తెలంగాణ మరో తీపికబురును అందుకుంది. సీతారామ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో మరో ముందడుగు పడింది. ప్రాజెక్టు స్టేజ్-1కు అటవీ అనుమతి లభించింది. ప్రాజెక్టు ప్రతిపాదనలపై అటవీ, పర్యావరణ ప్రాంతీయ కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. 1531 హెక్టార్ల అటవీ భూములను ఇరిగేషన్ శాఖకు బదలాయించేందుకు అంగీకరించింది. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు జారీకానున్నాయి. అటవీ అనుమతి లభించడంపై మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం …
Read More »TimeLine Layout
January, 2018
-
19 January
పవన్ ఆవేదన..పార్టీపై కుట్ర జరుగుతోంది
తన పార్టీ గురించి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తన పార్టీపై కుట్ర జరుగుతోందని వాపోయారు. ఈ మేరకు ఏకంగా అభిమానులకు లేఖ రాశారు. అంతేకాకుండా..వివాదాల్లోకి వెళ్లవద్దని కోరారు. ఈ మేరకు పవన్ లేఖను విడుదల ఆ పార్టీ ఉపాధ్యక్షుడు విడుదల చేశారు. ఇదే ఆ లేఖ సారాంశం. `జనసేన పార్టీ నాలుగేళ్లు కూడా నిండని పసి ప్రాయం. ఇటువంటి పసి బిడ్డను ఎదగనీయకుండా అనేక …
Read More » -
19 January
మరి కర్ణాటకలో ఎందుకు ఇవ్వడంలేదు.. మంత్రి హరీశ్
దేశంలో మిగులు విద్యుత్ ఉన్నందునే తెలంగాణలో 24 గంటల పాటు కరెంటు ఇస్తున్నారని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అవాస్తవాలు చెబుతున్నారని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రానికి వెళ్లి వాస్తవాలు పరిశీలించేందుకు ఉత్తమ్ రావాలని కోరారు. దేశంలో చాలినంత విద్యుత్ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కర్ణాటకలో ఎందుకు 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దీనికి ఉత్తమ్ కుమార్ రెడ్డి …
Read More » -
19 January
జపాన్ పర్యటనలో కేటీఆర్..పలు ఒప్పందాలు
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్ర్రి కల్వకుంట్ల తారకరామారావు జపాన్ పర్యటన దిగ్విజయంగా సాగుతోంది. పర్యటనలో భాగంగా జపాన్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ బృందం భేటీ అయ్యింది. టోక్యో వేదికగా జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర పాలసీలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణలో పరిశ్రమలు నెలకొల్పేందుకు ఉన్న అవకాశాలను వివరించారు. అటు, జపాన్ ఎక్స్ టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రతినిధులతోనూ కేటీఆర్ చర్చించారు. అనంతరం… “తెలంగాణ స్టేట్, …
Read More » -
19 January
ప్రపంచానికి నా పిలుపు..!
‘‘ఏరా చేతిలో పెన్ను పట్టుకుని ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్టు ఫోజు ప్రాక్టీస్ చేస్తున్నావంటే కొత్త కవితా సంకలనం కోసం సిద్ధమవుతున్నట్టున్నావ్?’’ ‘‘రావోయ్ రా! అలాంటిదేమీ లేదు. ఐనా ఆ ఫోటో ట్రెండ్ మారి చాలా కాలమైంది. కవితా సంకలనాలకు చివరి పేజీ ఫోటో అంటే, ఇప్పుడు కావలసింది చేతిలో పెన్ను కాదు, నెరిసిన గడ్డం మాసిన ముఖం… ఏమోయ్! అరగంట క్రితం టీ తెమ్మని చెప్పాను కదా? ఒకటి కాదు …
Read More » -
19 January
వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన కత్తి
సీనీ విమర్శకుడు కత్తి మహేష్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్సీ ,ఎస్టీ అట్రాసీటీ కేసు నమోదు చేశారు .నిన్న ( గురువారం ) రాత్రి జూబ్లిహిల్స్ నుండి కొండాపూర్ వెళ్ళుతున్న సమయంలో శిల్పారామం దగ్గర కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కత్తి మహేష్ పై కోడిగుడ్ల తో దాడి చేసిన విషయం తెలిసిందే.ఈ సందర్బంగా దాడికి పాల్పడిన నిందుతుల పై తగిన చర్యలు …
Read More » -
19 January
2019 ఎన్నికల్లో టీడీపీ రాదు కాబట్టి…నరేంద్ర మోదీ వైఎస్ జగన్ తో దోస్తీ
2019 సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా ఉన్న పార్లమెంట్ స్థానాల్లో రిపబ్లికన్ టీవీ, ఓ సర్వే నిర్వహించాయి. దీని ప్రకారం 2019లో మళ్లీ ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. ఇక ఏపీలో వైసీపీకి, తెలంగాణలో టీఆర్ఎస్కి, తమిళనాడులో రజనీకి ఆధిక్యం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ-బీజేపీ కూటమికి 12 పార్లమెంట్ స్థానాలు దక్కుతాయట.. అంటే గత ఎన్నికలతో పోలిస్తే 5 స్థానాలు తగ్గుతాయని …
Read More » -
19 January
రాజకీయ నాయకులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన…మోహన్ బాబు
టాలీవుడ్ సినీ నటుడు అగ్ర హీరో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రాజకీయ నాయకులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకుల్లో 95 శాతం మంది రాస్కెల్స్ అని వ్యాఖ్యానించారు. ప్రజలకు హామీలిచ్చి మోసం చేయడం పొలిటీషియన్లకు అలవాటుగా మారిందని ఆయన చెప్పారు. రాజకీయ నాయకులు మాట నిలబడి ఉంటే దేశం ఇంకా మంచి స్థితిలో ఉండేదని అభిప్రాయపడ్డారు. ఇండియా టుడే కాంక్లేవ్లో మాట్లాడుతూ మోహన్ బాబు ఈ …
Read More » -
19 January
బుల్లితెర బ్రేకింగ్ ట్విస్ట్… రష్మీనే పెళ్లి చేసుకుంటాన్న సుధీర్.. స్టేజ్ పైనే కిస్ ఇచ్చిన రష్మీ…!
జబర్దస్త్ యాంకర్ రష్మి, ఈ షోలో స్కిట్లు చేసే టీమ్ లీడర్ సుడిగాలి సుధీర్ మధ్య ఎఫైర్ ఉన్నట్లు వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్మీ-సుడిగాలి సుధీర్కు లింకుందని.. ఆతనితో డేటింగ్ చేస్తోందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి. అయితే ఇవన్నీ రూమర్లు కాదు నిజమేనని అనిపించేవిధంగా ఇద్దరూ ప్రవర్తిస్తుంటారు. మరో వైపు షోలో కూడా ఇతర టీమ్ సభ్యులు ఇద్దరి మధ్య ఏదో …
Read More » -
19 January
బ్రేకింగ్ న్యూస్.. 20 మంది ఎమ్మెల్యేలపై ఈసీ వేటు !
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఇదో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. వీరి పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఎన్నికల సంఘం రాష్ట్రపతి రామ్నాథ్ను కోరింది. . ఆ 20 మంది ఎమ్మెల్యేలు లాభదాయకమైన పదవుల్లో ఉన్నారంటో ఎన్నికల సంఘం ఆరోపించింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అచల్ కుమార్ తన రిటైర్మెంట్కు ముందు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమస్యకు …
Read More »