బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ ఇటీవల తప్పుకున్న సంగతి విదితమే. పదవి కాలం పూర్తవ్వడంతో దాదా స్థానంలో రోజర్ బిన్నీ ఆ పదవికి ఇప్పటికే నామినేషన్ వేశారు. ఈ క్రమంలో సౌరవ్ గంగూలీకి మద్ధతుగా బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్పందిస్తూ గంగూలీకి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఐసీసీ చైర్మెన్గా సౌరవ్ గంగూలీ పోటీ పడేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రధాని మోదీని అభ్యర్థించనున్నట్లు దీదీ తెలిపారు. బీసీసీఐ నుంచి …
Read More »యూట్యూబ్లో డీఎస్పీ నగ్న వీడియోలు.. సైబర్ నేరగాళ్ల వల!
చర్లపల్లి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ సీహెచ్ దశరథం సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నారు. ఆయనకు సంబంధించిన నగ్న వీడియోలు యూట్యూబ్లో వైరల్ అవుతున్నాయని వాటిని తొలగించేందుకు డబ్బు కావాలని డిమాండ్ చేశారు సైబర్ నేరగాళ్లు. ఈమేరకు డీఎస్పీ నుంచి రూ.97,500 వసూలు చేశారు. డీఎస్పీ ప్రవర్తనను గమనించిన తోటి పోలీసు అధికారి విషయం తెలుసుకుని అది సైబర్ క్రైమ్ అని చెప్పడంతో డీఎస్పీ కుషాయిగూడ పోలీసులను ఆశ్రయించారు. డీఎస్పీ సీహెచ్ …
Read More »మార్కెట్లో దొరికిన బ్యాగ్.. తెరిచి చూస్తే మైండ్ బ్లాంక్..!
వెస్ట్ బెంగాల్లోని ఓ మార్కెట్లో చెత్తకుప్ప దగ్గర అనుమానస్పదంగా ఉన్న ఓ బ్యాగ్ అక్కడి స్థానికుడి కంట పడింది. తెరచి చూడగా ఒక్కసారిగా అతడికి దమ్మతిరిగిపోయింది. ఇంతకీ ఆ బ్యాగ్లో ఏముందో తెలుసా.. సిలిగుడి ప్రాంతంలోని నక్సల్భరీ మార్కెట్లో ఓ వ్యక్తి కంట బ్యాగ్ కనపడింది. తెరచి చూడగా అందులో పుర్రె, వెన్నుముకలు, కాళ్లు చేతుల ఎముకలు ఉన్నాయి. స్థానికులు సైతం భయపడి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు …
Read More »38 మంది తృణమూల్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నారు!
పశ్చిమ్ బెంగాల్కు చెందిన బీజేపీ సీనియర్ నేత మిథున్ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార తృణమూల్ కాంగ్రెస్కు చెందిన 38 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నట్లు ఆయన ప్రకటించారు. ఉపాధ్యాయ నియాకాల్లో జరిగిన అవకతకల వ్యవహారంలో టీఎంసీ మంత్రి పార్థ చటర్జీ అరెస్టైన తర్వాత ఆ పార్టీ తుఫాన్ చెలరేగిందన్నారు. టీఎంసీకి చెందిన 38 మంది ఎమ్మెల్యేల్లో 21 మంది డైరెక్ట్గా తనతోనే టచ్లో ఉన్నారని చెప్పారు. …
Read More »స్వయంగా పానీపూరీ అమ్మిన మమతా బెనర్జీ
తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సింప్లిసిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. హవాయి చెప్పులు, కాటన్ చీరతో చాలా సింపుల్గా కనిపించే ఆమె.. సామాన్య ప్రజలు కనిపిస్తే వారితో ఇట్టే కలిసిపోతారు. ఇటీవల డార్జిలింగ్ పర్యటకు మమత వెళ్లగా అక్కడ పానీ పూరీ అమ్మి అందరినీ ఆశ్చర్య పరిచారు. స్వయంగా పానీపూరీ తయారు చేసి తన స్వహస్తాలతో వినియోగదారులకు అందించారు. సీఎం ఏకంగా పానీపూరీ అమ్మే …
Read More »గంగూలీ పొలిటికల్ ఎంట్రీ? ట్వీట్ చేసిన బీసీసీఐ చీఫ్!
బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారా? అంటే అవుననే సమాధానమే ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. లేటెస్ట్గా ఆయన చేసిన ట్వీట్ దీనికి మరింత బలం చేకూరుస్తోంది. క్రీడా జీవితాన్ని ప్రారంభించి 30 సంవత్సరాలు గడిచాయని.. ఇప్పుడు కొత్త మార్గంలో నడవాలని భావిస్తున్నట్లు ఆయన తన ట్విటర్లో పేర్కొన్నారు. ఈ మేరకు లేఖను గంగూలీ పోస్ట్ చేశారు. ఎప్పటినుంచో గంగూలీ రాజకీయ రంగ ప్రవేశంపై …
Read More »కేంద్రంలో హిట్లర్ కంటే దారుణంగా బీజేపీ పాలన: మమత
కేంద్రంలోని బీజేపీ పాలన హిట్లర్, ముస్సోలిని కంటే దారుణంగా ఉందని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో రాష్ట్రంలోని పాలనా వ్యవహారాల్లో బీజేపీ ప్రభుత్వం తలదూరుస్తోందని ఆరోపించారు. దేశంలోని సమాఖ్య వ్యవస్థలను కూల్చివేస్తోందన్నారు. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా దర్యాప్తు సంస్థలు పనిచేసేలా స్వయం ప్రతిపత్తి కల్పించాలని ఆమె కోరారు.
Read More »BJP కి దిమ్మతిరిగే షాక్
దేశంలో నాలుగు రాష్ర్టాల్లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీకి ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. ఈ నాలుగు రాష్ట్రాల్లో నాలుగు అసెంబ్లీ..ఒక ఎంపీ స్థానానికి జరిగిన ఎన్నికలకు ముందు హిజాబ్, హలాల్ వంటి వివాదాస్పద అంశాలను తెరపైకి తెచ్చి రాజకీయ లబ్ధి పొందాలనుకున్న కమలదళానికి తమ ఓటుతో బుద్ధిచెప్పారు ఓటర్లు. ఒక లోక్సభ, నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో …
Read More »ఏపీ అసెంబ్లీలో ‘పెగాసస్’ రచ్చ.. !
అమరావతి: ఏపీ శాసనసభలో ‘పెగాసస్’ అంశం చిచ్చు రాజేసింది. ఇటీవల వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అక్కడి అసెంబ్లీలో చేసి వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో మరింత వేడిని రాజేశాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెగాసస్ స్పైవేర్ను ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసిందంటూ మమత పేర్కొన్నారు. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అప్పటి ఐటీ మంత్రి లోకేష్ స్పందిస్తూ అలాంటిదేమీ లేదని.. ఆ స్పైవేర్ను కొనలేదని చెప్పారు. ఈ …
Read More »బీజేపీ నేతలూ.. గేమ్ ముగిసిపోలేదు: మమత
కోల్కతా: ఇటీవల జరిగిన ఎన్నికల్లో నాలుగు చోట్ల గెలిచినంత మాత్రాన గేమ్ ముగిసిపోలేదని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ అన్నారు. మరికొన్ని రోజుల్లో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయని.. ఈ విషయాన్ని బీజేపీ గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు. కోల్కతాలో మీడియాతో మమత మాట్లాడారు. ఈసారి రాష్ట్రపతి ఎన్నికలు బీజేపీకి అంత సులువు కావని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేల్లో సగం మంది కూడా ఆ పార్టీకి లేరని.. అందుకే గేమ్ ఇంకా …
Read More »