వరంగల్ జిల్లా మున్సిపల్ శాఖ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం సచివాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రులు స్పందిస్తూ.. 2018 డిసెంబర్ నాటికి వరంగల్ లోని అభివృద్ధి కార్యక్రమాలు అన్ని పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా వరంగల్ పర్యటనల సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల అమలు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. కాగా …
Read More »TimeLine Layout
October, 2017
-
31 October
హోంశాఖలో సూపర్ న్యూమరీ పోస్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
పోలీస్శాఖలో గత కొంతకాలంగా కొనసాగుతున్న పదోన్నతుల సమస్యపై ఇటీవలి కాలంలో సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష చేపట్టి తెరదించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హోంశాఖలో సూపర్ న్యూమరీ పోస్టులకు ప్రభుత్వం అనుమతి తెలిపింది. 35 అదనపు ఎస్పీ, 72 డీఎస్పీ పోస్టులకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి అందరికి అవకాశం కల్పిస్తామని సీఎం గతంలోనే చెప్పారు. ఈ క్రమంలో భాగంగా ప్రభుత్వం …
Read More » -
31 October
వాట్సాప్లో సరికొత్త ఆప్షన్.. ‘వాట్సాప్ పే’
వాట్సాప్లో సరికొత్త ఆప్షన్ రానున్నది. చాలా రోజులుగా ఈ ఆప్షన్ను తీసుకురావడానికి వాట్సాప్ కసరత్తులు చేసింది . దీన్ని అతి త్వరలోనే ప్రారంభించనున్నది. దీని పేరు వాట్సాప్ పే ఆప్షన్. దీని ద్వారా యూజర్లు సులభంగా ఫండ్ ట్రాన్స్ఫర్స్ చేసుకోవచ్చు.ఈ కొత్త ఫీచర్ను తొలిసారి భారత్లోనే ప్రారంభించనున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. పేటీఎమ్, ఎస్బీఐ బడ్డి, మొబిక్విక్లానే సులువుగా దీన్ని వాడొచ్చంటున్నారు. కాకపోతే ఇది వాడుకలోకి వస్తే వాటికి కోలుకోలేని దెబ్బ తగిలే …
Read More » -
31 October
రాష్ట్రంలో 12.5 వేల కోట్ల పెట్టుబడులు..
తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు దుబాయ్ కు చెందిన ప్రముఖ కంపెనీ బిన్ జాయెద్ గ్రూప్ తెలంగాణ ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తెలంగాణ ప్రభుత్వంతో కుదిరిన ఈ MoU మేరకు సుమారు 12500 కోట్ల రూపాయలను (రెండు బిలియన్ల అమెరికన్ డాలర్లను) తెలంగాణలోని మౌలిక వసతుల ప్రాజెక్టులపైన పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. బిన్ జాయెద్ గ్రూప్ చైర్మన్ అయిన షేక్ ఖాలేద్ బిన్ …
Read More » -
31 October
తెలంగాణలో టీడీపీ ఖాలీ..మంత్రి జూపల్లి
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కనుమరుగైందని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి మీడియా ద్వారా స్పందిస్తూ.. రేవంత్రెడ్డి వాస్తవాలు వక్రీకరించి మాట్లాడుతున్నడని.. ప్రజలు రేవంత్రెడ్డిలాంటి వాళ్ల మాటలు నమ్మరన్నారు. తెలంగాణను 60 ఏండ్లు కాంగ్రెస్, టీడీపీలే పాలించినయి. కానీ తెలంగాణ అభివృద్ధికి ఆ పార్టీలు చేసింది శూన్యమని దుయ్యబట్టారు. కాగా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో మూడున్నరేళ్ల పాలనలో టీఆర్ఎస్ సర్కార్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. …
Read More » -
31 October
జనవరి 1 నుంచి కొత్త పాస్ పుస్తకాలు..సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి ముగుస్తుందని.. జనవరి 1 నుంచి రైతులకు కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వనున్నట్లుమ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. వ్యవసాయశాఖ, రాష్ట్రస్థాయి బ్యాంకు అధికారులతో సీఎం కేసీఆర్ ఇవాళ సమావేశమయ్యారు. భేటీ సందర్భంగా కేసిఆర్ మాట్లాడుతూ .. ఎక్కడా రూపాయి ఖర్చు పెట్టుకుండా, ఆఫీసుల చుట్టూ తిరిగే ఇబ్బంది లేకుండా వ్యవసాయ భూముల క్రయ విక్రయాలకు సంబంధించి కొత్త …
Read More » -
31 October
కలెక్టరేట్లో దంపతుల ఆత్మహత్యాయత్నం…ఏం జరగింది
మధ్యాహ్న భోజన ఏజెన్సీని తొలగించడంతో పాటు గ్రామ బహిష్కరణ చేశారనే మనస్తాపంతో నిజామాబాద్ కలెక్టరేట్ ఆవరణలో సోమవారం దంపతులు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామానికి చెందిన దంపతులు మట్టెల రమేశ్, సునీత గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 12 సంవత్సరాలుగా మధ్యాహ్న భోజన ఏజెన్సీని నిర్వహిస్తున్నారు. అయితే రెండు నెలల క్రితం భోజన ఏజెన్సీని తొలగించామని, పాఠశాలకు …
Read More » -
31 October
దాని దెబ్బకు సొరంగం కుప్పకూలి.. 200 మంది మృతి!
ప్రపంచ దేశాల హెచ్చరికలు బేఖాతరు చేస్తూ.. ఉత్తర కొరియా ఇటీవల హైడ్రోజన్ బాంబును పరీక్షించిన సంగతి తెలిసిందే. హైడ్రోజన్ బాంబు పరీక్ష సందర్భంగా సమీపంలోని ఓ సొరంగం కుప్పకూలి.. 200 మంది చనిపోయినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉత్తర కొరియా ఈశాన్య ప్రాంతమైన పంగ్యే-రీ ప్రాంతంలో గత నెల కిమ్ జాంగ్ ఉన్ సర్కారు హైడ్రోజన్ అణుబాంబు పరీక్షించింది. కొరియా చేపట్టిన ఆరో అణ్వాయుధ పరీక్షల్లో భాగంగా సెప్టెంబర్ 3న …
Read More » -
31 October
జగన్ పాదయాత్రను స్వాగతిస్తున్న….సిపిఎం
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అదినేత జగన్ పాదయాత్రను స్వాగతిస్తున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు చెప్పారు.ప్రజలకు ఉపయోగపడే పాదయాత్రలు ఎవరు చేసినా తాము ఆహ్వానిస్తామని ఆయన అన్నారు.అందులో భాగంగానే జగన్ యాత్రను కూడా చూస్తున్నామని ఆయన అన్నారు.ఈ పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు మరింతగా వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును దోపిడీదారుల కేటగిరీలో లెక్కకట్టాల్సి వస్తోందని మధు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని పలువురు మంత్రులు, వారి …
Read More » -
31 October
అందరం కలిసి పత్తి రైతుకు చేయూతనిద్దాం..కేటీఆర్
ఈ ఏడాది పత్తి ఉత్పత్తి రికార్డు స్థాయిలో ఉండటంతో రైతులు మార్కెట్కు తెస్తున్న పత్తికి గిట్టుబాటు ధర లభించేలా రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఆర్థిక మంత్రి శ్రీ ఈటెల రాజేందర్, మార్కెటింగ్ శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీశ్ రావు, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ ఇవ్వాళ రాష్ట్రంలోని జిన్నింగ్ మిల్స్ యాజమాన్యాలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… …
Read More »