తెలంగాణ ఉద్యమంలో ఎన్నారైల కృషి అభినందనీయమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణకు పెట్టుబడులు ఆహ్వానించేందుకు లండన్ పర్యటనలో ఉన్న ఆయన శనివారం ఇక్కడ ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పాటు చేసిన మీట్ ఎండ్ గ్రీట్ లో పాల్గొని ప్రసంగించారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటాలకు నమస్కరించారు. తెలంగాణ అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి, …
Read More »మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తో సీఎం కేసీఆర్ భేటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఢిల్లీ పర్యటనలో భాగంగా శనివారం నాడు ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాది పార్టీ అధినేత శ్రీ అఖిలేష్ యాదవ్ గారు ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారితో సమావేశమయ్యారు. ఢిల్లీ లోని సీఎం కేసీఆర్ గారి అధికారిక నివాసంలో వారి భేటీ కొనసాగుతున్నది. ఈ సందర్భంగా పలు జాతీయ అంశాల పై ఇరువురు నేతలు చర్చిస్తున్నారు. సీఎం కేసీఆర్ గారి వెంట టి.ఆర్.ఎస్ లోక్ …
Read More »తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ: పవన్
రానున్న ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్కల్యాణ్చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మృతిచెందిన జనసేన కార్యకర్తల కుటుంబాలను ఆయన పరామర్శించి ఆర్థికసాయం అందించారు. వలిగొండ మండలం గోకారం, కోదాడలో కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా కోదాడలో మీడియాతో పవన్ మాట్లాడారు. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో జనసేనకు 5వేలకు పైగా ఓట్లు ఉన్నాయన్నారు. ఆ ఓట్లతో గెలవలేనప్పటికీ రాజకీయాలపై కచ్చితంగా ప్రభావం చూపిస్తుందని …
Read More »అమిత్షాజీ.. వీటికి సమాధానం చెప్పగలరా?: కవిత ప్రశ్నల వర్షం
కేంద్రంహోమంత్రి, బీజేపీ సీనియర్నేత అమిత్షా తెలంగాణ పర్యటన సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పలు ప్రశ్నలు సంధించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్ర ముగింపు సభ రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరగనుంది. ఈ సభకు అమిత్షా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో అమిత్షా సమాధానం చెప్పాలంటూ ట్విటర్ వేదికగా కకవిత ప్రశ్నల వర్షం కురిపించారు. వెనుకబడిన ప్రాంతాల కింద తెలంగాణకు రావాల్సిన రూ.1,350 కోట్లు, …
Read More »అమిత్షా పర్యటన.. కేటీఆర్ బహిరంగ లేఖ
తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంపై వివక్ష కొనసాగుతూనే ఉందని ఆరోపించారు. రేపు తెలంగాణలో కేంద్రహోంమంత్రి పర్యటన నేపథ్యంలో కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 8 ఏళ్లు గడిచినా తెలంగాణపై అదే వివక్ష కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఏపీ పునర్విభజన చట్టంలోని ఒక్కహామీని కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. తెలంగాణ ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ …
Read More »బండి సంజయ్పై కేటీఆర్ పరువునష్టం దావా!
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. తన లాయర్ ద్వారా కేటీఆర్ నోటీసుల పంపారు. కావాలనే బండి సంజయ్ అబద్ధాలు చెబుతున్నారని.. ఇంటర్ విద్యార్థుల సూసైడ్ ఘటనలను కేటీఆర్కు ఆపాదిస్తున్నారని ఆయన తరఫు లాయర్ నోటీసుల్లో పేర్కొన్నారు. అందుకే నోటీసులు ఇస్తున్నట్లు తెలిపారు. 48 గంటల్లో కేటీఆర్కు సారీ చెప్పాలని.. లేకపోతే క్రిమినల్, సివిల్ చట్టాల ప్రకారం కేటీఆర్కు పరిహారం ఇవ్వాల్సి …
Read More »వందల ఎకరాలున్న కుటుంబంలో కేసీఆర్ పుట్టారు: కేటీఆర్
తమ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు సులువైనవే అయితే 60 ఏళ్లుగా దేశాన్ని పాలించిన వాళ్లు ఎందుకు వాటిని అమలు చేయలేదని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ రైతు కుటుంబం నుంచి వచ్చినందునే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని చెప్పారు. కామారెడ్డి జిల్లా కోనాపూర్లో పలు అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ‘ మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా తన నానమ్మ జ్ఞాపకార్థం సొంత ఖర్చులతో స్కూల్ …
Read More »టీఆర్ఎస్కు ప్రజలే హైకమాండ్: హరీశ్రావు
కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రూ. 2,500 కోట్లు ఇస్తే వస్తుందటని.. ఈ మాట కర్ణాటక బీజేపీ ఎంపీనే చెప్తున్నాడని తెలంగాణ మంత్రి హరీశ్రావు గుర్తు చేశారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుర్చీ కోసం కొట్లాడుకుంటున్నాయని మంత్రి విమర్శించారు. ఒక పార్టీలో ఓటుకు నోటు.. మరో పార్టీలో సీఎం సీటుకు నోటు పంచాయితీ ఉందని ఎద్దేవా చేశారు. జయశంకర్ భూపాలపల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాన చేసిన అనంతరం నిర్వహించిన …
Read More »రాహుల్.. మీరు రిటైర్ అవుతారా? ఫైటర్గా మారుతారా?: బాల్క సుమన్
ఆరుదశాబ్దాలుగా బీజేపీ, కాంగ్రెస్ కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తూనే ఉన్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. రెండు జాతీయ పార్టీల నేతలు ఇప్పుడు తెలంగాణపై దండయాత్రకు వస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్లోని టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సుమన్ మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ నుంచి ప్రజలకు విముక్తి కావాల్సి ఉందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ విజన్ ఎందుకు లేదో జేపీ …
Read More »ఓయూలో రాహుల్ పర్యటన.. ఎన్ఎస్యూఐ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు
ఓయూలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పర్యటనకు అనుమతిచ్చేలా ఆదేశాలు జారీ చేయాలంటూ ఎన్ఎస్యూఐ నేతలు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. రాహుల్ పర్యటనకు వీసీ అనుమతి నిరాకరించిన నేపథ్యంలో ఎన్ఎస్యూఐ నేతలు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. పిటిషన్ను కొట్టివేసింది. ఓయూ క్యాంపస్లో రాజకీయ, మతపరమైన సమావేశాలకు అనుమతించకూడదని.. అందుకే సభకు పర్మిషన్ ఇవ్వలేమని ఇటీవల వీసీ పేర్కొన్నారు. వీసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ …
Read More »