మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధిస్తుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. పురపాలక ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొంటామని, ఎన్నికలకు పార్టీ పరమైన కసరత్తు ప్రారంభించినమని కేటీఆర్ అన్నారు.తెలంగాణ భవన్ లో పార్టీ ప్రధాన కార్యదర్శులతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. సుమారు 5 గంటల పాటు సుదీర్ఘంగా ఈ సమావేశం కొనసాగింది. మున్సిపల్ ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించారు. ఒక్కో మున్సిపాలిటీ వారీగా సమీక్ష …
Read More »TimeLine Layout
August, 2019
-
28 August
పీవీ సింధును అభినందించిన సీఎం కేసీఆర్
ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ గెలవడం ద్వారా పివి సింధు దేశానికి గర్వకారణంగా నిలిచిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. భవిష్యత్తులో జరిగే టోర్నమెంట్లలో పాల్గొనేందుకు, సిద్ధమయ్యేందుకు కావాల్సిన ఏర్పాట్లను ప్రభుత్వ పరంగా చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగే క్రీడా పోటీల్లో విజేతలను తయారు చేసే వేదికగా హైదరాబాద్ మారిందని సీఎం అన్నారు. పివి సింధు, ఆమె తల్లిదండ్రులు, కోచ్ గోపీ చంద్, బ్యాడ్మింటన్ …
Read More » -
28 August
బ్రేకింగ్… అజ్ఞాతంలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని..!
ఏపీలో టీడీపీ నేతలు ఒక్కొక్కరు అవినీతి, అక్రమాల కేసుల్లో ఇరుక్కుంటున్నారు..కోడెల, యరపతినేని, కూన రవికుమార్, సోమిరెడ్డి వంటి టీడీపీ ప్రముఖ నేతల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తాజాగా సున్నపురాయి అక్రమ మైనింగ్ కేసులో గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావుపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ జరిపించవచ్చు అని ఏపీ హైకోర్ట్ తీర్పు ఇచ్చింది.దీనిపై రెండు, మూడు రోజుల్లో జగన్ సర్కార్ ఆదేశాలు ఇవ్వనుంది. దీంతో యరపతినేని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. …
Read More » -
28 August
ఈ వార్త చదివితే కాంగ్రెస్ నేతల ఘనకార్యం బయటపడుతుంది
జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం.. రాష్ట్రంలో పరిచయం అక్కరలేని ప్రాజెక్ట్…ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం మండలం గంగారం వద్ద గోదావరి నదిపై దేవాదుల ఎత్తిపోతల పథకం చేపట్టారు. 6.21 లక్షల ఎకరాలకు సాగునీరందించడానికి 38.5 టీఎంసీల నీటిని ఎగువకు పంపింగ్ చేయాలనే ఉద్దేశంతో 2004లో పనులు ప్రారంభించారు. కాంగ్రెస్ హయాంలో కొందరి జేబులు నింపుకొనేందుకు ఈ ప్రాజెక్టును ప్రారంభించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులో ఉన్న లోపాల వల్ల నిర్మాణం పూర్తికాక …
Read More » -
28 August
భావోద్వేగానికి గురైన నితిన్…ఎందుకో తెలుసా..?
హీరో నితిన్.. ప్రస్తుతం భీష్మ సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి గాను వెంకీ కుడుములు దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి ఒక సన్నివేశాన్ని గతంలో నితిన్ నటించిన ‘అఆ’ సినిమా సెట్ లోనే తీస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నితిన్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి కాబట్టి.. ఆ పాత్రకు తగ్గట్టుగా ఇల్లు సెట్ వేసారు. ఇప్పటికి …
Read More » -
28 August
ఎమ్మెల్యే విడదల రజినిపై అసభ్యకరంగా పోస్టింగ్లు..ఇద్దరు అరెస్టు
గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజినిపై అసభ్యకరంగా పోస్టింగ్లు పెట్టిన ఇద్దరు వ్యక్తులను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల మేరకు… ఎమ్మెల్యే రజిని గౌరవానికి భంగం కలిగేలా వాట్సాప్, ఫేస్బుక్లలో అసభ్యకరంగా పోస్టింగ్లు పెడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది. పోస్టింగ్లు పెడుతున్న పి.కోటేశ్వరరావు, బాలాజీసింగ్లను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు పోలీసులు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా అసభ్యకరంగా పోస్టింగ్లు పెడితే చట్టపరంగా చర్యలు …
Read More » -
28 August
రాష్ట్రంలో జ్వరాలు…వైద్య శాఖ కీలక నిర్ణయం
తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన జ్వరాలు, డెంగీ, మలేరియా వంటి కేసులు నమోదవుతుండటంతో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక చొరవ తీసుకొని రాష్ట్రంలోని రీజినల్, జిల్లా హాస్పిటళ్లు, బోధనాస్పత్రుల్లో సాయంత్రం వేళల్లోనూ ఔట్ పేషెంట్ల(ఓపీ)ను చూడాలని డిసైడయింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా3 లక్షల మంది జ్వరాలతో బాధపడుతున్నట్లు అంచనా వేసిన అధికారులు.. పరిస్థితి తీవ్రత దృష్ట్యా బుధవారం నుంచే ఈ ఉత్తర్వులను అమలు చేయాలని ఆదేశించినట్లు …
Read More » -
28 August
వేములవాడలో దారుణం…డ్రైవర్ వైఫల్యమే దీనికి కారణమా..?
వేములవాడలో విషాదం చోటుచేసుకుంది. స్కూల్ బస్సు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే ఇద్దరు విద్యార్ధులు మరణించారు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విధ్యార్ధులను దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు తీసుకెళ్ళారు. చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరు విద్యార్ధుల పరిస్థితి విషమించడంతో అక్కడికక్కడే చనిపోయారు. దీనంతటికీ కారణం డ్రైవర్ నే అని, తాగి వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని …
Read More » -
28 August
అమరావతిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు ఘోర అవమానం…!
ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ అమరావతి నుంచి రాజధానిని తరలిస్తుదంటూ ప్రతిపక్ష టీడీపీ గత కొద్ది రోజులుగా దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులను రెచ్చగొడుతున్నారు. తాజాగా రాజధాని ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దళితుల సమావేశం పేరిట కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ హాజరుకానున్నట్లు తెలిపారు. అయితే శ్రవణ్ అక్కడికి రావడానికి ముందే ఆయన …
Read More » -
28 August
చంద్రబాబు దోపిడీపై జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు…!
చంద్రబాబు హయాంలో అమరావతి, పోలవరంలో వేల కోట్ల అవినీతి జరిగిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎస్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఏపీ రాజధాని అంశంపై విలేకరులతో మాట్లాడిన జీవీఎల్ బాబు సర్కార్ స్విస్, సింగపూర్ ఛాలెంజ్ పేర్లతో రాజధాని నిర్మాణం పేరిట వేల కోట్ల రూపాయలు దోచుకుందని జీవీఎల్ ఆరోపించారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధుల్లో కొంత ఖర్చుపెట్టి మిగతా మొత్తం టీడీపీ పెద్దలు …
Read More »