TimeLine Layout

April, 2023

  • 4 April

    అంబేద్క‌ర్  విగ్ర‌హావిష్క‌ర‌ణ ఏర్పాట్ల‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్  స‌మీక్ష

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోన్న  భార‌త రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్  విగ్ర‌హావిష్క‌ర‌ణ ఏర్పాట్ల‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్  స‌మీక్ష నిర్వ‌హించారు. అందుబాటులో ఉన్న మంత్రులు, అధికారుల‌తో కేసీఆర్ స‌మీక్షిస్తున్నారు. హుస్సేన్ సాగ‌ర్  తీరంలోని ఎన్టీఆర్ గార్డెన్ వ‌ద్ద 125 అడుగుల ఎత్తులో అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని  ఏర్పాటు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అంబేద్క‌ర్ విగ్ర‌హా ఏర్పాట్లు చివ‌రి ద‌శ‌కు చేరుకున్నాయి. ఏప్రిల్ 14న దేశంలోనే అతిపెద్దదైన 125 అడుగుల అంబేద్కర్‌ …

    Read More »
  • 3 April

    బలగం మూవీకి మరో ఇంటర్నేషనల్ అవార్డు

    తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ కమెడియన్ వేణు తెరకెక్కించిన బలగం మూవీ మరో ఇంటర్నేషనల్ అవార్డు దక్కించుకుంది. బెస్ట్ డ్రామా ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఒనికో ఫిల్మ్ అవార్డు (ఉక్రెయిన్) సొంతం చేసుకుంది. ఇంతకుముందు ఈ మూవీకి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ విభాగాల్లో లాస్ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డులు, నంది అవార్డులు వచ్చాయి. ఇప్పటివరకు 4 అవార్డులు రావడంతో డైరెక్టర్ వేణు హర్షం వ్యక్తం …

    Read More »
  • 3 April

    బాలయ్య మూవీ కోసం రూ.5 కోట్లతో సెట్

    ప్రముఖ హిట్ చిత్రాల దర్శకుడు  అనిల్ రావిపూడి దర్శకత్వంలో సీనియర్ నటుడు.. స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. దీనిలో కాజల్ హీరోయిన్ గా, శ్రీలీల ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీలో ఓ పాట చిత్రీకరణ కోసం రామోజీ ఫిలింసిటీలో రూ.5 కోట్లతో సెట్ వేసినట్లు తెలిసింది. గణేషుడికి సంబంధించిన ఓ పాటను బాలయ్య, శ్రీలీలతో ఈ సెట్లోనే గ్రాండ్గా చిత్రీకరిస్తున్నారట. బాలకృష్ణ, కెరీర్లోనే …

    Read More »
  • 3 April

    తొలి భారత క్రికెటర్ గా విరాట్ కోహ్లీ

    ఐపీఎల్ లో నిన్న జరిగిన ముంబై ఇండియన్స్ పై మెరుపు ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా మాజీ కెప్టెన్ .. ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లి.. అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. 49 బంతుల్లోనే 82 రన్స్ చేసిన విరాట్.. ఐపీఎల్లో 50 సార్లు 50+ స్కోరు చేసిన తొలి భారత క్రికెటర్ గా నిలిచారు. కోహ్లి కంటే ముందు డేవిడ్ వార్నర్ 60 హాఫ్ సెంచరీలు చేసి టాప్ ఉన్నాయి.. …

    Read More »
  • 3 April

    ఢిల్లీకి పవన్ కళ్యాణ్

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హస్తిన పర్యటనలో ఉన్నారు. నిన్న రాత్రి పవన్ ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ ఇవాళ సమావేశం అయ్యే అవకాశం ఉంది. త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. పవన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat