తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రసంగం ప్రారంభించారు. ఈ సమావేశాలకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం స్పీకర్ పోచారం అధ్యక్షతన బీఏసీ(సభా వ్యవహారాల సంఘం) సమావేశం కానుంది. ఈ సమావేశంలో బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నారు.
Read More »తెలంగాణ ప్రగతి అనేక రాష్ర్టాలకు ఆదర్శం-గవర్నర్ తమిళ సై
ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలను, పథకాలను విజయవంతంగా అమలుచేసి తెలంగాణ రాష్ట్రం దేశానికే ఒక రోల్మోడల్గా నిలిచిందని గవర్నర్ తమిళి సై సౌందర్రాజన్ పేర్కొన్నారు. అతితక్కువ వయసున్న యంగ్ స్టేట్గా తెలంగాణ అనూహ్యమైన వేగంతో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నదని అభినందించారు. వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తేవడంతో తెలంగాణ రైస్బౌల్ ఆఫ్ ఇండియాగా మారిందని కొనియాడారు. వినూత్న పంథాలో, సరికొత్త ఆలోచనలతో అభివృద్ధి, సంక్షేమ పథకాలను చేపట్టడంలో తెలంగాణ మిగతా రాష్ర్టాలకంటే ముందువరుసలో …
Read More »సర్కారు దవాఖానల్లో సేవలు భేష్
కరోనా బాధితులకు సర్కారు దవాఖానల్లో గొప్ప సేవలు అందుతున్నాయని, అక్కడి డాక్టర్లు బాగా పనిచేస్తున్నారని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ కితాబిచ్చారు. సర్కారు దవాఖానల్లో నమ్మకంగా చికిత్స తీసుకోవచ్చని చెప్పారు. సోమవారం రాఖీ పండుగ సందర్భంగా కరోనా నుంచి కోలుకుని, ప్లాస్మా దానం చేసిన 13 మందికి గవర్నర్ రాఖీలు కట్టి, స్వీట్లు అందించారు. సర్కారు దవాఖానల్లో డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది అంకితభావంతో సేవలు చేస్తున్నారని అభినందించారు. ప్రైవేటు దవాఖానలుసైతం …
Read More »తెలంగాణ రాజ్ భవన్లో కరోనా కలవరం
తెలంగాణ రాష్ట్ర రాజ్ భవన్లో కరోనా కలకలం రేపుతోంది. రాజ్ భవన్లో భద్రతను పర్యవేక్షించే 28మంది పోలీసులకు, పనిచేసే మరో 10 మంది సిబ్బంది, సిబ్బంది కుటుంబీకుల్లో మరో 10 మందికి కరోనా నిర్ధారణ అయింది. బాధితులనుS.R. నగర్ లో ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాజ్భవన్లో మొత్తం 395 మందికి కరోనా పరీక్షలు చేయగా 347మందికి నెగెటివ్ గా నిర్ధారణ అయ్యింది.
Read More »హైదరాబాద్ కు చేరుకున్న రాష్ట్రపతి
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ రోజు శుక్రవారం శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు చేరుకున్నారు. నగరంలోని బేగంపేటలో విమానశ్రయానికి ఆయన చేరుకున్నారు. ఈ క్రమంలో గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ ,ముఖ్యమంత్రి కేసీఆర్ ,రాష్ట్ర సీఎస్ తో సహా సంబంధిత అధికారులు ,మంత్రులు,పార్టీ నేతలు హజరై రాష్ట్రపతికి స్వాగతం పలికారు. ఈ రోజు శుక్రవారం నుండి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు …
Read More »తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శం
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. గవర్నర్ తమిళ సై నిన్న మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా గవర్నర్ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో గవర్నర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లక్ష్మీ పంపుహౌస్ (కన్నెపల్లి), లక్ష్మీ (మేడిగడ్డ), సరస్వతి (అన్నారం) బరాజ్లను సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ “సీఎం కేసీఆర్ అత్యంత …
Read More »ఢిల్లీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల విడుదలైన నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తన సమీప ప్రత్యర్థి ,టీపీసీసీ చీఫ్,ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి అయిన ఉత్తమ్ పద్మావతి రెడ్డిపై నలబై మూడు వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సంగతి విదితమే. దీంతో తాజాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న శుక్రవారం ఢిల్లీకి వెళ్లారు. …
Read More »గవర్నర్ తమిళ సైకి ఆహ్వానం
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత,మాజీ ఎంపీ వీ హన్మంత్ రావు గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ను నిన్న శుక్రవారం హైదరాబాద్ మహానగరంలోని రాజ్ భవన్ లో కలిశారు. ఈ భేటీ సందర్భంగా ఈనెల ముప్పై ఒకటో తారీఖున తన నివాసంలో జరగనున్న సత్యనారాయణ వ్రతానికి రావాలంటూ గవర్నర్ తమిళ సై ను వీహెచ్ ఆహ్వానించారు. అంతేకాకుందా ఆర్టీసీ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో …
Read More »తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళ సై ప్రశంసలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ,అధికార టీఆర్ఎస్ ప్రభుత్వంపై గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ప్రశంసల వర్షం కురిపించారు. సోమవారం హైదరాబాద్ లో రాజేంద్రనగర్ లో వర్సిటీ ఆడిటోరియంలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల వాణిజ్య వ్యవసాయ సదస్సుకు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళ సై మాట్లాడుతూ” తెలంగాణలో రైతు సంక్షేమం భేష్.యువతను వ్యవసాయం వైపు మళ్లించాలి.రైతుసంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వ చర్యలు బాగున్నాయి.వ్యవసాయ&రైతు …
Read More »రాజభవన్ ప్రాంగణంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని రాజభవన్ ప్రాంగణంలో నేడు ఐదవ రోజు ‘వేపకాయల బతుకమ్మ’ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నరు డా. తమిళిసై సౌందరరాజన్ మాట్లాడూతూ, మనం గత ఐదు రోజులుగా జరుపుకుంటున్న పపు బతుకమ్మ, నృత్య బతుకమ్మ, వాద్య బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ… ఇలా మనం జరుపుకునే పండుగలు మన సాంప్రదాయాలతో పాటు మన ఆరోగ్యాన్ని కూడా కాపాడేవిగా ఉంటాయని, అలాగే ఈరోజు జరుపుకునే …
Read More »