తెలంగాణ రాష్ట్ర రోడ్లు రహదారుల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాలో పర్యటించారు . పర్యటనలో భాగంగా జిల్లాలోని నేలకొండపల్లిలోని సింగారెడ్డిపాలెంలో పేదల కోసం 30 ఇళ్లకు శంకుస్థాపన చేయగా, నిర్మాణం పూరైన 18 డబుల్ బెడ్రూం ఇళ్లను మంత్రి తుమ్మల ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడారు .. భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఉన్నంత వరకు ప్రజల కోసమే …
Read More »TimeLine Layout
December, 2017
-
22 December
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని నిజాం కాలేజీ గ్రౌండ్స్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు . ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిన్నారులకు బట్టలు పంపిణీ చేశారు. అనంతరం చిన్నారులతో సీఎం క్రిస్మస్ కేకును కట్ చేయించారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… క్రైస్తవ బంధువులందరికీ వందనాలు. పరాధీన స్థితిలో ఉన్న తెలంగాణ స్వాధీన స్థితిలోకి వచ్చి ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంది. …
Read More » -
22 December
సచిన్ కొత్త ప్రయోగం…మంత్రి కేటీఆర్ ప్రశంసలు
క్రికెట్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ను మంత్రి కేటీఆర్ అభినందించారు. పార్లమెంటులో సమావేశాల్లో భాగంగా గురువారం ఆయన రాజ్యసభలో మాట్లాడేందుకు సిద్ధమవగా ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యుల నిరంతరాయ ఆందోళనల కారణంగా ఆయనకు అవకాశం దక్కని సంగతి తెలిసిందే. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సర్దిచెప్పినప్పటికీ…కాంగ్రెస్ సభ్యులు సహకరించకపోవడంతో సచిన్ తన ప్రసంగాన్ని విరమించుకున్నారు. అయితే యూట్యూబ్ వేదికగా తన భావాలను వినిపిస్తూ ఆ వీడియోను పోస్ట్ చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ …
Read More » -
22 December
సంధ్యారాణి కుటుంబ సభ్యులను పరామర్శించి.. తక్షణసాయం అందజేసిన మంత్రి తలసాని
రాష్ట్రంలోని సికింద్రాబాద్ నియోజకవర్గం లాలాపేటలో సంధ్యారాణి అనే యువతిపై కార్తీక్ అనే యువకుడు గురువారం రాత్రి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో 80 శాతం కాలిన గాయాలతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ యువతి ఇవాళ ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లాలాపేటలో సంధ్యారాణి మృతదేహానికి నివాళులర్పించి సంధ్యారాణి కుటుంబ సభ్యులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు.అకౌంటెంట్గా పని చేస్తూ కుటుంబ సభ్యులకు …
Read More » -
22 December
భూ రికార్డుల ప్రక్షాళన ఇక పట్టణ ప్రాంతాల్లో
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయభూముల రికార్డుల ప్రక్షాళన దాదాపు పూర్తిచేసిన ప్రభుత్వం ఇక పట్టణాల్లోని భూములు, ఇండ్ల సర్వేపై దృష్టిపెట్టింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు రాజధాని హైదరాబాద్ సహా పట్టణాల్లోని భూములు, ఇండ్ల రికార్డులను పక్కాగా రూపొందించాలని నిర్ణయించింది. దీనిపై హైదరాబాద్ కలెక్టర్, రెవెన్యూ అధికారులతో రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీఆర్ మీనా సమావేశం నిర్వహించినట్టు తెలిసింది. భూరికార్డుల ప్రక్షాళనలో పట్టణ ప్రాంతాల్లో ఏ విధానాన్ని అనుసరించాలి? …
Read More » -
22 December
ప్రాణహిత చేవెల్ల ప్రాజెక్టు “కాకా” స్వప్నం..మంత్రి హరీష్
ప్రస్తుత కాళేశ్వరం ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న అప్పటి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు” కాకా” వెంకట స్వామీ చలవేనని రాష్ట్ర ఇరిగేషన్,మార్కెటింగ్, శాసన సభ వ్యవహారాల మంత్రి హరీశ్ రావు అన్నారు. శుక్రవారం నాడు హైదరాబాద్ లో దివంగత జి.వెంకటస్వామి మూడవ వర్ధంతి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.అయితే అప్పడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీళ్ళు లేని చోట ప్రాజెక్టును ప్రతిపాదించిందని ముఖ్యమంత్రి కెసిఆర్ నీళ్ళు లభ్యత ఉన్న మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టుకు రీ …
Read More » -
22 December
రైతులను ఆదుకోండి.. జితేందర్ రెడ్డి
గత అక్టోబర్ నెలలో కురిసిన అకాల వర్షాల వల్ల రాష్ట్రంలో వేల హెక్టార్లలో పత్తి రైతులు నష్టపోయారని, వారిని ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని టిఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత జితేందర్ రెడ్డి కోరారు. దేశ వ్యాప్తంగా ప్రకృతి విపత్తుల కారణంగా జరిగిన నష్టంపై లోక్ సభలో జరిగిన చర్చలో జితేందర్ రెడ్డి మాట్లాడారు.కృష్టా జలాల పంపకంలో కూడా రివర్ మేనేజ్మెంట్ బోర్టు, ట్రిబ్యునల్ విఫలమయ్యాయని సభ దృష్టికి …
Read More » -
22 December
బ్రేకింగ్ న్యూస్ ….కర్నూల్ జిల్లా చెన్నంపల్లి కోటలో
గుప్తనిధుల వేటకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లిలోని పురాతన కోటలో పెద్ద మొత్తంలో గుప్తనిధులు ఉన్నట్లు కొంతమంది ఇచ్చిన నివేదిక మేరకు ప్రభుత్వం తవ్వకాలను ప్రారంబించిన సంగతి తెలిసిందే . గత వారం రోజులుగా కోటలో అధికారులు తవ్వకాలు జరుపుతున్నారు. విజయనగర రాజుల కాలం నాటి నిధి నిక్షేపాలు ఉన్నట్లు పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలు సాగిస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక పరికరాలు, మెటల్ డిటెక్టర్ల …
Read More » -
22 December
కాంగ్రెస్ నేతలు నిజాలు తెలుసుకుని మాట్లాడాలి..ఎమ్మెల్సీ కర్నె
కాంగ్రెస్ నేతలపై ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు .కాంగ్రెస్ నేతలు నిజాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు.ఇవాళ టిఆర్ఎస్ఎల్పీలో అయన మీడియాతో మాట్లాడుతూ..కాంగ్రెస్ హయాంలో కార్పొరేట్ కళాశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయని.. ప్రైవేట్ విద్యను ప్రోత్సహించడం వల్ల విద్యా వ్యవస్థ నాశనం అయ్యిందన్నారు.కాంగ్రెస్ హాయాంలోని ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను కూడా టిఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చాకా తీర్చిందన్నారు. అదుపు తప్పిన విద్యా వ్యవస్థను ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ గాడిలో పెడుతున్నారని తెలిపారు.అన్ని వర్గాలకు …
Read More » -
22 December
పేదల ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం
పేదల ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఇవాళ నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పోచారం మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను చూసి ఎన్నారైలు ఆశ్చర్చపోతున్నరన్నారు. దేశంలోనే సంక్షేమ రంగంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని తెలిపారు . కేసీఆర్ కిట్ల పంపిణీతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీల సంఖ్య పెరిగినట్లు చెప్పారు.
Read More »