TimeLine Layout

February, 2020

  • 11 February

    రేపు కర్నూలు టౌన్ లో పవన్ కళ్యాణ్ ర్యాలీ ..!

    విద్యార్థిని సుగాలి ప్రీతి అత్యాచారం, హత్య ఘటనకు పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ నెల 12 న కర్నూలులో ర్యాలీ చేపట్టి, బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గం.కు రాజ్ విహార్ కూడలి నుంచి కోట్ల కూడలి వరకూ ర్యాలీ నిర్వహిస్తారు. ఈ ర్యాలీలోజనసేన నాయకులూ, శ్రేణులు, వివిధ ప్రజా సంఘాలు పాల్గొంటాయి. అనంతరంకోట్ల కూడలిలో బహిరంగ సభ …

    Read More »
  • 11 February

    రేపు ఢిల్లీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్..!

    ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం నాడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాను సీఎం కలవనున్నారు. బుధవారం సాయంత్రం ప్రధాని మోదీతో సీఎం భేటీ అవుతారని సమాచారం. ఈ భేటీలో రాజధాని అమరావతి అంశం సహా శాసన మండలి రద్దు అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇవే అంశాలపై హోంమంత్రి అమిత్‌ షా తోనూ చర్చించనున్నట్లు తెలుస్తోంది.

    Read More »
  • 11 February

    ఏబీవీ సస్పెన్షన్..చంద్రబాబుకు షాక్ ఇస్తూ కేశినేని మరో సంచలన ట్వీట్..వీడియో వైరల్..!

    ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరావు సస్పెన్షన్ వ్యవహారంపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా ఏబీ సస్పెన్షన్‌పై స్పందిస్తూ జగన్ ప్రభుత్వం ఫాక్షనిస్ట్‌గా వ్యవహరిస్తుందని, అధికారులపై కక్షసాధిస్తుందని ఆరోపణలు చేయడంతో అధికార పార్టీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న సమయంలో దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాలు …

    Read More »
  • 11 February

    ఏపీలో నడి రోడ్డు పై హెచ్.పీ గ్యాస్ ట్యాంకర్ నుండి భారీగా గ్యాస్ లీకేజీ

    ఏపీలో నడి రోడ్డు పై హెచ్.పీ గ్యాస్ ట్యాంకర్ నుండి భారీగా గ్యాస్ లీకేజీ అవుతుంది. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం ఈతకోట టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై విశాఖపట్నం వైపు నుండి విజయవాడ వైపు వెళ్ళుతున్న హెచ్ పి గ్యాస్ ట్యాంకర్ నుండి గ్యాస్ లీకవుతున్న సంఘటనతో ఎటువంటి అవాంచనీయ సంఘటన చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పూర్తి స్థాయిలో రాకపోకలు స్థంభించాయి. స్థానిక ప్రజలు …

    Read More »
  • 11 February

    కోహ్లి సారధ్యంలో 31 సంవత్సరాల తరువాత చెత్త రికార్డు నమోదు !

    న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన ఆనందం కొన్నిరోజులైన అవ్వకముందే టీమిండియాకు ఎదురదెబ్బ తగిలింది. వన్డే సిరీస్ లో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచ్ లు ఓడి సిరీస్ కోల్పోయిన భారత్ మంగళవారం జరిగిన చివరి వన్డేలో కూడా ఓడిపోయింది. తద్వారా సిరీస్ 3-0 తేడాతో కివీస్ భారత్ ను క్లీన్ స్వీప్ చేసింది. ఇక అసలు విషయానికి వస్తే సిరీస్ వైట్ వాష్ అవ్వడంతో …

    Read More »
  • 11 February

    ఆ ఒక్క తప్పే ఇప్పుడు వన్డే సిరీస్ కు కుంపటిగా మారిందా..?

    న్యూజిలాండ్ టూర్ అనగానే అందరికి ఎక్కడో ఒక్క అనుమానం. మొదట టీ20 సిరీస్ జగరనుంది కాబట్టి అందులోను కివీస్ తో టీ20 మ్యాచ్ లో ఇప్పటివరకు అంతగా  విన్నింగ్ శాతం లేకపోవడంతో కచ్చితంగా ఓడిపోతారు అని అనుకున్నారు. కాని 5మ్యాచ్ లు గెలిచి సిరీస్ ని గెలిచి క్లీన్ స్వీప్ చేయడంతో అందరి అంచనాలు తారుమారు అయ్యాయి. అటు బౌలింగ్, ఇటు బ్యాట్టింగ్ అలా అన్ని విభాగాల్లో పర్ఫెక్ట్ అనిపించింది. …

    Read More »
  • 11 February

    సీఎంగా బాధ్యతలు చేపట్టాక మొదటిసారిగా కర్నూల్ జిల్లాకు జగన్..వైసీపీ ఎమ్మెల్యే కొడుకు పెళ్లి

    ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కర్నూలు జిల్లా పర్యటన ఖరారు అయ్యింది. ఇప్పటికే సీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ వీరపాండియన్‌ అధికారులను ఆదేశించారు.సీఎంగా బాధ్యతలు చేపట్టాక మొదటిసారిగా జిల్లాకు వస్తున్నారని కలెక్టర్‌ తెలిపారు. ఈ నెల 17న కల్లూరు మండలం పెద్దపాడు సంజీవయ్య ఉన్నత పాఠశాల ఆవరణంలో వైఎస్సార్‌ కంటి వెలుగు ఫేజ్‌-3 (60 ఏళ్లు పైబడినవారికి కంటి పరీక్షలు) ప్రారంభిస్తారని తెలిపారు. నవరత్నాలలో భాగంగా నాడు-నేడు …

    Read More »
  • 11 February

    రాయిటర్స్‌కు, చంద్రబాబుకు గల చీకటి బంధాన్ని బయటపెట్టిన సీనియర్ జర్నలిస్ట్..!

    ఏపీ నుంచి కియా మోటార్స్ తమిళనాడుకు తరలిపోతుందంటూ ప్రముఖ ఆంగ్ల న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ రాసిన అసత్యకథనంపై రాజకీయంగా పెనుదుమారమే చెలరేగింది. రాయిటర్స్ రాసిన కథనాన్ని అడ్డంపెట్టుకుని టీడీపీ అధినేత చంద్రబాబు చెలరేగిపోయాడు. జగన్ ప్రభుత్వ తీరువల్లే నేను కష్టపడిన తెచ్చిన పరిశ్రమలు తరలిపోతున్నాయంటూ గగ్గోలుపెట్టాడు. ఇక ఎల్లోమీడియా ఛానళ్లు అయితే వైసీపీ నేతల బెదిరింపువల్లే …కియా తమిళనాడుకు తరలిపోతుందంటూ పచ్చ కథనాలు వండి వార్చాయి. అయితే రాయిటర్స్ కథనాన్ని …

    Read More »
  • 11 February

    చేతులెత్తేసిన భారత్..క్లీన్ స్వీప్ చేసిన కివీస్ !

    భారత్, కివీస్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ లో భాగంగా మంగళవారం మూడో వన్డే జరిగింది. ఇందులో భాగంగానే ముందుగా టాస్ గెలిచి కివీస్ ఫీల్డింగ్ తీసుకుంది. ఇక భారత్ బ్యాట్టింగ్ విషయానికి వస్తే అగర్వాల్, కోహ్లి చేతులెత్తేశారు. ప్రిథ్వి షా 40పరుగులు చెయ్యగా. ఐయ్యర్, రాహుల్ మంచి భాగస్వామ్యం నమోదు చేసారు. చివర్లో పాండే అద్భుతంగా బ్యాట్ చేసాడు.దాంతో నిర్ణీత 50ఓవర్స్ లో భారత్ 296 పరుగులు చేయగా..కివీస్ …

    Read More »
  • 11 February

    వరుసగా మూడోసారి ముఖ్యమంత్రిగా గెలిచిన కేజ్రీవాల్ కు జగన్ శుభాకాంక్షలు !

    న్యూఢిల్లీ నియోజకవర్గంలో అర్వింద్ కేజ్రీవాల్ గెలుపొందారు. అంతేకాదు ఆయన మూడోసారి కూడా ముఖ్యమంత్రి అయిపోయారు. అలాగే కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ హర్షవర్ధన్ ప్రాతినిధ్యం వహిస్తున్న చాందినీచౌక్ లోక్ సభ సెగ్మెంట్ లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపొందింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్ర అనుకున్న ఫలితాలు సాధించలేకపోయింది. ఇక అమ్ ఆద్మీ పార్టీకి మరియు వరుసగా మూడోసారి ముఖ్యమంత్రిగా గెలిచిన అర్వింద్ కేజ్రీవాల్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat