TimeLine Layout

December, 2020

  • 17 December

    దానికి ఘంటా చక్రపాణి గారే ఉత్తమ ఉదాహరణ

    నిబద్ధత గల ఉద్యమకారులు పరిపాలనలో భాగస్వాములు అయితే తెలంగాణ సమాజానికి ఎంత మేలు జరుగుతుందో ఘంటా చక్రపాణి గారే ఉత్తమ ఉదాహరణ. సుధీర్ఘమైన రాష్ట్రసాధన ఉద్యమం విజయతీరాలకు చేరి స్వరాష్ట్రంగా తెలంగాణ అవతరించాక ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్ గారు తనతో పాటు ఉద్యమంలో నడచివచ్చిన అనేకమంది ఉద్యమకారులను పాలనలో భాగస్వాములను చేశారు. డిసెంబర్ 2014లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఏర్పాటు చేసి దానికి తొలి చైర్మన్‌గా …

    Read More »
  • 17 December

    మిషన్ భగీరథ దేశానికి ఆదర్శం

    తెలంగాణలో ఇంటింటికీ శుద్ధిచేసిన తాగునీటి సరఫరా లక్ష్యం నెరవేరింది. రాష్ర్టానికి ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందించిన ప్రతిష్ఠాత్మక మిషన్‌భగీరథ పథకం మరో ఖ్యాతిని తెచ్చిపెట్టింది. ప్రజలు తాగడానికి శుద్ధి చేసిన నీటిని అందిస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణను దేశంలోనే రెండోస్థానంలో నిలిపింది. మిషన్‌ భగీరథ కారణంగా తెలంగాణలో 98.7 శాతం కుటుంబాలకు స్వచ్ఛమైన, శుద్ధిచేసిన మంచినీరు అందుతున్నది. 99.2 శాతంతో బీహార్‌ మనకంటే ముందున్నది. తెలంగాణలో పట్టణప్రాంతాల్లో 99.4 శాతం, గ్రామాల్లో …

    Read More »
  • 17 December

    అలా అయితే నాకు నచ్చదు

    శారీరక ఛాయను అనుసరించి ముద్దు పేర్లు పెట్టి పిలవడం తనకు నచ్చదని అంటోంది తమన్నా. అభిమానులంతా ఆమెను మిల్కీబ్యూటీ అని సంభోదిస్తుంటారు. అయితే ఆ పిలుపు తనకు సంతోషాన్ని ఇవ్వదని చెబుతోంది తమన్నా. ఆమె మాట్లాడుతూ ‘అభిమానులు మంచి ఉద్దేశంతోనే మిల్కీ బ్యూటీ అని నన్ను అంటోన్న ఆ పిలుపులో నాకు ఆనందం ఉండదు. శరీర వర్ణాన్ని బట్టి పేర్లు పెట్టడం తప్పు అని నా అభిప్రాయం. మనదేశంలో అందమైన …

    Read More »
  • 17 December

    25వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ

    ఉపా‌ధ్యాయ పోస్టులు ఎన్ని ఖాళీ‌లు‌న్నాయి? ఎక్కడ ఎక్కు‌వ‌మంది పని‌చే‌స్తు‌న్నారు? సర్దు‌బాట్లు పోను ఖాళీల లెక్కపక్కాగా తేల్చేం‌దుకు పాఠ‌శాల విద్యా‌శాఖ కస‌రత్తు వేగ‌వంతం చేసింది. విద్యా‌ర్థుల సంఖ్యకు అను‌గు‌ణంగా ఉపా‌ధ్యా‌యుల నియా‌మకానికి ముమ్మర కసరత్తు మొదలైంది. పాఠ‌శాల విద్యా‌శా‌ఖలో అన్ని‌ర‌కాల పోస్టుల కలిపి దాదాపు 25 వేల ఖాళీ‌లు‌న్నట్టు అధి‌కా‌రులు అంచనా వేస్తు‌న్నారు. ఇందులో జిల్లా‌ల‌వా‌రీగా పదో‌న్న‌తులు పోను.. మిగి‌లిన పోస్టు‌లను డైరెక్ట్‌ రిక్రూ‌ట్‌‌మెంట్‌ ద్వారా భర్తీ చేయ‌ను‌న్నారు. ఉన్న ఖాళీ‌ల‌తో‌పాటు …

    Read More »
  • 17 December

    అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యం

    అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని జుక్కల్‌ ఎమ్మె ల్యే హన్మంత్‌షిండే అన్నారు. బుధవారం నిజాంసాగర్‌ ప్రాజెక్టులో రొయ్య పిల్లలను విడుదల చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభు త్వం మత్స్యకారులను ఆదుకునేందుకు నెల రోజు ల కిందటే చేప పిల్లలను ఉచితం గా విడుదల చేసిందని గుర్తు చేశారు. ప్రస్తుతం 24.09 లక్షల రొయ్య పిల్లలను విడుదల చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. …

    Read More »
  • 17 December

    అమెరికా ఉపాధ్యాక్షుడికి కరోనా టీకా

    అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ దంపతులు శుక్రవారం బహిరంగంగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకుంటారని వైట్‌హౌస్‌ ప్రకటించింది. కొవిడ్‌ టీకాపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచేందుకు టీకా తీసుకుంటున్నారని పేర్కొంది. ‘అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌, ఆయన భార్య కరెన్ పెన్స్‌ టీకా భద్రత, సామర్ధ్యాన్ని ప్రోత్సహించడానికి, అమెరికన్ ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడానికి కొవిడ్-19 వ్యాక్సిన్ ను బహిరంగంగా తీసుకుంటారు’ అని వైట్‌హౌస్‌ తెలిపింది. కరోనా మహమ్మారితో విలవిలలాడుతున్న అమెరికాలో ఇటీవల కొవిడ్‌ …

    Read More »
  • 17 December

    1000కోట్లతో ఫియట్ భారీ పెట్టుబడి

    హైదరాబాద్‌ ఐటీ సిగలో మరో చంద్రవంక చేరనున్నది. ఆటోమొబైల్‌ తయారీ దిగ్గజ సంస్థ ఫియట్‌ తన రెండో మజిలీగా హైదరాబాద్‌ను ఎంచుకొన్నది. ప్రపంచశ్రేణి వాహనాల తయారీలో ప్రసిద్ధి చెందిన ఫియట్‌ తెలంగాణలో తమ పరిశ్రమను ఏర్పాటుచేస్తున్నట్టు వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం వల్లే హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడం తమకు సాధ్యపడిందని ఫియట్‌ సగర్వంగా ప్రకటించింది. 150 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లతో (రూ.1,110కోట్లు) ఫియట్‌ గ్లోబల్‌ హబ్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పుతున్నట్టు …

    Read More »
  • 17 December

    ఫియట్ రాక చాలా సంతోషకరం

    ప్రపంచంలో అన్ని రంగాల్లో పురోగమిస్తున్న నగరాల్లో హైదరాబాద్‌ గడిచిన ఐదారేండ్లుగా ముందు వరుసలో నిలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ స్నేహపూర్వక పారిశ్రామిక విధానం వల్ల అనేక కంపెనీలు, సంస్థలు ఇక్కడికి వస్తున్నాయి. ఫియట్‌ సైతం ముందుకు రావడం సంతోషం. ఫియట్‌కు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాం. డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌, ఐటీ, ఆటోమొబైల్‌ సహా అన్ని రంగాలకు తెలంగాణ సమ ప్రాధాన్యం ఇస్తున్నది అని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి …

    Read More »
  • 16 December

    రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త

    రైతుబంధు పథకానికి కొత్త రైతుల నుంచి వ్యవసాయశాఖ దరఖాస్తులు స్వీకరిస్తున్నది. బ్యాంకుఖాతా నంబర్లు, పేర్లు, ఆధార్‌నంబర్లు తప్పుగా ఉన్నవారు కూడా సరైన వివరాలను అందించాలని సూచించింది. ఈ నెల 20 వరకు వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో)కి వివరాలు అందించాలని సూచించింది. ఈ నెల పది వరకు ధరణిలో నమోదైన రైతుల వివరాలను సీసీఎల్‌ఏ నుంచి వ్యవసాయశాఖ సేకరించింది. ఈ నెల 27 నుంచి రైతుబంధు పంపిణీ చేయనున్నట్టు సీఎం …

    Read More »
  • 16 December

    మంత్రి పువ్వాడకు కరోనా

    తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సోమవారం మంత్రి పువ్వాడకు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలో పాజిటివ్‌ వచ్చింది. తనను కలిసినవారు, తనతో వివిధ కార్యక్రమాల్లో సన్నిహితంగా మెలిగిన ప్రతిఒక్కరూ కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. హైదరాబాద్‌ మంత్రుల నివాస ప్రాంగణంలో హోం ఐసోలేషన్‌లో ఉన్నానని తెలిపారు.

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat