దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య బడుగు, బలహీన వర్గాల బాంధవుడు అని మంత్రి కేటీఆర్ అన్నారు.ఈరోజు శాసనసభలో నోముల మృతి పట్ల సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు తెలిపారు కేటీఆర్. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎనిమిది సంవత్సరాలుగా నోములతో అనుబంధం ఉంది. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో మున్సిపాలిటీలు లేవు. 15 వేల పైచిలుకు జనాభా ఉండే మేజర్ గ్రామపంచాయతీలను మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో …
Read More »మానవత్వం చాటుకున్న మంత్రి కొప్పుల ఈశ్వర్
తీవ్ర అనారోగ్యంతో నిమ్స్ లో చేరిన తన నియోజకవర్గ కేంద్రం ధర్మపురి కేంద్రానికి చెందిన దేవి శంకర్ చికిత్స కోసం మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు ప్రభుత్వం నుంచి 3లక్షల రూపాయలు మంజూరు చేయించారు.ఇందుకు సంబంధించిన LOC పత్రాన్ని శంకర్ భార్య దేవి అంజలి చేతికి మంత్రి అందించారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో కొన్ని రోజులుగా బాధపడుతున్న శంకర్ శనివారం నిమ్స్ లో చేరారు. విషయం తెలుసుకున్న కొప్పుల వెంటనే …
Read More »జీహెచ్ఎంసీలో తగ్గిన కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గడిచిన 24 గంటల్లో మరో 35 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో తెలిపారు. దీంతో ఇప్పటి వరకు 81,292 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని అధికారులు సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో టెస్టులు చేయించుకోవాలని సూచించారు
Read More »తెలంగాణలో కొత్తగా 157 కరోనా కేసులు
తెలంగాణలో గత రాత్రి గం.8 వరకు కొత్తగా 157 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,01,318కు పెరిగింది. ఇక నిన్న కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,654కు చేరింది. నిన్న కరోనా నుంచి 166 మంది కోలుకోగా రాష్ట్రంలో ప్రస్తుతం 1,983 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసిన ప్రముఖులు వీళ్ళే..!
రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్నగర్, వరంగల్-నల్గొండ-ఖమ్మం శాసన మండలి పట్టభద్రుల స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా ఆయా జిల్లాల్లోని ప్రముఖులు ఓటుహక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ షేక్పేట తహసీల్దార్ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ క్యూలైన్లో బారులు తీరి ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పట్టభద్రులంతా ఓటుహక్కును వినియోగించుకోవాలని, అభివృద్ధికి పాటుపడే అభ్యర్థికే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఓల్డ్ మలక్పేటలోని అగ్రికల్చర్ కార్యాలయంలో హోంమంత్రి మహబూబ్అలీ, మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని …
Read More »ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే
తెలంగాణలో జరుగుతున్న హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఈరోజు ఆదివారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ కుత్బుల్లాపూర్ గ్రామంలోని శివ విద్యానికేతన్ హై స్కూల్ లోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పట్టభద్రులకు మాత్రమే ఓటు వేసే అవకాశం ఉన్న ఈ ఎన్నికల్లో ప్రతి ఓటరు తమ అమూల్యమైన ఓటు …
Read More »ఓటు వేసిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల ,మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ షేక్ పేట్ తహసీల్దార్ కార్యాలయంలో పోలింగ్ కేంద్రంలోమంత్రి కేటీఆర్ ఓటేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రులంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ‘సమస్యలను పరిష్కరించే అభ్యర్థికి ఓటేశాను. అభివృద్ధికి పాటుపడే అభ్యర్థికి మద్దతుగా నిలిచాను. విద్యావంతులంతా సమర్థులకే ఓటేయాలి. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ …
Read More »టీఆర్ఎస్ కార్యకర్త బిడ్డ పుట్టిన రోజు మంత్రి కేటీఆర్ “సర్ ప్రైజ్ గిఫ్ట్”
కరీంనగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఖాజా నవాజ్ హుస్సేన్, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఆదేశాల మేరకు, హైదరాబాద్ నగరంలో గత 20 రోజులుగా ఉంటూ, పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనటం జరుగుతోంది. ఈ క్రమంలో ఖాజా నవాజ్ హుస్సేన్ మామ చనిపోవడం జరిగింది. అయినప్పటికీ పార్టీ అప్పజెప్పిన భాద్యతలను నిర్వర్తించడానికి, ఎన్నికల సమయం కూడా సమీపిస్తుండటంతో అంత్యక్రియలకు కూడా హాజరు కాకుండా హైదరాబాద్ లోనే ఉంటూ …
Read More »గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 52 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 52 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో తెలిపారు. దీంతో ఇప్పటి వరకు 81,211 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రజలు నిర్లక్ష్యంగా చేయకుండా కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని అధికారులు తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో టెస్టులు చేయించుకోవాలని సూచించారు
Read More »తెలంగాణలో కొత్తగా 216 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి గడిచిన 24 గంటల్లో కొత్తగా 216 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,00,933కి చేరింది. ఇందులో 1,918 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటివరకు 2,97,363 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఇద్దరు చనిపోగా, మొత్తం మరణాల సంఖ్య 1,652కి చేరింది. రాష్ట్రంలో కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 52 ఉన్నాయి
Read More »