వైసీపీ పాలనపై బురద చల్లేందుకే ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఏపీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. అమలాపురం ఘటనల్లో తప్పు చేసిన వారిని విడిచిపెట్టేదే లేదని ఆమె తేల్చి చెప్పారు. అమరావతిలో రోజా మీడియాతో మాట్లాడారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెడితే ఆందోళనలు చేయడం బాధాకరమని విమర్శించారు. ఈ కుట్రల వెనుక ఎవరున్నారో వాళ్లని బయటకు తీస్తామని చెప్పారు. చంద్రబాబు స్క్రిప్ట్నే పవన్ కల్యాణ్ చదువుతున్నారని.. ప్యాకేజీ తీసుకుని …
Read More »Masonry Layout
గౌతమ్రెడ్డి మృతి.. ఆత్మకూరు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల
ఏపీ మంత్రి గౌతమ్రెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరగనుండగా ఏపీలో ఆత్మకూరు అందులో ఒకటి. ఈ మేరకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. మే 20న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. జూన్ 23న ఎన్నికల పోలింగ్ నిర్వహించి జూన్ 26న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. …
Read More »వైసీపీ నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు సస్పెన్షన్
వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ బాబు (అనంతబాబు)ను ఆ పార్టీ అధిష్ఠానం సస్పెండ్ చేసింది. మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉండటంతో వైకాపా అధినేత, సీఎం జగన్ ఆదేశాలతో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సుబ్రమణ్యం మరణానికి తానే బాధ్యుడినంటూ పోలీసులకు అనంతబాబు వాంగ్మూలం ఇచ్చిన నేపథ్యంలో ఆయన్ను సస్పెండ్ చేశారు.
Read More »వెనకుండి రెచ్చగొట్టడం కాదు.. మీడియా ముందుకు రండి: వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్
పచ్చని కోనసీమలో కొన్ని సంఘ విద్రోహ శక్తులు అశాంతిని రేకెత్తించాయని వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్ ఆరోపించారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకే కోనసీమకు డా బీఆర్ అంబేడ్కర్ పేరును రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందని చెప్పారు. చంద్రబాబు కూడా అంబేడ్కర్ జిల్లా పేరు పెడతామని చెప్పారని సుభాష్చంద్రబోస్ గుర్తుచేశారు. బయట ఒకలా..లోపల మరోలా చెప్పొద్దని.. చంద్రబాబు, పవన్కల్యాణ్ మీడియా ముందుకు రావాలన్నారు. వెనుకనే ఉండి రెచ్చగొట్టడం సరికాదని ఆగ్రహం …
Read More »అంబేడ్కర్ పేరుకు అన్ని పార్టీలూ మద్దతు పలికాయి: సజ్జల
జిల్లాల విభజన సందర్భంలో కోనసీమ జిల్లాకు డా.బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలనే డిమాండ్లు వచ్చాయని.. దానికి అన్ని పార్టీలు కూడా మద్దతు పలికాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. విస్తృతంగా డిమాండ్ ఉండటంతోనే అంబేడ్కర్ పేరును ప్రభుత్వం పెట్టిందని చెప్పారు. మహానేత అంబేడ్కర్ పేరు పెడితే అందరూ ఓన్ చేసుకోవాలని సజ్జల అన్నారు. ప్రస్తుత పరిస్థితుల వెనుక ఏ శక్తులు ఉన్నాయో కానీ.. గతంలో మాత్రం అన్ని …
Read More »అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత.. మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పు!
అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ‘కోనసీమ’ జిల్లా పేరును మార్చవద్దంటూ అక్కడి యువకులు ఒక్కసారిగా భారీ ఆందోళనకు దిగారు. అమలాపురం పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్దకు చేరుకుని ‘కోనసీమ జిల్లా ముద్దు.. వేరే పేరు వద్దు’ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడికి పోలీసులు చేరుకుని వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కొందరు యువకులను అదుపులోకి తీసుకోగా వారు తప్పించుకుని పరుగులెత్తారు. వారిని పోలీసులు వెంబడించడం.. ఈ క్రమంలో …
Read More »మంత్రి కేటీఆర్ తో సీఎం జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి దావోస్ పర్యటనలో భాగంగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల సందర్భంగా పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో సమావేశం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావును ముఖ్యమంత్రి జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నేతలిద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ సందర్భంగా ‘ఏపీ సీఎం వైఎస్ జగన్తో గొప్ప సమావేశం జరిగింది’ …
Read More »ఎమ్మెల్సీ అయినా చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు: అంబటి
మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అయినా చర్యలు తీసుకోవాల్సిందేనని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారని ఏపీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఆయన వ్యాఖ్యానించారు. తాడేపల్లిలోని వైసీపీ సెంట్రల్ ఆఫీస్లో నిర్వహించిన ప్రెస్మీట్లో అంబటి మాట్లాడారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో తప్పు చేస్తే ఎమ్మెల్సీ అయినా చర్యలు తప్పవన్నారు. సుపరిపాలన అందిస్తున్న నాయకుడు జగన్ అని.. మంగళగిరిలో ఓడిపోయిన లోకేశ్ తమ …
Read More »దావోస్ పర్యటనలో సీఎం జగన్ బిజీ బిజీ
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దావోస్ పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. రెండో రోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో పాల్గొన్నారు. ఫ్యూచర్ ప్రూఫింగ్ హెల్త్ సిస్టమ్పై ఆయన ప్రసంగించారు. ఏపీలో కరోనాను ఎదుర్కొన్న తీరును ప్రతినిధులకు వివరించారు. ఇంటింటి సర్వే నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఏపీలో నియోజకవర్గానికో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మీటింగ్ తర్వాత జగన్ వివిధ వ్యాపారవేత్తలతో భేటీకానున్నారు.
Read More »కోర్టుకు హజరైన నారా లోకేష్ -ఎందుకంటే..?
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి,ఎమ్మెల్సీ నారా లోకేశ్ విజయవాడ కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు మరో సీనియర్ నాయకుడు కొల్లు రవీంద్ర కూడా ఉన్నారు. 2020లో టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసినప్పుడు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ వైసీపీ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు …
Read More »