Home / Tag Archives: telanganacmo (page 50)

Tag Archives: telanganacmo

రైతులకు అండగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం

రైతులకు అన్ని విధాలా అండగా నిలిచింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ గారు అన్నారు.రైతులకు అన్ని విధాలా అండగా నిలిచింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ గారు అన్నారు. కడెం మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు 24 గంటలు కరెంటు కావాలో, మూడు గంటల కరెంటు కావాలో తేల్చుకోవాలన్నారు. గత ప్రభుత్వాలు రైతులను …

Read More »

విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం ఉండకూడదు

తెలంగాణలో వర్షాల ప్రభావంతో విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం కలుగ కుండా చూడాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస ప్రాంగణంలో ఆయన ఇంధన శాఖా ప్రత్యేక కార్యదర్శి సునీల్ శర్మ, ట్రాన్స్కో&జెన్కో సి యం డి దేవులపల్లి ప్రభాకర్ రావు,టి ఎస్ ఎస్ పి డి సి ఎల్ సి యం డి రఘుమారెడ్డి లతో …

Read More »

ఆగస్టు మొదటివారం నుంచి జీహెచ్‌ఎంసీలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని అర్హులైన లబ్ధిదారులకు అందించే కార్యక్రమానికి ప్రభుత్వం త్వరలో శ్రీకారం చుట్టబోతున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో లక్ష ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకొని వాటిని వేగంగా పూర్తి చేస్తున్నదని, ఇప్పటికే ఇందులో అత్యధిక భాగం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల …

Read More »

మహబూబాబాద్,ములుగు, భూపాలపల్లి జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు మహబూబాబాద్,ములుగు, భూపాలపల్లి జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.భారీ వర్షాల దృష్ట్యా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు క్షేత్రస్థాయి పరిస్థితులను గమనిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేయాలని సూచించారు. జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులు అవసరమైతే హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలని ఆదేశించారు. …

Read More »

మూలధన వ్యయంలోనూ తెలంగాణ టాప్‌

ప్రపంచంలో ఏ దేశమైనా, రాష్ట్రమైనా ఆర్థికంగా బలపడాలంటే మూలధన వ్యయం (క్యాపిటల్‌ ఎక్స్‌పెండిచర్‌) ఎంతో ముఖ్యం. సంపదను సృష్టించి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఇదే ప్రధాన మార్గం. ఇంత ప్రాముఖ్యమున్న మూలధన వ్యయంలో, సంపద సృష్టిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో మూలధన వ్యయం కింద రూ.37,524 కోట్లు ఖర్చు చేయాలని బడ్జెట్‌లో ప్రతిపాదించిన రాష్ట్ర ప్రభుత్వం.. తొలి రెండు నెలల్లోనే రూ.6,785 …

Read More »

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. అప్రమత్తమైన తెలంగాణ వైద్యారోగ్య శాఖ

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో మరో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మహబూబాబాద్, సూర్యాపేట, వరంగల్‌, హనుమకొండ, భద్రాద్రి, ఖమ్మం, జనగామ, యాదాద్రిలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భూపాలపల్లి, సంగారెడ్డి, మెదక్‌, మేడ్చల్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, వికారాబాద్‌లో భారీ వర్షాలు కురవనున్నాయి. దీంతో తెలంగాణలోని 5 జిల్లాలకు వాతావరణ శాఖ …

Read More »

చైర్మన్ల పదవీ బాధ్యత స్వీకరణమహోత్సవంలో పాల్గోన్న మంత్రి హరీష్ రావు

తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ గా మాటం బిక్షపతి, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మొహమ్మద్ తన్వీర్, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేష‌న్ చైర్‌ప‌ర్స‌న్‌గా వేద ర‌జ‌ని పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హారీష్ రావు. ఈ సందర్బంగా ఆయా కార్యాలయాల్లో నిర్వహించిన కార్యక్రమాలకు హాజరై శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీశ్ …

Read More »

మణిపూర్ ఘటనపై మంత్రి కేటీఆర్ ట్వీట్

మణిపూర్ రాష్ట్రంలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనను మంత్రి కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. జాతుల మధ్య ఘర్షణలతో మహిళలను లైంగిక వేధింపులకు గురిచేయడం అనాగరికమన్నారు. దేశంలో అనాగరికత సాధారణంగా ఎలా మారిపోయిందో చెప్పడానికి ఈ బాధాకర ఘటనలు ఉదాహరణగా నిలుస్తున్నాయన్నారు.ఈ భయానక హింసాకాండ, శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతినడాన్ని కేంద్ర ప్రభుత్వం మౌనంగా చూస్తోందని మంత్రి కేటీఆర్‌ ఆక్షేపించారు. మణిపుర్‌లో ఇలాంటి ఘటనలు జరుగుతుంటే.. …

Read More »

అంగరంగ వైభవంగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు

నేరేడుచర్ల BRS పార్టీ పట్టణ అధ్యక్షురాలు &మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ చల్ల శ్రీలత రెడ్డి గారి ఆధ్వర్యంలో నేరేడుచర్ల చౌరస్తా నందు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించినారు. నేరేడుచర్ల సెంటర్ నందు భారీ కేక్ కటింగ్ చేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కెసిఆర్ గారి అడుగుజాడల్లో …

Read More »

రంగం వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్

చిలకలగుడా లోని కట్ట మైసమ్మ దేవాలయం లో రంగం వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్.. . వర్షాలు బాగా కురుస్తాయా, రైతులు సుఖంగా ఉంటారా అని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అడిగిన ప్రశ్నలకు రంగం భవిష్య వాణి లో పాల్గొన్న ప్రజావతి సానుకూలంగా స్పందించి వానలు మంచిగ కురుస్తాయని, రైతులు ఆనందంగా ఉంటారని చెప్పారు. అదే విధంగా ఆలయం విస్తరిస్తామని అశీ ర్వదించాలని డిప్యూటీ స్పీకర్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat