చారిత్రక వరంగల్ నగరంలోని భద్రకాళి దేవాలయం పక్కన భధ్రకాళి బండ్ అభివృద్ధి అద్బుతంగా ఉంది. ఇదే తరహాలో తన నియోజవర్గంలో బండ్ అభివృద్ధికి శ్రీకారం చుడుతాను.. అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆయన వరంగల్లోని భద్రకాళి బండ్ను సందర్శించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. బండ్పై చేస్తున్న అభివృద్ధిని జిల్లా కలెక్టర్ ప్రశాంత్జీవన్ పాటిల్ వివరించారు. 1.1 కిలోమీటర్లు మేరకు అభివృద్ధి చేస్తున్నామని …
Read More »TimeLine Layout
August, 2019
-
13 August
నిరంతర విద్యుత్ కోసం సీఎం కేసీఆర్ ముందుచూపు..!!
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిరంతర విద్యుత్ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో వ్యవహరిస్తున్నారని అన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్లలో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. రైతులకు, పరిశ్రమలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా విద్యుత్ వినియోగించుకునేందుకు గ్రిడ్స్ ద్వారా సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. …
Read More » -
13 August
కంటి వెలుగు దేశంలో ఎక్కడా లేదు.. కేటీఆర్
సిరిసిల్ల పట్టణంలోని పొదుపు భవన్ ఆవరణలో కంటి ఆస్పత్రి భవనానికి శంకుస్థాపన జరిగింది. ఎల్వీప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కంటి ఆస్పత్రి భవనానికి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ…తెలంగాణలో సిరిసిల్లతో కలిపి ఏడు సెంటర్లు ఉన్నాయి. సామాజిక బాధ్యతతో ఎంతో మంది ముందుకు వచ్చి మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇతరులు కూడా స్పూర్తి పొంది మంచి పనులు చేసేందుకు …
Read More » -
13 August
బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి..వెల్లడించిన తండ్రి బెల్లంకొండ సురేశ్..అమ్మాయి ఎవరో తెలుసా
టాలీవుడ్ భీరో బెల్లంకొండ శ్రీనివాస్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ వెల్లడించారు. శ్రీనివాస్ ఇటీవల ‘రాక్షసుడు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తమిళ సినిమా ‘రాచ్చసన్’కు తెలుగు రీమేక్గా వచ్చిన ఈ సినిమాకు రమేశ్ వర్మ దర్శకత్వం వహించారు. కోనేరు సత్యనారాయణ నిర్మాత. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. ఈ సినిమా విజయం అందుకున్న నేపథ్యంలో శ్రీనివాస్, సురేశ్ మీడియా …
Read More » -
13 August
టీబీజేపీకి ఎమ్మెల్యే బాల్క సుమన్ లేఖ
బీజేపీతోనే బంగారు తెలంగాణ సాధ్యమని రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. విద్వేష రాజకీయాలు రెచ్చగొట్టి, రక్తపుటేరులు పారించే లక్ష్యం మీది. నీళ్లు పారించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ధ్యేయం మాది. తెలంగాణ అభివృద్ధి విషయంలో కేంద్రంలో మీ పార్టీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం అడుగడుగునా వివక్ష పాటించింది వాస్తవం కాదా..? మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలను నీతిఆయోగ్ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించి శభాష్ …
Read More » -
13 August
కాళేశ్వరంతో సహా రిజర్వాయర్లన్నింటిలోనూ..!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు అన్నింటిలోనూఈ నెల 16న భారీగా చేపపిల్లలు, రొయ్యలు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కాళేశ్వరం సహా అన్ని జలాశలాయాల్లో చేపపిల్లలు, రొయ్యలను విడుదల చేయాలని అధికారులకు మంత్రి లేఖ రాశారు. ఈ ఏడాది మొత్తం 24వేల నీటి వనరులలో 80కోట్ల చేప పిల్లలు సహా 5కోట్ల రొయ్య పిల్లల్ని కూడా విడుదల చేయనున్నట్లు ఆయన …
Read More » -
13 August
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం -ఒకేసారి 10మంది ఎమ్మెల్యేలు
బీజేపీలోకి పది మంది ఎమ్మెల్యేలు చేరడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెనుసంచలనం సృష్టిస్తుంది. ఈ క్రమంలో సిక్కిం రాష్ట్రంలో డెమోక్రటిక్ ఫ్రంట్ కి చెందిన పది మంది ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పది ఎమ్మెల్యేలు ఒకేసారి బీజేపీలో చేరడంతో మాజీ సీఎం,ఎస్డీఎఫ్ అధినేత పవన్ కుమార్ ఛామ్లింగ్ కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ తరపున పదిహేను మంది గెలుపొందారు. …
Read More » -
13 August
సంపూ ది గ్రేట్
టాలీవుడ్ బర్నింగ్ స్టార్ ,హీరో సంపూర్ణేష్ బాబు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు.. ఇటీవల హుద్ హుద్ సమయంలో రూ. లక్ష ,తిత్లీ విధ్వంసం జరిగినప్పుడు రూ.50,000లు ఆర్థిక సాయం అందించి గొప్ప మనస్సును చాటుకున్నారు సంపూ. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో వరదలు అల్లోకల్లోలం సృష్టిస్తున్న సంగతి విదితమే. కన్నడ ప్రజల బాధలను అర్ధం చేసుకున్న సంపూ బాధితులకు రూ.2లక్షలు విరాళం ప్రకటించారు. కన్నడ ప్రజలు ఎన్నో దశాబ్ధాలుగా తెలుగు …
Read More » -
13 August
రూ.10వేలకు ఏకంగా రూ.7లక్షలు
రూ.10వేల డిపాజిట్ చేస్తే ఏకంగా రూ.7లక్షలకుపైగా అధిక మొత్తం పొందవచ్చు. అయితే ఈ మొత్తాన్ని పొందాలంటే ఒకేసారి రూ.10వేలు డిపాజిట్ చేయడం కాదు నెలకు పదివేల చొప్పున ఐదేళ్ళు పోస్టాఫీసులో ఇన్వెస్ట్ చేస్తే రూ.7,22,051లు రాబడి పొందవచ్చు. అదే రూ.10 ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ కల్లా రూ.725.05లు పొందవచ్చు. ఈ ఇన్వెస్ట్ ను నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్లో చేయాలి.
Read More » -
13 August
రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల కలెక్టర్లకు సీఎం జగన్ ఆదేశాలు
అన్ని రిజర్వాయర్లు పూర్తిగా నింపేలా చర్యలు తీసుకోవాలని రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కృష్ణాజలాలు వస్తున్నాయని.. అయితే ఇన్ని జలాలు ఉన్నా రిజర్వాయర్లను పూర్తిగా ఎందుకు నింపలేకపోతున్నామో అధ్యయనం చేయాలని సూచించారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన(ప్రజా పరిష్కార వేదిక) కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో …
Read More »