అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మహిళ సోదరి మణులకు మంత్రి హరీష్ రావు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ..ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక సమాజ వికాసానికి నిజమైన కొలమానం.. ఆ సమాజంలోని మహిళాభివృద్ధి స్థాయి మాత్రమేనని అంబేద్కర్ మహాశయుడు చెప్పారని . ఆయన మాటలు మననం చేసుకుంటు మహిళల వికాసానికి, భద్రతతకు, వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు సీఎం కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ ప్రభుత్వం అనేక …
Read More »జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : మంత్రి కేటీఆర్
జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వ కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. చనిపోయిన జర్నలిస్టుల పిల్లలను రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఆదివారం నగరంలోని జలవిహార్లో టీయూడబ్ల్యూజే సభ్యులతో జరిగిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత తానే తీసుకుంటున్నానని అన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు అడ్డుంకులున్నాయని వాటిని కూడా చూస్తానని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ లేనిదే టీకాంగ్రెస్, టీబీజేపీ ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. …
Read More »వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించండి : మంత్రి కేటీఆర్
రంగారెడ్డి – హైదరాబాద్ – మహబూబ్నగర్ పట్టభద్రుల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. దోమలగూడలోని పింగళి వెంకటరామిరెడ్డి హాలులో ఏర్పాటు చేసిన పీవీ వాణిదేవీ సమన్వయ సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు రమణాచారి, ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీ పురాణం సతీష్తో పాటు పలువురు …
Read More »తెలంగాణలో రేపు ప్రత్యేక సెలవు డే
తెలంగాణ రాష్ట్రంలో రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో మహిళా ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఈ నెల 8న రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులందరికీ ప్రత్యేక సాధారణ సెలవు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు 2010, ఆగస్టు 4న జారీ చేసిన జీవో 433ను అమలు చేయాలని సంబంధిత అధికారులను సాధారణ పరిపాలన శాఖ ఆదేశించింది
Read More »కేంద్రం ఏమిచేసిందో బీజేపీ సన్నాసులు చెప్పాలి-మంత్రి కేటీఆర్
‘మనం సాధించిన ప్రగతిని అంకెలతో వివరించండి. అనవసరంగా మాట్లాడుతున్న వారి నోళ్లకు సంకెళ్లు వేయండి’ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు టీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి పిలుపునిచ్చారు. ఏది పడితే అది.. ఎవరుపడితే వారు ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోబోమని ఆయన ప్రతిపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులే గెలుస్తున్నారని ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణభవన్లో టీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ …
Read More »గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వేగంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో 60 ఏండ్ల వయసు సైబడిన 11,854 మందికి మొదటి డోస్ ఇచ్చినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. 5530 మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ సెకండ్ డోస్ తీసుకున్నట్లు తెలిపారు, సమయం తేదీని స్వయంగా నిర్ణయించుకునే వెసులుబాటు ఇవ్వడంతో అనేక మంది స్లాట్ బుక్ చేసుకుంటున్నారని వైద్యాధికారులు చెప్పారు
Read More »ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతురాలినే ఎన్నుకుందాం…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ ఎన్ఆర్ఐ కాలనిలో స్థానిక నాయకుడు శ్రీకర్ గుప్త గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పట్టభద్రులతో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు, స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బలపర్చిన టీఆర్ఎస్ …
Read More »యాదాద్రిలో ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్
పంచనారసింహ క్షేత్రం యాదగిరిగుట్టలో ఆలయ అభివృద్ధి పనులను సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నారు. అంతకు ముందు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా యాదగిరిగుట్టపైకి చేరుకున్నారు. నేరుగా బాలాలయానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారు. అంతకు ముందు ఆయనకు అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్థపతి వేలు, ఆనంద్ సాయి, యాడా అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఈ …
Read More »పల్లా రాజేశ్వరరెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించండి. ఎంపీ నామ
ఖమ్మం – నల్గొండ – వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీ.ఆర్.ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి గారి విజయాన్ని కాంక్షిస్తూ బుధవారం నాడు సాయంత్రం కొత్తగూడెం లోని క్లబ్ హాల్ నందు వనమా రాఘవ గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు గారితో కలసి టీ.ఆర్.ఎస్ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు గారు …
Read More »బీజేపీకి మంత్రి కేటీఆర్ హెచ్చరిక
కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఎలాంటి పోరాటానికైనా తాము సిద్ధంగా ఉన్నామని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బీజేపీ నేతృత్వంలోని కేంద్రాన్ని హెచ్చరించారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అనవసరం అన్న కేంద్ర ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని లేకుంటే తమ పార్టీ ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా తగిన కార్యాచరణ చేపడుతుందని తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపైన …
Read More »