తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన మేనల్లుడు ఉదయ్కుమార్(43) శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. హైదరాబాద్లో నివాసముంటున్న ఉదయ్కుమార్కు ఈరోజు ఉదయం గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు వెంటనే కేర్ ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఉదయ్కుమార్.. చంద్రబాబు రెండో సోదరి హైమావతి కుమారుడు. విషయం …
Read More »TimeLine Layout
December, 2018
-
14 December
చెత్త రికార్డు తన ఖాతాలో వేసుకున్న కోహ్లి
పెర్త్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి టాస్ ఓడిపోయాడు. దీని ద్వారా అతడు ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ ఏడాది కోహ్లి టాస్ ఓడిపోవడం ఇది తొమ్మిదోసారి. ధోనీ (12), గంగూలీ (11) తర్వాత ఓ ఏడాదిలో అత్యధిక టాస్లు ఓడిపోయిన కెప్టెన్గా కోహ్లి నిలిచాడు. ఇక ఈ ఏడాది విదేశీ గడ్డపై టాస్ ఓడిపోవడం కోహ్లికి 8వ సారి. …
Read More » -
14 December
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్..!!
తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిండెంట్ (కార్యనిర్వాహక అధ్యక్షుడు)గా సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావును పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నియమించారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ పరంగా నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు, ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్ధానాలను తు.చ. తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యతలు తనపై ఉన్న దృష్ట్యా, అత్యంత నమ్మకస్తుడు, …
Read More » -
14 December
ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత….టీడీపీకి షాక్
ఈ రోజుల్లో మనుషులకంటే విగ్రహాలకే ప్రాధాన్యత ఎక్కువ.రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పట్టించుకోకుండా విగ్రహాలకు కోట్లు పెడుతున్నారు.ఉక్కు మనిషి సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ కు నివాళిగా ప్రధాని మోదీ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం గుజరాత్ రాష్ట్రంలోని నర్మదా నదీ తీరంలో ఒక భారీ కంచు విగ్రహాన్ని నిర్మించి ఆవిష్కరించిన విషయం అందరికి తెలిసిందే. ఆ విగ్రహ ఏర్పాటుకైన ఖర్చు దాదాపు రూ.3000 కోట్లు అయింది.దీంతో దేశ వ్యాప్తంగా మోదీ …
Read More » -
14 December
క్లీన్బౌల్డ్తో కోదండరాంకు ఈ తెలివి వచ్చింది
సబ్బండ వర్గాల సంక్షేమం కోసం కృషిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి సారథ్యంలోని సర్కారును గద్దెదించడమే లక్ష్యమని ప్రకటించి సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చి మరీ పొత్తులు కుదుర్చుకొని…స్వల్పకాలంలో ఎన్నికల్లో చిత్తు అయిన తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆలస్యంగా జ్ఞానోదయం కలిగిందంటున్నారు. అగ్గిపెట్టె గుర్తుతో అధికార పార్టీని గద్దె దించాలని భావించిన మాస్టారు ఆఖరికి గులాబీ పార్టీ దాటికి క్లీన్ బౌల్డ్ అయిపోయన అనంతరం తత్వం బోధపడిందని చెప్తున్నారు. ఇందుకు …
Read More » -
13 December
మహమూద్ అలీకి హోంశాఖ..!!
సీఎం కేసీఆర్తో ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి మహమూద్ అలీకి శాఖను కేటాయించారు. ఆయనకు హోం శాఖను కేటాయిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వంలో అలీ డిప్యూటీ సీఎంగా, మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు.ఈ రోజు రాజ్భవన్లో నిర్వహించిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో సీఎంగా కేసీఆర్, మంత్రిగా మహమూద్ అలీ చేత గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించారు.
Read More » -
13 December
డిసెంబరు 31 తర్వాత క్రెడిట్/డెబిట్ కార్డులు బ్లాక్…ఎందుకో తెలుసా?
క్రెడిట్/డెబిట్ కార్డులను అప్గ్రేడ్ చేసుకోండి అంటూ మీ ఫోన్కు మెసేజ్లు వస్తున్నాయా.. మీరు వాటిని పట్టించుకోకుండా వదిలేస్తున్నారా.. అయితే డిసెంబరు 31 తర్వాత మీ కార్డులేవీ పనిచేయవు. అవునా.. ఎందుకు? కార్డులు బ్లాక్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అనేగా మీ సందేహం. అయితే ఇది చదవండి. మోసాపూరిత లావాదేవీల నుంచి వినియోగదారులను రక్షించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల సరికొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. మ్యాగ్స్ట్రైప్ డెబిట్ …
Read More » -
13 December
‘వైకుంఠ ఏకాదశి’ సందర్భంగా భక్తులకు టీటీడీ కొన్ని సూచనలు
తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ఏకాదశి పర్వదినం శ్రీవారిని దర్శించుకునే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తోంది . మరో రెండు రోజుల్లో దాదాపు లక్షా 70 వేల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు . 18వ తేదీన ఉదయం 1.30లకు వీఐపీలను, ఉదయం 5 గంటలకు సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు.. ఇక వీఐపీలు స్వయంగా …
Read More » -
13 December
కేసీఆర్ ఇంకో స్కెచ్..కాంగ్రెస్ నేతలకు నిద్ర కరువు
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ వైపు సర్కారు ఏర్పాటులో బిజీబిజీగా ఉంటే…మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలకు కొత్త టెన్షన్ మొదలైంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారని అంటున్నారు. ఆయన మీడియా చిట్చాట్లో కేసీఆర్ మాట్లాడుతూ తమ పార్టీ పట్ల పలువురు ఎమ్మెల్యేలు ఆసక్తిగా ఉన్నారని అన్నారు. త్వరలో వీరి చేరికలు ఉంటాయని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ …
Read More » -
13 December
ఏపీలో మరో ప్రకృతి విపత్తు.. ఆందోళనలో 9జిల్లాల ప్రజలు
ఏపీలో మరో ప్రకృతి విపత్తు సంభవించే అవకాశం కనిపిస్తోంది.. ప్రస్తుతం తీరం వైపు తీవ్ర వాయుగుండం దూసుకొస్తుంది. రేపు సాయంత్రానికి తుపాన్గా మారే అవకాశం కనిపిస్తోంది. శ్రీహరికోట నుంచి 1140 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయి ఉంది. ఈ నెల 17న కోస్తా వద్ద తీరం దాటే సూచనలున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో జాలర్లు సముద్రంలో చేపల వేటకు వెల్లకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేసారు. తీరం దాటే సమయంలో …
Read More »