర్వాదం అందించగా, అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు. వారివెంట స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ఉన్నారు.
Read More »రంగనాయక సాగర్ ఏరియల్ వ్యూ అద్భుతం
తెలంగాణలో జలాశయాలన్నీ నిండు కుండలా తొణికిసలాడతున్నాయి. గోదావరి నీళ్లతో సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ ప్రాజెక్టు కళకళలాడుతోంది. ప్రాజెక్టు చుట్టూ పచ్చదనం పరుచుకోవడంతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది ఆ ప్రాంతం. ఆర్థిక మంత్రి హరీశ్రావు హెలికాప్టర్లో ప్రయాణిస్తూ ఆ అద్భుతమైన దృశ్యాన్ని చూస్తూ ఎంజాయ్ చేశారు. రంగనాయక సాగర్ ఏరియల్ వ్యూను హరీశ్రావు తన కెమెరాలో బంధించి ట్వీట్ చేశారు. రంగనాయక సాగర్ ప్రాజెక్టు సిద్దిపేట జిల్లాలోని చంద్లాపూర్ వద్ద …
Read More »సరికొత్త నాటకానికి తెర తీసిన ఈటల రాజేందర్
బీజేపీ నేతలది ఒక బాధ అయితే మాజీ మంత్రి ,బీజేపీ నేత ఈటల రాజేందర్ది మరో బాధ. దళిత బంధుతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణతో తనకు ఓటమి తప్పదని ఆయనకు అర్థమైంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు కండ్లకు కడుతుండడంతో ఆయన తనదైన శైలిలో మెత్తటి మాటలతో కొత్త నాటకానికి తెరతీశారు. తన దగ్గర పైసలు లేవనీ, అందువల్ల ప్రజలను ఇంటికో వెయ్యి రూపాయలు చందా …
Read More »ఆగస్టు 15 నుండి రూ. 50 వేల వరకు పంట రుణాల మాఫీ
రైతును రాజును చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పలు సందర్భాలలో సీఎం కేసీఆర్ పేర్కొన్న విషయం తెలిసిందే. చెప్పిన విధంగానే రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పంట రుణాలను మాఫీ చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. గత ఏడాది కొంత మొత్తాన్ని మాఫీ చేసిన కేసీఆర్ సర్కార్ ఈసారి మరికొంత మాఫీని చేయాలని నిర్ణయించింది. …
Read More »ప్రతి దళితుడికి ఆర్ఠిక సాయం అందాలి- సీఎం కేసీఆర్
దళితుల్లో సమగ్రాభివృద్ధియే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వ ఎంతో ప్రతిష్టాత్మకంగా దళిత సంక్షేమం కోసం ‘దళిత బంధు’ పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ పథకాన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 26న సీఎం కేసీఆర్ సారథ్యంలో దళిత బంధు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా దళిత బంధు అమలుకు ప్రభుత్వం రూ. …
Read More »కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేసిన మంత్రి ఎర్రబెల్లి
రాయపర్తి మండల కేంద్రంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నిరుపేదలకు అండగా నిలుస్తున్నాయన్నారు. పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లు భారం కావొద్దనే సీఎం కేసీఆర్ ఈ పథకాలు ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా కూడా ఇలాంటి పథకాలు లేవన్నారు. కార్యక్రమంలో స్థానిక …
Read More »ప్రజలందరూ భక్తి మార్గంలో నడిచినప్పుడే సమాజ శాంతి
ప్రజలందరూ భక్తి మార్గంలో నడిచినప్పుడే సమాజ శాంతికి దోహదపడుతుందని శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి అన్నారు. ఆర్సీపురం డివిజన్ లోని రాయసముద్రం చెరువు కట్టపైన నూతనంగా నిర్మించిన నాగులమ్మ ఆలయంలో నాగులమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి భూపాల్ రెడ్డి సతీసమేతంగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాగులమ్మ ఆలయ ఏర్పాటు, విగ్రహ ప్రతిష్ఠాపణతో ఓల్డ్ ఆర్సీపురంలో పండుగ వాతావరణం నెలకొందని …
Read More »కరోనా కట్టడిలో తెలంగాణ ముందు
కరోనా కట్టడిలో తెలంగాణ ముందున్నదని కేంద్ర గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. రాష్ట్రంలోని ఏ ఒక్క జిల్లాలోనూ పాజిటివిటీ రేటు 5 శాతానికి మించలేదని కేంద్రం వెల్లడించింది. దేశవ్యాప్తంగా పాజిటివిటీ రేటు 5 నుంచి 15 శాతం ఉన్న జిల్లాలు, కరోనా మరణాల సంఖ్యపై రాజ్యసభ సభ్యుడు వివేక్ కే టంఖా అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది. తెలంగాణలో 2019, 2020 సంవత్సరాల్లో 1,541 కరోనా మరణాలు నమోదుకాగా, ఈ ఏడాది జనవరి …
Read More »శాసన సభ్యుడిగా నోముల భగత్ ప్రమాణ స్వీకారం
నాగార్జునసార్ ఉప ఎన్నికల్లో గెలుపొందిన నోముల భగత్ శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం ఉదయం అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్లో జరిగిన ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీ రూల్స్ బుక్స్, ఐడెంటిటీ కార్డును భగత్ కు అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని …
Read More »