TimeLine Layout

November, 2017

  • 6 November

    కంచ‌ర్ల‌ భూపాల్‌రెడ్డిని టీడీపీ మోసం చేస్తే…టీఆర్ఎస్ గౌర‌వించింది

    తెలంగాణ అభివృద్ధి అడుగ‌డుగునా అడ్డుప‌డుతున్న తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పిన ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, కంచర్ల భూపాల్ రెడ్డికి టీఆర్ఎస్ పార్టీ స‌ముచిత గౌర‌వం ఇచ్చింది. తెలంగాణ భ‌వ‌న్‌లో మంత్రులు కేటీఆర్, ఈట‌ల రాజేంద‌ర్‌, జ‌గ‌దీశ్ రెడ్డి స‌మ‌క్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్బంగా మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ మాట్లాడుతూ భూపాల్ రెడ్డిని నల్గొండ ఇంచార్జ్ గా నియమిస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. దుబ్బాక నర్సింహారెడ్డికి రాష్ట్ర …

    Read More »
  • 6 November

    దేశానికి, రాష్ట్రానికి ప‌ట్టిన శ‌ని కాంగ్రెస్‌..మంత్రి కేటీఆర్‌

    ఈ దేశానికి, రాష్ట్రానికి పట్టిన శని కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్ర మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఫ్లోరైడ్ తో నల్గొండ జిల్లాలో లక్షల మంది బాధ పడుతుంటే కాంగ్రెస్ నేతలు పట్టించుకోలేదని కానీ ఇప్పుడు క‌ప‌ట ప్రేమ‌ను చాటుతున్నార‌ని మండిప‌డ్డారు. నల్గొండ జిల్లా టీడీపీ నేతలు కంచర్ల భూపాల్ రెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డితో పాటు పలువురు నాయకులు, ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా హైదరాబాద్ లోని తెలంగాణ …

    Read More »
  • 6 November

    టీఆర్ఎస్‌ను నాడు చుల‌క‌న చేసినోళ్లే…నేడు కీర్తిస్తున్నారు..మంత్రి ఈట‌ల

    తెలంగాణ వస్తే పరిపాలించుకోవటం చేతకాదు అని హేళ‌న చేసిన‌వారే…ఇవ్వాళ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ప్ర‌శంసిస్తున్నార‌ని రాష్ట్ర ఆర్థిక‌ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. టీఆర్ఎస్‌ పార్టీని చులకన చేసిన పార్టీలు… నాయకులు ఇప్పుడు త‌మ పాలనను ప్రశంసిస్తున్నారని వివ‌రించారు. నల్లగొండ జిల్లా టీడీపీ నేతలు కంచర్ల భూపాల్‌రెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డితోపాటు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, నాయకులు, కార్యకర్తలు మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సంద‌ర్భంగా …

    Read More »
  • 6 November

    శవ‌రాజ‌కీయాలు కాదు..ఉత్త‌మ్ 2009 ఎస్సీ మ‌ర‌ణాల‌పై స్పందించు..ఓదెలు

    ఎమ్మార్పీఎస్ ఆందోళ‌న‌లో మ‌హిళా కార్య‌క‌ర్త మ‌ర‌ణించ‌డంపై ప్రభుత్వ విప్ నల్లల ఓదెలు విచారం వ్య‌క్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ విప‌క్షాలు శ‌వ‌రాజ‌కీయాలు చేయడం స‌రికాద‌ని అన్నారు. ఈరోజు జరిగిన సంఘటనలో ఎమ్మార్పీఎస్ కార్యకర్త మృతి పట్ల సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారని తెలిపారు. వారి కుటుంబానికి నిండు అసెంబ్లీ సాక్షిగా 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని విప్ ఓదెలు తెలిపారు. వారి కుటుంబంలో ఒక్కరి …

    Read More »
  • 6 November

    భాగమతి ఫస్ట్ లుక్ విడుదల ..

    భారీ ప్రాజెక్టు బాహుబలి తర్వాత అనుష్క నటిస్తోన్న లేటెస్ట్ మూవీ భాగమతి. ఫిల్ల జమీందార్ ఫేం జి అశోక్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైంది. ఇవాళ స్వీటీ అనుష్క బర్త్ డే సందర్భంగా చిత్రయూనిట్ భాగమతి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. పోస్టర్ ను చూస్తుంటే అనుష్క బాహుబలి సినిమాలో పోషించిన దేవసేన పాత్రను మరిపించేలా ఉన్నట్లుగా అనిపిస్తోంది.అనుష్క లీడ్ రోల్ పోషిస్తున్న ఈ …

    Read More »
  • 6 November

    దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ లో లేవర్ అండ్ ఉడ్..

    న్యూజిలాండ్ కు సంబంధించిన ప్రముఖ క్రికెటింగ్ మెటీరియల్ తయారీ సంస్థ ‘లేవర్ అండ్ ఉడ్’తమ షోరూమ్ ను యావత్తు భారతదేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ప్రారంభించారు. నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెం.2లో ఈ షోరూమ్ ను మంత్రి కేటీఆర్ ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆ షోరూమ్ లోనే సరదాగా కాసేపు కేటీఆర్ క్రికెట్ ఆడారు.‘లేవర్ అండ్ ఉడ్’ ప్రతినిధి విసిరిన రెండు బంతులను కేటీఆర్ …

    Read More »
  • 6 November

    కొడాలి నాని టీడీపీకి దిమ్మతిరిగే పంచ్ డైలాగ్ లు

    గుడివాడ వైసిపి ఎమ్మెల్యే కొడాలి నాని మళ్లీ పంచ్ డైలాగ్ లు వాడారు. ఇడుపుల పాయలో ప్రజా సంకల్ప యాత్ర ఆరంభం సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ జగన్ పాదయాత్రను ఆశీర్వదించడానికి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారని, వారందరికి ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు.ఇదే తరుణంలో ఆయన ఒక డైలాగ్ వేశారు. ‘పాదయాత్ర అంటే గుర్తుకొచ్చే పేరు వైఎస్‌. పెద్దపులి లాంటి వైఎస్‌ను చూసి ఓ నక్క పాదయాత్ర చేసింది. అని ఆయన …

    Read More »
  • 6 November

    ఓ మహిళ చేసిన పనికి ఏకంగా విమానాన్నే మళ్లించారు

    విమానంలో భర్తతో గొడవపడుతూ ఓ వివాహిత చేసిన గోలతో ఏకంగా విమానాన్నే మళ్లించాల్సి వచ్చింది. వివరాల్లోకెళితే.. ఇరాన్‌కి చెందిన ఓ మహిళ తన భర్తతో కలిసి బాలికి వెళ్తున్న ఖతార్‌ ఎయిర్‌వేస్‌కి చెందిన విమానం ఎక్కింది. విమానంలో భర్త నిద్రపోతుండగా మహిళ తన భర్త ఫోన్‌ తీసి అన్‌లాక్‌ చేసి చూసింది. అప్పటికే తాగి ఉన్న ఆమె భర్త ఫోనులో వేరే యువతుల సంభాషణలు, ఫొటోలు ఉండడం చూసి అందరి …

    Read More »
  • 6 November

    జ‌గ‌న్‌.. త‌న‌కి అనుకూలంగా మార్చుకునేనా..?

    ఏపీ ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత వైఎస్‌ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అనేక నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య సోమ‌వారం ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌ని స్టార్ట్ చేశారు. ఇక తొలిరోజు ఈ జ‌గ‌న్ పాద‌యాత్ర‌కి ప్ర‌జ‌ల నుండి విశేష స్పంద‌న వ‌చ్చింది. ఇప్పటికే ఆయ‌న దీక్షలు, ఓదార్పు యాత్రల‌తో జ‌నాల్లో విస్తృతంగా ప‌ర్యటించారు. అయితే జ‌గ‌న్‌ పాద‌యాత్ర చేయ‌డం మాత్రం ఇదే తొలిసారి. ఏపీ ప్రజ‌ల‌కు పాద‌యాత్ర లు కొత్తకాదు. గ‌తంలో 2002-03 మ‌ధ్య …

    Read More »
  • 6 November

    కుమార్తె రిసెప్షన్‌లో విక్రమ్‌… అతిథులు ఒక్కసారిగా సర్‌ప్రైజ్‌

    ప్రముఖ హీరో విక్రమ్‌ కుమార్తె అక్షిత వివాహం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి ముని మనవడు మనురంజిత్‌తో జరిగిన సంగతి తెలిసిందే. అక్టోబరు 30న చెన్నై గోపాలపురంలోని కరుణానిధి నివాసంలో ఈ వివాహం జరిగింది. ఆదివారం ఈ పెళ్లి రిసెప్షన్‌ను పాండిచ్చేరిలోని సంఘమిత్ర కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. అంతేకాదు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కేరళ రాష్ట్రాల నుంచి దాదాపు 3 వేల …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat