తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతున్న తరుణంలో ఏపీలో జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. .రాష్ట్రంలోని అన్ని హిందూ దేవాలయాల్లోని ఉద్యోగాల్లో అన్యమతస్థులను అనుమతించేది లేదని, ఇక నుంచి హిందువులకే ఉద్యోగ అవకాశాలు ఉంటాయని ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ చేసింది. ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానంతోపాటు ఏపీలోని అన్ని దేవాలయాలకు ఇదే నిబంధన వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే ఆయా …
Read More »Blog List Layout
పాలించే రాజును బట్టి ప్రకృతి సహకరిస్తుందంట..!
గత పదేళ్లుగా రాష్ట్రంలో కరువు తాండవించిందనీ, వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మంచి వర్షాలు పడుతున్నాయని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని పాలించే రాజును బట్టి ప్రకృతి సహకరిస్తుందని బుగ్గన వెల్లడించారు. ఆదివారం ఎమ్మిగనూరులో పర్యటించిన మంత్రి.. కరకట్టపై అక్రమంగా ఇల్లు కట్టి ఇంట్లోకి నీళ్లొచ్చాయనడం సరికాదని చంద్రబాబునుద్దేశించి విమర్శించారు. గత ప్రభుత్వం బడా కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించి చిన్న కాంట్రాక్టర్లకి చెల్లింపులు నిలిపివేసిందని ఆగ్రహం వ్యక్తం …
Read More »రేపు సీఎం జగన్ చేతుల మీదుగా గ్రామ సచివాలయ ఉద్యోగులకు నియామకపత్రాలు…!
ఏపీలో గతంలో ఎన్నడూ లేనంతగా జగన్ సర్కార్ ఒకేసారి 1.26 లక్షల గ్రామవాలంటీర్లు, గ్రామ సచివాలయం ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. అతి తక్యువ వ్యవధిలోనే పకడ్బందీగా పరీక్షలు నిర్వహించి, ఇటీవల తుదిఫలితాలను ప్రకటించింది. కాగా రేపు అనగా సెప్టెంబర్ 30 నుంచి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల నియామక పత్రాలు అంజేయనున్నారు. ఈ మేరకు రేపు ఉదయం 10:30 గంటలకు విజయవాడలోని ఎ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో …
Read More »వరంగల్లో శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారి ధర్మ ప్రచార యాత్ర ప్రారంభం…!
ఉమ్మడి వరంగల్ జిల్లాలో విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారి ధర్మ ప్రచార యాత్ర ప్రారంభం అయింది. ఇవాళ వరంగల్ నగరంలోని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంత రావు గారి స్వగృహంలో భక్తులకు స్వామివారు దర్శనం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్తోపాటు, పలువురు ప్రముఖలు స్వామివారిని సందర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఓరుగల్లు పర్యటనలో భాగంగా అక్టోబర్ …
Read More »నేడు అంకురార్పణంతో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం…!
బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్దం అయింది. సప్తగిరులు ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతున్నాయి. ఏడుకొండలు గోవింద నామస్మరణతో మార్మోగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలిరానున్నారు. రేపటి నుంచి అంటే సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 8 వరకు శ్రీ వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలలో తిరుమలేశుడు …
Read More »అనంతపురం జిల్లాలో ‘వైఎస్సార్ కంటి వెలుగు’ఉచిత కంటి పరీక్షలు, ఆపరేషన్లు
వచ్చే నెల 10న అనంతపురం జిల్లాకు వైసీపీ అధినేత , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రానున్నారు. వైఎస్సార్ కంటి వెలుగు పథకం కింద విద్యార్థులతో పాటు అందరికీ ఉచిత కంటి పరీక్షలు, ఆపరేషన్ల కార్యక్రమాన్ని జిల్లా నుంచే సీఎం ప్రారంభించనున్నట్టు ఇన్చార్జి మంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. కలెక్టర్ సత్యనారాయణ ఆధ్యర్వంలో నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశం (డీఆర్సీ)లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా …
Read More »ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు..ఏ రోజున ఏ అలంకారం..
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి ఆదివారం నుంచి దశమి వరకు పది రోజులపాటు అమ్మవారు పది అలంకారాల్లో భక్తులకు దర్శనం ఇస్తారు. రాష్ట్ర పండగ కావడంతో అన్ని ప్రభుత్వ రంగ శాఖలు ఈ ఉత్సవాల్లో భాగస్వామ్యం అవుతున్నాయి. తొలిరోజు శ్రీ స్వర్ణ కవచాలంకృత కనకదుర్గాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. తొలిరోజు స్నపనాభిషేకం అనంతరం ఉ.9 గంటలకు భక్తులు అమ్మవారి …
Read More »చంద్రబాబు, లోకేష్ల ఇజ్జత్ తీసిన ఎన్టీఆర్ సతీమణి..!
చంద్రబాబు, లోకేష్లపై దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి తీవ్ర విమర్శలు చేశారు. పీపీఏలు, రాజధాని తరలింపు, పోలవరం రివర్స్టెండరింగ్లపై చంద్రబాబు, లోకేష్తో సహా టీడీపీ నేతలు వైసీపీ సర్కార్పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విమర్శలకు స్పందించిన వైసీపీ నేత లక్ష్మీ పార్వతి చంద్రబాబు, లోకేష్లపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పీపీఏలు, రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో చంద్రబాబు …
Read More »ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన దేవి నవరాత్రులు..!
విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతంపై దేవీ నవరాత్రి శోభ దేదీప్యమానంగా కనిపిస్తోంది. కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం స్నపనాభిషేకంతో ప్రారంభమయ్యాయి. 10 రోజుల పాటు పది అలంకారాల్లో కనక దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారు. తొలిరోజు కావడంతో తెల్లవారుజామునుంచే పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. తొమ్మిదిరోజులపాటు భక్తులు నవరత్నమాలను వేసుకుంటారు. వారంతా అమ్మవారి సమక్షంలో మాలధారణ స్వీకరించారు. దీనినే భవానీ దీక్ష అంటారు. కాగా ఇంద్రకీలాద్రిపై భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గట్టి …
Read More »స్వర్ణకవచాలంకృత కనకదుర్గాదేవి..!
శరన్నవరాత్రుల ప్రారంభోత్సవం సందర్భంగా తొలి రోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి (ఆదివారం) నాడు అమ్మవారు భక్తులకు స్వర్ణకవచ దుర్గాదేవిగా దర్శనమిస్తున్నారు.. అష్ట భుజాలతో సింహాసనం మీద త్రిశూలధారియై కనకపు ధగధగలతో మెరిసిపోయే ఆ కనకదుర్గమ్మను దర్శించుకోవడం నిజంగా భక్తులకు కనుల పండగే. ఈ అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటే సకల దరిద్రాలూ తొలగిపోతాయంటారు. స్వర్ణకవచాలంకృత కనకదుర్గాదేవి అలంకారంలో అమ్మవారు దర్శనం ఇచ్చే రోజున అమ్మవారికి చక్రపొంగలి, కట్టెపొంగలిని నివేదిస్తారు.
Read More »