TimeLine Layout

June, 2019

  • 8 June

    జగన్ కోసం ఆనాడే మంత్రి పదవి వదులుకున్నాడు.. తనకు వైఎస్ కుటుంబమే హైకమాండ్ గా భావించాడు..

    వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీస్వీకార ప్రమాణం చేసిన పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమిచెందారు. అయినా ఎమ్మెల్సీ కోటాలో ఆయనకు మంత్రిపదవి వచ్చింది. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా, ఆయన కుటుంబానికి విధేయుడిగా ఉన్న పిల్లికి మూడోసారి మంత్రిపదవి వరించింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ స్థాపించినప్పటి నుంచి జగన్‌ కు అండగా ఉంటూ బీసీ సామాజికవర్గంలో పెద్దనేతగా వ్యవహరించారు. …

    Read More »
  • 8 June

    జర్నలిస్ట్‌ నుంచి.. మినిస్టర్‌గా.. పాత్రికేయుడిగా.. వైసీపీ తరపున పోరాడిన వ్యక్తిగా

    వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకార ప్రమాణం చేసిన కురసాల కన్నబాబు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. తాజా ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పిల్లి అనంతలక్ష్మిపై 8,789 ఓట్ల మెజార్టీతో గెలిచారు. పాత్రికేయుని హోదాలో ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చిన ఆయన రాజకీయాల్లో కూడా అదే ఒరవడితో ముందుకు కదిలారు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మంత్రి …

    Read More »
  • 8 June

    పార్లమెంటులోని వివిధ కమిటీలకు ప్రాతినిధ్యం వహించారు.. హోదాకోసం పోరాటం చేసారు.. టీడీపీకి రాజీనామా చేసారు

    వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలిమంత్రివర్గంలో పదవీస్వీకార ప్రమాణం చేసిన అవంతి శ్రీనివాసరావు విశాఖ జిల్లా భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన భీమిలి ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి సబ్బం హరిపై 9,712 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2009లో రాజకీయ ఆరంగేట్రం చేసిన అవంతి శ్రీనివాసరావు, అప్పటి ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున భీమిలి నుంచి అత్యంత భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల్లో …

    Read More »
  • 8 June

    ఫిరాయింపులకు లొంగని దంపతులు.. హత్యా ప్రయత్నం జరిగినా బెదరలేదు.. గిరిజనులకోసం పోరాడిన శ్రీవాణి

    వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకార ప్రమాణం చేసిన పాముల పుష్పశ్రీవాణి విజయనగరం జిల్లా కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నరసింహ ప్రియా థాట్రాజ్‌పై 26,602 ఓట్ల మెజార్టీతో భారీ విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో కూడా థాట్రాజ్‌పైనే విజయం సాధించారు. గిరిజన ప్రాంతాల ప్రజల సమస్యలకోసం నిరంతరం పోరాడారు. తాజా ఎన్నికల్లో ఆమెను ఓడించేందుకు టీడీపీ చేసిన విశ్వప్రయత్నాలు …

    Read More »
  • 8 June

    1992 నుండి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం.. వైఎస్సార్ కేబినేట్ లో మంత్రిగా.. నేడు జగన్ కు అండగా

    వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీస్వీకార ప్రమాణం చేసిన బొత్స సత్యనారాయణ‌ విజయనగరం జిల్లా చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కిమిడి నాగార్జున పై 26,498 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. సీనియర్‌ నేత కావడం, ఇది వరకు కూడా సీనియర్ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండడంతో ఈయన తొలి మంత్రివర్గంలోనే స్థానం దక్కించుకున్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ …

    Read More »
  • 8 June

    స్టీల్‌ప్లాంట్‌ లో ఉద్యోగిగా ప్రారంభమై నాలుగుసార్లు ఎమ్మెల్యేగా అనేక రికార్డులు..!

    ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గంలో పదవీ స్వీకార ప్రమాణం చేసిన వ్యక్తి ధర్మాన కృష్ణదాస్‌.. శ్రీకాకుళంజిల్లా నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తిపై 19 వేల 25 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇప్పటి వరకు నాలుగుసార్లు ధర్మాన శాసనసభకు ఎన్నికయ్యారు. 2004లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. అంతకు ముందు స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగిగా పనిచేశారు. 2004లో కాంగ్రెస్‌ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా …

    Read More »
  • 8 June

    ఓదార్పుయాత్ర టు విజయయాత్ర.. ఒక ఎమ్మెల్యే నుంచి 151 ఎమ్మెల్యేల వరకు

    ఎన్నో అవమానాలు, మరెన్నో పరాభవాలు, అక్రమకేసులు, జైలు శిక్షలు, ప్రజా ఉద్యమాలు, ప్రజలకోసం పాదయాత్రలు కట్ చేస్తే అఖండ విజయం.. ఇవి జగన్ జీవితంలో కనిపిస్తున్న కొన్ని అనుభవాలు. తండ్రి చనిపోయిన తర్వాత ఆయన ఆశయసాధనకోసం ముఖ్యమంత్రి కావాలన్న జగన్ ఆశలపై అప్పటి అధికార జాతీయ కాంగ్రెస్ నీళ్లుచల్లి సీనియర్ నేత కొణిజేటి రోశయ్యను ముఖ్యమంత్రిగా చేసింది. ఆసమయంలో తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక అసువులుబాసిన కుటుంబాలను పరామర్శించేందుకు ఓదార్పుయాత్ర …

    Read More »
  • 8 June

    జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ కేంద్రమంత్రి..ఏమన్నారంటే ?

    ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్ సంచలన విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఫ్యాన్ గాలి దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు.అదే ఊపుమీద ఉన్నజగన్ ప్రమాణస్వీకారం చేయకముందే చాలా వరకు తన భాద్యతలను చేపట్టడం జరిగింది.ఇక ప్రమాణస్వీకారం అనంతరం యువ కెరటంలా దూసుకుపోతూ కనీవినీ ఎరుగని రీతిలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.అంతేకాకుండా ఈరోజు మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది.అయితే దీపిపై స్పందించి కేంద్ర మాజీమంత్రి, బీజేపీ సీనియర్ నేత, …

    Read More »
  • 8 June

    చపాతీలు తింటే మంచిదా.. ?

    మనం ఏ రకమైన ఆహారం తీసుకుంటున్నామన్నది ఎంత ముఖ్యమో, ఎంత పరిమాణంలో తీసుకుంటున్నామన్నదీ అంతే ముఖ్యం. చపాతీలు, గోధుమ నూక (దలియా), జొన్న రొట్టెలు, కొర్ర బియ్యం, ముడి బియ్యం (బ్రౌన్‌ రైస్‌) ఇలా ఏ ధాన్యపు ఉత్పత్తులైనా సరే, తగిన పరిమాణంలో తింటే.. బరువును నియంత్రణలో ఉంచు కోవచ్చు. గోధుమ రొట్టెలు, ముడి బియ్యంకంటే కూడా జొన్నలు, కొర్రలు వంటి చిరుధాన్యాల్లో మాంస కృత్తులు, పీచుపదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. …

    Read More »
  • 8 June

    టీమిండియా సారధి కోహ్లికి జరిమానా..ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు?

    టీమిండియా కెప్టెన్ కోహ్లికి రూ.500 జరిమానా విధించారు.తన ఇంటి పనిమమిషి చేసిన నిర్వాకానికి ఈ జరిమానా విధించారు.ఇంక అసలు విషయానికి వస్తే.. విరాట్ కోహ్లి నివాసం గురుగ్రామ్ లో ఉంది.ఇక్కడ నీటి కొరత అంతా ఇంత కాదు,చాలా ఎక్కువనే చెప్పాలి.కోహ్లి ఇంట్లో పనిమనిషి మంచి నీటితో కారు కడిగింది.దీనిని చూసిన ఒక వ్యక్తి వీడియో తీసి అధికారులు ముందు పెట్టాడు. దీంతో రంగంలోకి దిగిన మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ గురుగ్రామ్‌ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat