నాలుగేళ్లలోపు పిల్లలకు క్లోరోఫెనిరామైన్ మాలేట్, ఫెనైల్ట్ఫిన్ కాంబినేషన్లోని యాంటీ కోల్డ్ డ్రగ్స్ ఇవ్వడాన్ని కేంద్రం నిషేధించింది. దగ్గుమందుల వాడకంతో గతేడాది నుంచి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 141 మంది పిల్లలు చనిపోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సినారెస్ట్ టాబ్లెట్, మక్స్డ్ సిరప్, నాసోక్లియర్ కోల్డ్-AF డ్రాప్స్ మొదలైనవి ఈ నిషేధిత కాంబినేషను చెందినవే.
Read More »TimeLine Layout
December, 2023
-
21 December
దేశంలో కరోనా కలవరం
దేశంలో కరోనా కలవరం మొదలైన నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. * మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. * 10 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు పైబడిన వారు, గర్భిణులు అత్యవసరమైతే తప్పా బయటకు రావొద్దు. * వీలైనన్ని ఎక్కువసార్లు చేతులు శుభ్రం చేసుకోవాలి. * జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాసలో ఇబ్బందులుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. * ఇంటి లోపల వేడి వాతావరణం ఉండేలా చూసుకోవాలి.
Read More » -
21 December
సీఎం జగన్ కు పవన్ శుభాకాంక్షలు
ఏపీ అధికార వైసీపీ అధినేత సీఎం జగన్మోహాన్ రెడ్డి కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ క్రీడా పురస్కారాలకు ఎంపికైన బ్యాడ్మింటన్ ప్లేయర్ సాత్విక్, అంధ క్రికెటర్ ఇల్లూరి అజయ్, షూటర్ ఇషా సింగ్, బాక్సర్ హుసాముద్దీన్లను అభినందిస్తూ మరో ప్రకటన విడుదల …
Read More » -
21 December
ఫిబ్రవరి 8న ‘యాత్ర-2’ విడుదల
ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన ‘యాత్ర’ సినిమాకు సీక్వెల్గా ‘యాత్ర-2’ తెరకెక్కుతోంది. ఇందులో వైఎస్ఆర్ తో పాటు ఏపీ ప్రస్తుత సీఎం.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పాత్ర ఉంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ని మేకర్స్ ప్రకటించారు. ‘యాత్ర-1’ రిలీజైన తేదీనే.. అంటే ఫిబ్రవరి 8న ‘యాత్ర-2’ రిలీజ్ కానుంది. ఈ మూవీని మహి వి. …
Read More » -
21 December
ఫిబ్రవరిలో ఏపీ ఎన్నికల షెడ్యూల్
ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఇవాళ గురువారం సీఈసీ బృందం విజయవాడకు రానుంది. రేపు, ఎల్లుండి ఎన్నికల సన్నద్ధతపై వరుస సమావేశాలు నిర్వహించనుంది. కలెక్టర్లు, ఎస్పీలతో భేటీ కానుంది. కాగా, ఫిబ్రవరిలో ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి
Read More » -
21 December
తెలంగాణలో రేపటి నుంచి ఆ స్కూళ్లకు సెలవులు
తెలంగాణ రాష్ట్రంలోని క్రిస్మస్ పండుగ సందర్భంగా మిషనరీ స్కూళ్లకు డిసెంబర్ 22 నుంచి 26వ తేదీ వరకు సెలవులు ఉండనున్నాయి. కొన్ని స్కూళ్లకు డిసెంబర్ 25, 26(బాక్సింగ్ డే) తేదీల్లో సెలవు ప్రకటించారు.. మరికొన్ని స్కూళ్లకు డిసెంబర్ 25న మాత్రమే ఇచ్చారు. డిసెంబర్ 26వ తేదీని రాష్ట్ర ప్రభుత్వం సాధారణ సెలవుల జాబితాలో చేర్చింది.
Read More » -
21 December
సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
తెలంగాణలో జరగనున్న సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ముందస్తు షెడ్యూల్ ప్రకారమే ఈనెల 27న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలను మార్చికి వాయిదా వేయాలని కోరుతూ రాష్ట్ర ఇంధనశాఖ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది.
Read More » -
21 December
విద్యుత్ అప్పులు రూ.81,516 కోట్ల అప్పు
తెలంగాణ రాష్ట్రంలోని గత బీఆర్ఎస్ పాలన మొదలైన దగ్గర నుండి విద్యుత్ రంగంలో ఇప్పటివరకు రూ.81,516 కోట్ల అప్పు ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈరోజు గురువారం రోజు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ రంగంపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. డిస్కంలకు రూ.62,461కోట్ల నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. డిస్కంలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయని డిప్యూటీ సీఎం విక్రమార్క తెలిపారు.
Read More » -
21 December
అప్పులతో ఆస్తులు పెంచినం
తెలంగాణలో పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అన్ని రంగాలకు విద్యుత్ అందించామని సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే… మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడించారు. ‘2014 జూన్ 2 నాటికి నాలుగు విద్యుత్ సంస్థల ఆస్తుల విలువ ₹44,434 కోట్లు. అప్పులు ₹22,423 కోట్లు. ప్రస్తుతం విద్యుత్ రంగ ఆస్తుల విలువ ₹1,37,570 కోట్లు ఉంది.. అప్పుల విలువ ₹81,516 కోట్లుగా ఉంది. అప్పులు చేసి ఆస్తులు సృష్టించాం. కాంగ్రెస్ పాలనలో …
Read More » -
21 December
సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన రద్ధు
తెలంగాణ రాష్ట్ర పీసీసీ చీఫ్.. సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ఈరోజు గురువారం వెళ్లాల్సిన ఢిల్లీ పర్యటన రద్దయింది. ఢిల్లీలో ఈ రోజు గురువారం నుండి జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆయన దేశ రాజధానికి వెళ్లాల్సి ఉంది. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, తాజాగా ఆ పర్యటన రద్దయింది.
Read More »