Home / Masonry Layoutpage 59

Masonry Layout

ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే..!

ఏపీ సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్‌ నిర్ణయాలను మంత్రి వేణుగోపాలకృష్ణ వెల్లడించారు. ఈ ఏడాది ముందుగానే వ్యవసాయ సీజన్‌ను ప్రారంభించి గోదావరి, కృష్ణా వాటర్‌ను ముందే విడుదల చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఇలా చేయడం వల్ల నవంబర్‌లో తుపాను వచ్చే నాటికి పంట చేతికి వస్తుందని మంత్రివర్గం అభిప్రాయం వ్యక్తం చేసి ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. గోదావరి డెల్టాకు …

Read More »

పెళ్లిపీటలపై కళ్లు తిరిగిపడిపోయి.. ఆపై చనిపోయిన వధువు

ఓ పెళ్లి వేడుకలో పీటలపైనే పెళ్లికుమార్తె కళ్లు తిరిగిపడిపోయి ఆపై మృతిచెందిన ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శివాజీ అనే యువకుడికి సృజన అనే యువతితో బుధవారం మధురవాడలో పెళ్లికి నిర్ణయించారు. పెళ్లి పీటలపై సరిగ్గా జీలకర్ర, బెల్లం పెట్టే సమయంలో సృజన ఒక్కసారిగా కళ్లు తిరిగి కిందపడిపోయింది. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం సృజన చనిపోయింది. …

Read More »

కడుపుమంటతోనే టీడీపీ అనవసర రాద్ధాంతం: సజ్జల

రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే కడుపుమంటతో టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కొంతమంది టీడీపీ కార్యకర్తలే ‘గడప గడపకు ప్రభుత్వం’ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారని ఆరోపించారు. అమరావతిలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మూడేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఓడిపోయిన టీడీపీ నేతలను గడపగడపకు పంపాలని.. ధైర్యం ఉంటే వాటన్నింటినీ వీడియో తీసిపెట్టాలని సజ్జల సవాల్‌ …

Read More »

అవాక్కైన నారా లోకేష్ -ఎందుకంటే..?

 ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత. నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి నారాయణ ఫోన్ ట్యాప్ చేశామని మంత్రి పెద్దిరెడ్డి రికార్డెడ్ గా  చెప్పడం తనను నివ్వెరపోయేలా చేసిందని టీడీపీ ప్రధాన కార్యదర్శి,ఎమ్మెల్సీ నారా లోకేష్ అన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ నేతలపై కక్ష సాధించేందుకు వైసీపీ ప్రభుత్వం చట్టాలను విస్మరిస్తోందని ఆయన ఈ సందర్భంగా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి ఫోన్ నైన …

Read More »

మళ్లీ మా 151 సీట్లు మాకే: కొడాలి నాని

జగన్‌ రాజకీయాల్లో లేకపోతే ఇళ్ల కోసం పేదల ప్రజలు అల్లాడిపోయేవారని ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. జగన్‌ కోసం పేద ప్రజలంతా ఒకే వేదికపైకి రావాలని పిలుపునిచ్చారు. గుడివాడలో గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మీడియా సమావేశంలో నాని మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదన్నారు. తన నియోజకవర్గంలో తనకు ఇల్లు లేదని ఏ ఒక్క పేదవాడు అడిగినా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని …

Read More »

అమిత్‌షాకు చంద్రబాబు లేఖ రాయడం వల్ల ఉపయోగం లేదు: సజ్జల

ఏపీలో నారాయణ విద్యాసంస్థ సహా మరికొన్ని ఫ్యాక్టరీలా తయారై విద్యా వ్యవస్థలో నేర సంస్కృతిని ప్రవేశపెట్టాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయా సంస్థలు ఎన్నో ఏళ్లుగా విద్యావ్యవస్థలో మాల్‌ ప్రాక్టీస్‌కి పాల్పడుతున్నాయని చెప్పారు. టెన్త్‌ పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణ ప్రమేయం ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉండటంతోనే పోలీసులు ఆయన్ను అరెస్ట్‌ చేశారన్నారు. అమరావతిలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సజ్జల మాట్లాడారు. టెన్త్‌ …

Read More »

తప్పు చేస్తే ఎలాంటి వారైనా అరెస్ట్‌ అవ్వక తప్పదు: బొత్స

తప్పు చేసిన వారు ఎవరైనా వారిని అరెస్ట్‌ చేయక తప్పదని.. అయితే వారు తప్పులేదని నిరూపించుకోవాలని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. టీడీపీ నేత, మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్‌ నారాయణను చిత్తూరు పోలీసులు అరెస్ట్‌ చేసిన నేపథ్యంలో సీఎం జగన్‌ను మంత్రి కలిశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. టెన్త్‌ ఎగ్జామ్‌ పేపర్లు ఎక్కడెక్కడ లీక్‌ అయ్యాయో అధికారులు విచారణ చేస్తున్నారని చెప్పారు. …

Read More »

తుఫాన్‌ ఎఫెక్ట్‌: ఏపీలో ఇంటర్‌ పరీక్ష వాయిదా

‘అసని’ తుఫాన్‌ ఎఫెక్ట్‌తో ఏపీలో ఇంటర్‌ పరీక్ష వాయిదా పడింది. రేపటి నుంచి ప్రారంభం కావాల్సిన పరీక్షలను తుఫాన్‌ కారణంగా వాయిదా వేస్తున్నట్లు ఇంటర్‌ బోర్డు వెల్లడించింది. రేపు జరగాల్సిన పరీక్షను ఈనెల 25 న  నిర్వహిస్తామని తెలిపింది. మరోవైపు తుఫాన్‌ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. తీరప్రాంతాల్లో అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. దిశ మారుతున్న నేపథ్యంలో ఈ రాత్రి తర్వాత తుఫాన్‌ …

Read More »

పవన్‌.. ప్రజలకైనా ఓ క్లారిటీ ఇవ్వు: పెద్దిరెడ్డి

2024 ఎన్నికల తర్వాత రాజకీయాల నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుకోక తప్పదని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబుకు ప్రజల్లో విశ్వసనీయత లేదని.. ఒంటరిగా పోటీ చేస్తే గెలవడం సాధ్యం కాదని ఆయనకీ తెలుసన్నారు. అందుకే పొత్తుల కోసం చేయాల్సిన అన్నిరకాల ప్రయత్నాలూ చేస్తున్నారని చెప్పారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో పెద్దిరెడ్డి మాట్లాడారు. జగన్‌కు ప్రజల్లో అభిమానం ఉందని.. అందుకే వైసీపీ ధైర్యంగా ఒంటరిగా పోటీ …

Read More »

పొత్తులపై ప్రజల్ని ఫూల్స్‌ చేయాలనుకుంటున్నారు: సజ్జల

ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వమని చెప్తున్న జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌.. టీడీపీతో పొత్తు ఉంటుందా? అనే ప్రశ్నకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. పొత్తులపై జనసేన, టీడీపీ నేతలు చేస్తున్న ప్రకటనలు గందరగోళంగా ఉన్నాయన్నారు. వైసీపీ సెంట్రల్‌ ఆఫీస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సజ్జల మాట్లాడారు. చంద్రబాబు కూడా త్యాగాలకు సిద్ధం అంటూ కూటమినే నడిపిస్తామని చెప్పడమేంటని సజ్జల …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat