మొహర్రం పండుగ త్యాగం, స్ఫూర్తికి ప్రతీక అని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. విశ్వాసం, నమ్మకం కోసం మహ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమాం హుస్సేన్ చేసిన బలిదానాన్ని గుర్తు చేసుకోవడమే మొహర్రం అని అన్నారు. మానవజాతిలో త్యాగం ఎంతో గొప్పదని , మంచితనం, త్యాగాన్ని గుర్తు చేసుకోవడమే ఈ వేడుకకు నిజమైన అర్థమని అన్నారు. ఇస్లాంలో ముఖ్యమైన మానవతావాదాన్ని ప్రతిబింబించే మొహర్రం స్ఫూర్తిని అనుకరిద్దామని చెప్పారు సీఎం. త్యాగం, శాంతి, …
Read More »రేవంత్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైర్
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానంటున్న రేవంత్ను.. దేని మీద ప్రశ్నిస్తావని నిలదీశారు. ‘వ్యవసాయానికి, పరిశ్రమలకు నిరంతర విద్యుత్ ఇస్తున్నందుకు ప్రశ్నిస్తావా? ఫ్లోరైడ్ వాటర్ సమస్యను తీర్చినందుకు ప్రశ్నిస్తావా? నోటికొచ్చినట్లు మాట్లాడటం పద్ధతి కాదు’’ అని భేతి సుభాష్రెడ్డి పేర్కొన్నారు.
Read More »టీపీసీసీ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైర్
టీపీసీసీ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. రేవంత్ పెద్ద తెలంగాణ ద్రోహి అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుధవారం నాడు జరిగిన ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’ బహిరంగ సభలో రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వము లక్షా 26వేల ఉద్యోగాలు భర్తీ చేసిందన్న విషయాన్ని ఈ సందర్భంగా …
Read More »సీఎం కేసీఆర్ కి అండగా రైతులు
కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక రైతుల సమస్యలపై దృష్టి సారించారు. ఉమ్మడి ఏపీలో ఎంతో మంది సీఎంలు వచ్చారు. కానీ రైతుల సమస్యలను పట్టించుకోలేదు. కేసీఆర్ సాగునీటి సమస్యకు పరిష్కారం చూపారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు అనేకం చూశాం. నీళ్లు లేక, పంటలు పండక, పండిన కూడా గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీటన్నింటినీ చూసిన కేసీఆర్.. రాష్ర్టం ఏర్పడిన తర్వాత తెలంగాణను సస్యశ్యామలం చేయాలని కంకణం …
Read More »అనాథలకు బంగారు భవితను అందిస్తాం -మంత్రి సత్యవతి రాథోడ్
అనాథలకు బంగారు భవితను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నదని, వారికి కేజీ టు పీజీ విద్యనందించడంతోపాటు అదనంగా పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేస్తామని మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. అనాథల సంక్షేమం కోసం ఏర్పాటైన సబ్కమిటీ సభ్యులు బుధవారం సరూర్నగర్లోని వీఎం హోమ్ను సందర్శించారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న చిన్నారుల సమస్యలను, భవిష్యత్తులో వారికి కావాల్సిన వసతులను అడిగి …
Read More »దళితబంధు ఇప్పటిది కాదు..25ఏండ్ల క్రితం నాంది పలికా-సీఎం కేసీఆర్
దళితబంధు తమాషా అనుకోవద్దు. పెద్ద బాధ్యత అప్పగిస్తున్న. దళితబంధు ఈ రోజు పుట్టింది కాదు. 25 ఏండ్లుగా నా మస్తిష్కంలో నిక్షిప్తమై ఉంది. నేను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే, 25 ఏండ్ల క్రితం దళిత చైతన్య జ్యోతికి శ్రీకారం చుట్టిన. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అనాడే పాటలు రాసిండు. కొన్ని ప్రయత్నాలు చేశాం. ఎమ్మెల్యేగా నా మొట్టమొదటి సంతకంతో దళితబిడ్డ, నా క్లాస్మేట్ దానయ్యను మార్కెట్ కమిటీ చైర్మన్గా చేశా. …
Read More »కొత్త బ్యాంకు ఖాతాల్లోనే దళితబంధు పైసలు
పాత అకౌంట్లో వేస్తే పాత బాకీల కింద పట్టుకునే అవకాశం ఉంది. సంవత్సరానికి లక్ష కన్నా ఎక్కువ తీసుకోవద్దనే కేంద్రం పెట్టిన నిబంధన కూడా ఉన్నది. వాటన్నింటినీ అధిగమించి మీరు పెట్టుబడి పెట్టుకోవాలంటే మీరంతా కొత్త బ్యాంకు ఖాతాలు తెరవాలి. కొత్తబ్యాంకు ఖాతాలోనే ఈ డబ్బులు వేసుకోవాలి. కలెక్టర్లు మీకు త్వరలోనే కొత్త ఖాతాలు తెరిపిస్తరు. దీనికి తెలంగాణ దళితబంధు ఖాతా అని పేరు పెట్టుకుంటం. ఆ ఖాతాలోనే డబ్బులు …
Read More »దళితులు కాలరెగరేయాలి
తెలంగాణలో ఏడేండ్ల కిందట రైతుల ఆత్మహత్యలు.. ఆగమైపోయిన బతుకులు.. కరంటు రాదు.. మంచినీళ్లు రావు. ఇట్లా అనేకమైన ఇబ్బందులు. ఇయ్యాల అవన్నీ ఉన్నయా? ఈ రోజు నా తెలంగాణ రైతులు మూడు కోట్ల టన్నుల ధాన్యాన్ని పండిస్తున్నారు. పండిన పంటను గుంజలేక లారీలకు, మోయలేక హమాలీలకు దమ్మొస్తున్నది. రాష్ట్రం ఇంకా ప్రగతి సాధించాలె. కరువు కాటకాల్లేని, సస్యశ్యామల తెలంగాణ కావాలె. అదే పద్ధతిలో గతంలో అణిచివేతకు గురైన, తెలంగాణ రాష్ట్రంలో …
Read More »డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి సీఎం కేసీఆర్ నివాళి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న దళిత బంధు పథకం ప్రారంభోత్సవం సందర్భంగా శాలపల్లి వేదికపై భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ చిత్ర పటాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. ఈ వేదికపై దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించి.. 15 మంది లబ్దిదారులకు చెక్కులను అందించనున్నారు. ఈ పథకం కింద హుజూరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా 20 వేలకు పైగా దళిత కుటుంబాలకు లబ్ది చేకూరనుంది.
Read More »మన అడుగుతో అన్ని రాష్ట్రాల్లో అగ్గి రాజుకుంటుంది: సీఎం కేసీఆర్
హుజూరాబాద్లో శ్రీకారం చుట్టిన దళితబంధు కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లో అగ్గిరాజుకునేలా చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ‘ఇది ఒక సువర్ణ అవకాశం. మన నిర్ణయంతో భారత దళిత జాతి మేల్కొంటుంది. ఉద్యమ స్ఫూర్తి వస్తుంది. అన్ని రాష్ట్రాల్లో అగ్గి రగులుకుంటుంది. పిడికెలిత్తి అడుగుతది. దళిత బిడ్డలకు లాభం జరుగుతది. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఉద్యమానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. మీరు చాలా బాధ్యతగా హుజూరాబాద్లో విజయవంతం చేసి చూపి పెట్టాలె. …
Read More »