తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఆయన ఫ్యామిలీ ని కేంద్రంలోని ప్రధానమంత్రి నరేందర్ మోదీ సర్కార్ టార్గెట్ చేసినట్లు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. ఈరోజు శనివారం ఆయన తన ట్విట్టర్లో స్పందిస్తూ.. దేశంలోని ముస్లింలను ఆర్థికంగా వెలివేయాలని బీజేపీ ఎంపీలు పిలుపునిచ్చినట్లు అసద్ పేర్కొన్నారు. మరో వైపు బీజేపీ ప్రభుత్వం నీచ రాజకీయాలకు పాల్పడుతున్నట్లు ఆయన విమర్శించారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం కృషి …
Read More »కొత్తగా మరో 10 లక్షల మందికి ఆసరా పింఛన్లు
సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం ప్రగతిభవన్లో మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్వాతంత్ర దినోత్సవం కానుకగా 15 నుంచి రాష్ర్టంలో కొత్తగా మరో 10 లక్షల మందికి ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది తెలంగాణ రాష్ర్ట మంత్రిమండలి. వీటితో పాటు రాష్ర్టంలో ఖాళీగా ఉన్న 5,111 అంగన్వాడీ ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది కేబినెట్. 58,59 జీవోల కింద పేదలకు …
Read More »టీచర్లంతా ఆస్తులు వెల్లడించాల్సిందే: తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు
ఉపాధ్యాయుల విషయంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి సంవత్సరం టీచర్లు తమ ఆస్తుల వివరాలను ప్రకటించాలని ఆదేశించింది. నల్గొండ జిల్లా గుంటిపల్లి పాఠశాల హెడ్మాస్టర్ మహమ్మద్ జావేద్ అలీ విధులకు హాజరుకాకుండా రాజకీయ కార్యకలాపాలు, స్థిరాస్తి వ్యాపారాలు, సెటిల్మెంట్లలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారంటూ 2021లో ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అతడిపై వచ్చిన ఆరోపణల్లో చాలా వరకు నిజమేనని తేల్చింది. విద్యాశాఖ …
Read More »కొత్తగా చేరే గవర్నమెంట్ డాక్టర్ల ప్రైవేట్ ప్రాక్టీస్పై నిషేధం
గవర్నమెంట్ డాక్టర్ల అంశంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓ జీవోను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. కొత్తగా ఉద్యోగాల్లో చేరే డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీస్ను నిషేధించింది. ఇది వరకే ప్రభుత్వ డాక్టర్లుగా ఉన్నవాళ్లు తమ ప్రైవేట్ ప్రాక్టీస్ను కొనసాగించుకోవచ్చని జీవోలో పేర్కొన్నారు. ఈ మేరకు మెడికల్ ఎడ్యుకేషన్ రూల్స్ను ప్రభుత్వం సవరించింది. త్వరలో రాష్ట్రంలో డాక్టర్లు, స్టాఫ్ నర్సులు సహా ఇతర సిబ్బందిని నియమించనున్నారు. …
Read More »అప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డాం: కేటీఆర్
తెలంగాణ ఏర్పడిన కొత్తలో అనేక ఇబ్బందులు పడ్డామని.. పొరుగు రాష్ట్రాలతో పోటీపడి అనేక పరిశ్రమలను తెచ్చుకున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం అనేక ఇండస్ట్రీలు వస్తున్నాయని చెప్పారు. పరిశ్రమల శాఖ వార్షిక నివేదికను కేటీఆర్ ఈరోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో చిన్న, మధ్య తరహా పారిశ్రామిక వేత్తల పాత్ర కీలకమని చెప్పారు. ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్క్లూజివ్ గ్రోత్.. ఈ …
Read More »నిఖత్ జరీన్, ఇషా సింగ్కు కేసీఆర్ భారీ నజరానా
వరల్డ్ ఉమెన్స్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకం సాధించిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్కు సీఎం కేసీఆర్ భారీ నజరానా ప్రకటించారు. ఆమెతో పాటు ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్లో గోల్డ్ మెడల్ సాధించిన ఇషా సింగ్కు కూడా నజరానా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇద్దరికీ చెరో రూ.2కోట్ల చొప్పున నగదు.. జూబ్లీహిల్స్ లేదా బంజారాహిల్స్లో ఇంటి లం కేటాయించాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు.
Read More »ఎంజీఎం ఘటనపై ప్రభుత్వం సీరియస్..
వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ ఐసీయూలో రోగిని ఎలుకలు కొరికేసిన ఘటనను రాష్టప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఎంజీఎం సూపరింటెండెంట్ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇప్పటికే ఈ ఘటనపై వైద్యారోగ్యశాఖ మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ నేపథ్యంలో సూపరింటెండెంట్ను బదిలీ చేయడంతో పాటు మరో ఇద్దరు వైద్యులను …
Read More »హైదరాబాద్లో RRR బెనిఫిట్ షోలకి పర్మిషన్.. ఎన్ని థియేటర్లో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో RRR మూవీ మేనియా ఇప్పుడు కొనసాగుతోంది. ఏపీ, తెలంగాణతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రేపే రిలీజ్ అవుతోంది. ఎన్టీఆర్, రామచరణ్ హీరోలుగా నటించిన ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించారు. ఇప్పటికే థియేటర్ల వద్ద సందడి వాతావరణ నెలకొంది. రేపు ఉదయం నుంచి 7 గంటల నుంచి షోలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో సెషల్ బెనిఫిట్ షో వేసేందుకు మూవీ టీమ్ …
Read More »పంజాబ్లాగే మా వడ్లు కూడా తీసుకోవాల్సిందే: నిరంజన్రెడ్డి
ధాన్యం సేకరణ బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదేనని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. ఈ విషయాన్ని ఎన్నోసార్లు చెప్పామన్నారు. ఢిల్లీలో రాష్ట్ర మంత్రుల, టీఆర్ఎస్ ఎంపీలతో నిర్వహించిన మీడియా సమావేశంలో నిరంజన్రెడ్డి మాట్లాడారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చాలా హేళనగా మాట్లాడారని.. తెలంగాణ రాష్ట్రం, ప్రజలను ఆయన అవమానించారని ఆరోపించారు. రా రైస్, బాయిల్డ్ రైస్ అనేది తమకు సంబంధం లేదని.. మిల్లర్లతో మాట్లాడుకుని కేంద్రమే పట్టించుకోవాలన్నారు. …
Read More »RRR టికెట్ రేట్లు.. తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. ఎంతంటే?
త్వరలో రిలీజ్ కానున్న RRR సినిమా టికెట్ల రేట్లను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి మూడు రోజులపాటు సాధారణ థియేటర్లలో రూ.50 వరకు, తర్వాత మూడు రోజులు రూ.30 వరకు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. మల్టీప్లెక్స్ల్లో తొలి మూడు రోజులు రూ.100 వరకు రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. మరోవైపు థియేటర్లలో ఐదో ఆటకు కూడా ప్రభుత్వం ఓకే చెప్పింది. ఉదయం 7 గంటల నుంచి …
Read More »