Home / Blog List Layoutpage 446

Blog List Layout

సీఎం వైఎస్ జగన్ కు చంద్రబాబు నాయుడు లేఖ

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. కృష్ణానది వరదల విషయంలో ప్రభుత్వం విఫలం చెందిందని ఆయన ఆరోపించారు. సహాయ చర్యలలో నిర్లక్ష్యం కనిపించిందని ఆయన చెప్పారు. ప్రకాశం బారేజీ వద్ద నీటిని సకాలంలో తగ్గించలేదని, ఒకేసారి రెండున్నర లక్షల క్యూసెక్యుల నీరు వదలడంతో లంక గ్రామాలు ముంపునకు గురి అయ్యాయని ఆయన అన్నారు.తన ఇంటికి నోటీసులు ఇవ్వడం, డ్రోన్ లు వేయడంలో …

Read More »

ప్రతీ కుటుంబంలో సుఖ సంతోషాలు నిండేలా విఘ్నేశ్వరుడి దీవెనలు లభించాలి.. సీఎం జగన్

వినాయక చవితి పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తెలుగు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అభివృద్ధికి, సంక్షేమానికి ఆటంకాలు, విఘ్నాలన్నీ తొలగిపోయి ఇంటింటా శుభాలు, విజయాలు కలగాలన్నారు. ప్రతీ కుటుంబంలో సుఖ సంతోషాలు నిండేలా విఘ్నేశ్వరుడి దీవెనలు లభించాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆకాంక్షించారు.

Read More »

జనసేనానిపై ఎంపీ విజయసాయిరెడ్డి అదిరిపోయే సెటైర్…!

చంద్రముఖి సినిమా గుర్తుంది కదా…అందులో చంద్రముఖిలా మారిన హీరోయిన్ జ్యోతికను చూపిస్తూ …చూడు పూర్తిగా చంద్రముఖిలా మారిన గంగను చూడు అంటూ..ప్రభుతో అంటాడు. సేమ్ టు సేమ్..పూర్తిగా చంద్రబాబులా మారిన పవన్ కల్యాణ్‌ను చూడు అంటూ..వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సైటైర్ వేశారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల కృష్ణానది వరదల నేపథ్యంలో రాజధానిగా అమరావతి సేఫ్ కాదని, నిర్మాణాలకు రెట్టింపు ఖర్చు అవుతుందన్న మంత్రి బొత్స వ్యాఖ్యలను వక్రీకరిస్తూ….గత కొద్ది రోజులుగా …

Read More »

ఎక్స్‌క్లూజివ్…బాబు అండతో చెలరేగిపోయిన పచ్చనేతల పాపం పండింది…!

గత ఐదేళ్లు అధికారంలో ఉన్నామనే అహంకారంతో, చంద్రబాబు, లోకేష్‌ల అండతో.. రాజకీయ ప్రత్యర్థులపై దాడులకు తెగబడుతూ…సహజవనరులు దోచుకుంటూ, ప్రజల దగ్గర ట్యాక్స్‌లు వసూలు చేస్తూ… అరాచక పాలన చేసిన టీడీపీ నేతల పాపం పండింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి, అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దీంతో  బెంబేలెత్తిన కోడెల కొడుకు శివరామకృష్ణ, కూతురు విజయలక్ష్మీ, కూనరవికుమార్, చింతమనేని, యరపతినేని, వంటి టీడీపీ నేతలు …

Read More »

చంద్రబాబుకు షాక్…బీజేపీలోకి మాజీ మంత్రి…కడప టీడీపీ ఖాళీ…?

  కడప టీడీపీ కుప్పకూలుతుందా..గత ఎన్నికలలో ఒక్క సీటు కూడా గెలవలేక చతికిలపడిన తెలుగుదేశం పార్టీ…కడపలో పూర్తిగా సమాధి కాబోతుందా..జిల్లాలో కీలక నేతలంతా కాషాయ గూటికి చేరుకుంటున్నారా…ప్రస్తుతం టీడీపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తే నిజమే అనిపిస్తోంది. తాజాగా మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి టీడీపీకి గుడ్‌బై చెప్పి బీజేపీలోకి చేరుతున్నట్లు ప్రకటించారు. స్థానికంగా ఉన్న ఇబ్బందుల వల్లే తాను కాషాయతీర్థం పుచ్చుకున్నట్లు ఆదినారాయణరెడ్డి చెప్పుకొచ్చారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కడప జిల్లాలో …

Read More »

రేపు సీఎం జగన్ ఇడుపులపాయకు..!

సెప్టెంబరు 2వ తేది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కడప జిల్లా పర్యటనకు వస్తున్నారని, పర్యటన విజయవంతానికి పటిష్ఠవంతంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్‌ హరి కిరణ్‌ అధికారులను ఆదేశించారు. సెప్టెంబరు 2వ తేది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఇడుపులపాయ, పులివెందులలో ముఖ్యమంత్రి పర్యటన ఉంటుందన్నారు. సెప్టెంబరు 2వ తేది ఉదయం ప్రత్యేక విమానంలో సీఎం కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో ఇడుపులపాయకు వెళతారన్నారు. వైఎస్సార్‌ ఘాట్‌ …

Read More »

చింతమనేని కోసం.. ప్రత్యేక బృందాలు గాలింపై..ఎస్పీ ..డీఎస్పీ సీరియస్

దెందులూరు నియోజకవర్గంలో రౌడీరాజ్యాన్ని నెలకొల్పి పదేళ్లుగా అరాచకానికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన చింతమనేని ప్రభాకర్‌ పరారీ కావడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దళిత యువతపై దాడికి యత్నించిన సంఘటనలో ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు కావడంతో శుక్రవారం పోలీసుల కళ్లు కప్పి ఉడాయించిన సంగతి తెలిసిందే. దీంతో ఉలిక్కిపడిన పోలీసులు గాలింపు తీవ్రతరం చేశారు. ఐదుగురు సీఐల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను నియమించి గాలిస్తున్నారు. శనివారం చింతమనేని ఇంటికి వెళ్లిన …

Read More »

అన్న క్యాంటీన్లలో భారీ అవినీతి…తేల్చిచెప్పిన నిపుణుల కమిటీ…?

ఏపీలో గత కొద్ది రోజులుగా అన్న క్యాంటీన్లను మూసివేసారంటూ వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు, లోకేష్‌లతో సహా టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అయితే సరిగ్గా 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు బాబు సర్కార్ రాష్ట్రమంతటా అన్నక్యాంటీన్లను ఏర్పాటు చేసింది. ఈ అన్న క్యాంటీన్ల నిర్మాణంలో టీడీపీ పెద్దలు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. ఇటీవల అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ అన్నక్యాంటీన్లలో జరిగిన అవినీతి బాగోతాలపై …

Read More »

వైసీపీలో చేరిన విశాఖ డైరీ చైర్మన్‌ కొడుకు..టీడీపీ కీలక నాయకులు

విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్‌ తగిలింది. జిల్లాకు చెందిన పలువురు టీడీపీ కీలక నాయకులు వైసీపీలో చేరారు. విశాఖ డైరీ చైర్మన్‌ అడారి తులసిరావు కుమారుడు అడారి ఆనంద్‌, కుమార్తె రమాకుమారి, విశాఖ డైరీ బోర్డు సభ్యులు, ఇతర నాయకులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో ఆదివారం వైసీపీ కండువా కప్పుకున్నారు. గత ఎన్నికల్లో అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసిన అడారి ఆనంద్‌ పరాజయం పాలయ్యారు. …

Read More »

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ రాత పరీక్షలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు రాత పరీక్షలు ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి 8వ తేదీ వరకు జరగనున్న ఈ పరీక్షల్లో తొలిరోజు ఒక్కరోజే సుమారు15 లక్షల మందికి పైగా పరీక్షలకు హాజరవుతారని అధికారులు పేర్కొన్నారు. ఇక 3వ తేదీ నుంచి 8వ తేదీ మధ్య ఐదు రోజుల పాటు జరిగే పరీక్షలను 6,19,812 మంది రాయనున్నారని తెలిపారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat