ఆర్టికల్ 370 రద్దుతో తెలంగాణలోనూ హైఅలర్ట్ ప్రకటించారు. అలాగే హైదరాబాద్లో భద్రత కట్టుదిట్టం చేశారు. తాజా పరిస్ధితిని సమీక్షిస్తున్నామని, అందరూ అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించిందని తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పరిస్థితిపై డీజీపీ జితేందర్ తెలిపారు. అవసరమైతే అదనపు బలగాలను మోహరించేందుకు సైతం తాము సిద్ధంగా ఉన్నామని డీజీపీ స్పష్టంచేశారు. అలాగే సైబరాబాద్లోనూ హైఅలర్ట్ ప్రకటించినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. కమీషనరేట్ పరిధి 144 …
Read More »TimeLine Layout
August, 2019
-
5 August
ఆర్టికల్ 370 రద్దు…దేశంలో 28 వ రాష్ట్రంగా తెలంగాణ…!
2014లో భారతదేశంలో 29 వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది. అప్పటివరకూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణ ప్రాంతం కేసీఆర్ నాయకత్వంలో జరిగిన మలిదశ తెలంగాణ ఉద్యమ ఫలితంగా 2014, జూన్ 2 న ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. అప్పటి వరకు 28 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్న భారతదేశ భౌగోళిక స్వరూపం…29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారింది. తాజాగా కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 ఆర్టికల్ను …
Read More » -
5 August
ఆర్టికల్ 370ని ఏయే పార్టీలు వ్యతిరేకించాయో తెలుసా.?
ఆర్టికల్ 370 రద్దుకు వైఎస్సార్సీపీ తన మద్దతు తెలిపింది. ఈ అంశంపై ఎంపీ విజయసాయి రెడ్డి సోమవారం రాజ్యసభలో ఈ అంశంపై మాట్లాడుతూ జమ్మూీకశ్మీర్పై కేంద్రం తెచ్చిన బిల్లు సాహసోపేతమైన చర్యగా అభివర్ణించారు. కశ్మీర్ సమస్యకు ఇది మంచి పరిష్కారమని, అన్ని రాష్ట్రాల్లాగే జమ్మూకశ్మీర్ కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా చరిత్రలో నిలిచిపోతారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఆర్టికల్ 370రద్దుతో భారత సార్వభౌమత్వం మరింత …
Read More » -
5 August
ఆర్టికల్ 370 రద్దు ఎఫెక్ట్…కశ్మీర్కు అదనపు బలగాలు…!
దేశంలో ఇప్పటి వరకు పాలించిన పాలకులు ఎవరూ తీసుకోని నిర్ణయాన్ని కేంద్రంలోని మోదీ సర్కార్ తీసుకుంది. 70 ఏళ్లకు పైగా 370 ఆర్టికల్పై వివాదం కొనసాగుతున్నా జమ్ము – కశ్మీర్ స్వయం ప్రతిపత్తి విషయంలో జోక్యం చేసుకోవడానికి కాంగ్రెస్ పాలకులు, కానీ గతంలో వాజ్పేయి ప్రభుత్వం కాని ముందుకు రాలేదు. కానీ మోదీ సర్కార్ అనూహ్యంగా ఆర్టికల్ 370 ని రద్దు చేసి కలకలం రేపింది. ఆర్టికల్ 370 రద్దు …
Read More » -
5 August
అందుకే నిన్ను భీమవరంలో ఓడించాం.. అయినా నువ్వు ఏమాత్రం మారలేదు పవన్
తాజా సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరంలో పర్యటించారు.. భీమవరంలో మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఇసుక పాలసీ వెంటనే తీసుకురావాలని సీఎం జగన్ ను కోరారు. భీమవరంలో 100 ఎకరాల్లో డంపింగ్ యార్డును వైసీపీ ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని, పోలవరం ప్రాజెక్ట్ పై రాజకీయాలు చేస్తే తగదు, వ్యక్తిగత కక్షల వల్ల ప్రాజెక్ట్ కు నష్టం చేయొద్దన్నారు. పోలవరం …
Read More » -
5 August
ఆర్టికల్ 370 రద్దు : ఇక భారత్లో 28 రాష్ట్రాలు మాత్రమే….!
మోదీ సర్కార్ ఆర్టికల్ 370 ని రద్దు చేయడంతో జమ్మూ కశ్మీర్తోపాటు భారత దేశ ముఖచిత్రం కూడా మారింది. ఈ రోజు రాజ్య సభలో జమ్మూ కశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా రాజ్యసభలో ప్రకటించారు. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో జమ్ము – కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణను రద్దు చేస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. …
Read More » -
5 August
నరేంద్రమోదీతో కీలక అంశాలపై చర్చించనున్న జగన్.. వేయికళ్ళతో ఎదురుచూస్తున్న జనం
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.. పునర్విభజన చట్టంలోని సమస్యల పరిష్కారంతోపాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు ప్రధాన అజెండాగా ఈ మంగళవారం హస్తినకు వెళ్లనున్న సీఎం మంగళవారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కానున్నారు. అలాగే రాష్ట్రపతితో పాటు పలువురు కేంద్ర మంత్రులతోనూ జగన్ సమావేశమవుతారు. అయితే రాష్ట్ర పునర్విభజన చట్టానికి సంబంధించి కేంద్రంవద్ద పెండింగ్లోని అంశాలపై ప్రధానికి ముఖ్యమంత్రి జగన్ నివేదిక ఇవ్వనున్నారు. …
Read More » -
5 August
ఎడిటోరియల్: ఆర్టికల్ 370 రద్దు..అసలు ఆర్టికల్ 370 ఏం చెబుతోంది…!
ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న కశ్మీరీల స్వయంప్రతిపత్తికి కారణమైన ఆర్టికల్ 370 ని కేంద్రం రద్దు చేసింది. రాజ్యసభలో ఈ రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా…370 ఆర్టికల్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రాజ్యసభ దద్దరిల్లింది. గత వారం రోజులుగా కశ్మీర్లో కేంద్రం భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించింది. అమర్నాథ్ యాత్రికులతో పాటు, కశ్మీర్ నిట్ విద్యార్థులను కూడా కేంద్రం తమ స్వస్థలాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్నెట్, …
Read More » -
5 August
కేంద్రం సంచలన నిర్ణయం…ఆర్టికల్ 370 రద్దు…!
గత వారం రోజులుగా కాశ్మీర్పై జరుగుతున్న అనేక ఉత్కంఠ పరిణమాలకు తెరదించుతూ.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేస్తున్నట్లు రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రతిపాదించారు. హోంమంత్రి ప్రకటనతో రాజ్యసభ దద్దరిల్లింది. కశ్మీర్ అంశపై తొలినుంచి గోప్యతను పాటించిన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా తన నిర్ణయాన్ని బయటపెట్టింది. దీంతో చారిత్రాత్మక నేపథ్యం, …
Read More » -
5 August
ఒక్కసారిగా పెను గాలులు 3 పడవలు బోల్తా..31 మంది మృతి
ఫిలిప్పీన్స్లో ఘోర పడవ ప్రమాదాలు జరిగాయి. ఒక్కసారిగా పెను గాలులు వీయడంతో మూడు పడవలు తిరగపడ్డాయి. ఈ ప్రమాదంలో 31 మంది చనిపోయారు. 62 మందిని కోస్ట్ గార్డ్లు కాపాడి తీరానికి చేర్చారు. రెండు పడవల్లోని ప్యాసింజర్లు చనిపోయారని, మరో పడవలో ప్రయాణికులు లేకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు చెప్పారు. వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చి భారీ గాలులు వీచాయని, భారీ వర్షం పడటంతో బోట్లు ఒక్కసారిగా తిరగబడ్డాయన్నారు. …
Read More »