TimeLine Layout

January, 2021

  • 26 January

    తెలంగాణలో కొత్తగా 189 కరోనా కేసులు

    తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 189 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,93,590కి చేరింది. నిన్న కరోనాతో ఇద్దరు మృతి చెందారు.. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మృతుల సంఖ్య 1,589కి చేరింది. ఇప్పటివరకు 2,88,926 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 3,072 యాక్టివ్ కేసులు ఉన్నాయి వీరిలో 1,543 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు.

    Read More »
  • 26 January

    ఏపీ-జంట హత్య కేసులో ట్విస్ట్

    ఏపీలో చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. 4 రోజులుగా ఇంట్లోనే క్ుద్ర పూజలు చేసినట్లు తెలుస్తోంది. చిన్న కూతురు దివ్యను తల్లి డంబెల్ కొట్టి చంపింది.. ఆ తర్వాత దివ్య మృతదేహం చుట్టూ పురుషోత్తం, పద్మజు, అలేఖ్య నగ్నంగా పూజలు చేశారు. అలేఖ్యను పూజగదిలో తండ్రి చంపాడు, ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఏ1గా పురుషోత్తం, ఏ2గా పద్మజ …

    Read More »
  • 26 January

    తెలంగాణ ప్రగతి అనేక రాష్ర్టాలకు ఆదర్శం-గవర్నర్ తమిళ సై

    ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలను, పథకాలను విజయవంతంగా అమలుచేసి తెలంగాణ రాష్ట్రం దేశానికే ఒక రోల్‌మోడల్‌గా నిలిచిందని  గవర్నర్‌ తమిళి సై సౌందర్‌రాజన్‌ పేర్కొన్నారు. అతితక్కువ వయసున్న యంగ్‌ స్టేట్‌గా తెలంగాణ అనూహ్యమైన వేగంతో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నదని అభినందించారు. వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తేవడంతో తెలంగాణ రైస్‌బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా మారిందని కొనియాడారు. వినూత్న పంథాలో, సరికొత్త ఆలోచనలతో అభివృద్ధి, సంక్షేమ పథకాలను చేపట్టడంలో తెలంగాణ మిగతా రాష్ర్టాలకంటే ముందువరుసలో …

    Read More »
  • 26 January

    ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ సంస్థగా టీసీఎస్‌

    దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) మరోమారు తన సత్తాను చాటింది. మార్కెట్‌ విలువలో దేశీయ అత్యంత విలువైన సంస్థగా ఆవిర్భవించింది. ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ను వెనక్కినెట్టి టీసీఎస్‌ తొలి స్థానం సాధించింది. రూ.12,34,609.62 కోట్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌తో టీసీఎస్‌ ఈ సత్తా చాటింది.  రూ.12,29,661.32 కోట్లతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రెండో స్థానంతో సరిపెట్టుకున్నది. ఇంట్రాడేలో 1.26 శాతం పెరిగిన టీసీఎస్‌ షేరు ధర చివరకు …

    Read More »
  • 26 January

    గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్

    దేశ వ్యాప్తంగా గణ‌తంత్ర దినోత్స‌వ వేడుకలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ప్ర‌తి ఒక్క‌రు ఈ వేడుక‌ను ఘ‌నంగా జ‌రుపుకుంటున్నారు. సెల‌బ్రిటీలు త‌మ సోష‌ల్ మీడియా ద్వారా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి దేశ ప్ర‌జ‌లంద‌ర‌కి, మెగా అభిమానుల‌కు, ఆత్మీయులంద‌రికి 72వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ శుబాకాంక్ష‌లు తెలిపారు. రిప‌బ్లిక్ డే సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకొని విస్తృతంగా రక్త‌దానం చేయ‌సంక‌ల్పించిన మెగా బ్ల‌డ్ బ్ర‌ద‌ర్స్‌ని మ‌న‌స్పూర్తిగా ఆహ్వానిస్తున్నాను. నా పిలుపు మేర‌కు స్పందించి, చిరంజీవి బ్ల‌డ్ …

    Read More »
  • 26 January

    మంత్రి కేటీఆర్ దేశ ప్ర‌జ‌లంద‌రికీ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు

    తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ దేశ ప్ర‌జ‌లంద‌రికీ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. నిజ‌మైన స‌మాఖ్య‌స్ఫూర్తి ప‌రిఢ‌విల్లేలా భార‌త ప్ర‌జాస్వామ్య గ‌ణ‌తంత్ర వ్య‌వస్థ బ‌ల‌ప‌డాల‌ని ఆకాంక్షిస్తూ దేశ ప్ర‌జ‌లంద‌రికీ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలుపుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

    Read More »
  • 26 January

    తెలంగాణ మత్స్యశాఖ మరో వినూత్న కార్యక్రమం

    తెలంగాణ మత్స్యశాఖ మరో వినూత్న కార్యక్రమాన్ని రూపొందించింది. తాజా చేపలను, చేపల వంటకాలను నేరుగా వినియోగదారుడి వద్దకు చేర్చడంతోపాటు.. వాటి విక్రయం ద్వారా మహిళలూ ఉపాధి పొందేలా కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఇందుకోసం చేపలతోపాటు, చేపల వంటకాలనూ విక్రయించేలా తయారుచేసిన సంచార విక్రయ వాహనాలను (మొబైల్‌ ఫిష్‌ ఔట్‌లెట్స్‌) అందుబాటులోకి తెచ్చింది. గ్రూపులుగా ముందుకొచ్చే మహిళలకు వీటిని అందజేయాలని నిర్ణయించింది. దీనిద్వారా నిరుద్యోగ మహిళలకు ఉపాధి అందనుండగా.. వినియోగదారుడికి తన …

    Read More »
  • 25 January

    అన్ని కులాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్సీ కవిత

    రాష్ట్రంలోని అన్ని కులాల సంక్షేమ‌మే టీఆర్ఎస్ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత తెలిపారు. జుక్కల్ నియోజకవర్గం పిట్లంలో కుల్లగడగి/కుల్లె కడిగి/చిట్టెపు రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమ్మేళనం, కృత‌జ్ఞ‌త స‌భా ఆదివారం జ‌రిగింది. ఈ స‌భ‌కు ఎమ్మెల్సీ క‌విత హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అన్ని కులాల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తొందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు …

    Read More »
  • 25 January

    కుత్బుల్లాపూర్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా-ఎమ్మెల్యే కెపి వివేకానంద్

    గాజుల రామారం డివిజన్ బేకారి గడ్డలో మంచి నీటి సరఫరా కూలాయి ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కే.పి.వివేకానంద్ పాల్గోన్నారు..గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి మార్గనిర్దేశకత్వంలో కోట్ల నిధులు వెచ్చించి కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు అన్నారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 125 గాజుల రామారం డివిజన్ పరిధిలోని బేకారి గడ్డలో మంచి నీటి …

    Read More »
  • 25 January

    త్వరలోనే సూర్యాపేట ప్రజలకు 24గంటలు మంచినీరు

    సూర్యాపేట పట్టణ ప్రజలకు 24 గంటలు మంచినీరు అందించే రోజులు ఎంతో దూరం లేదని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు వెనుక అన్నది గమనిస్తే 2014 తరువాత పట్టణంలో వచ్చిన మార్పు ఏమిటి అనేది ప్రతి ఒక్కరికీ బోధపడుతుందని అయన అన్నారు.మురికి నీటి నుండి విముక్తి పొంది స్వచ్ఛమైన త్రాగునీరు సరఫరా లొనే అభివృద్ధి కనిపిస్తుందని ఆయన చెప్పారు.17.58 కోట్ల …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat