తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది .ఈ క్రమంలో ఒక యువతిని దారుణంగా హతమార్చి పైపు లైన్ కందకంలో పూడ్చివేసిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది .స్థానిక పోలీసుల కథనం ప్రకారం జిల్లాలో కాటారం మండల కేంద్రంలో గంటగూడేనికి చెందిన గంట సుగుణకుమారి తల్లి దండ్రులు కొద్ది రోజుల క్రితమే మరణించారు . దీంతో సుగుణ తన సోదరుడు అన్న రామచంద్రు ,సోదరి రజితతో కల్సి …
Read More »TimeLine Layout
September, 2017
-
30 September
నేడు రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు ..
తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేడు శని,రేపు ఆదివారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణ, దాని పరిసర ప్రాంతాల్లో భూ ఉపరితలం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం, దీనికి అనుబంధంగా దక్షిణ కర్ణాటక నుంచి రాయలసీమ, తెలంగాణ మీదుగా భూ ఉపరితలం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడిందని వెల్లడించింది. ఈ రెండింటి ప్రభావంతో గ్రేటర్తోపాటు, …
Read More » -
29 September
కాఫీ షాపు ఉద్యోగిపై కానిస్టేబుల్ దాడి..
హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఓ కాఫీ షాపులో ఉద్యోగిపై కానిస్టేబుల్ దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్లోని అర్బన్ గిల్ కాఫీ షాపులో ఈ నెల 18న ఈ ఘటన చోటుచేసుకుంది. కాఫీ షాపులో పనిచేసే అబ్దుల్ గఫార్పై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్కు చెందిన రమేష్ అనే కానిస్టేబుల్ అకారణంగా దాడి చేశాడు. రక్షకభటుడిననే విషయం మర్చిపోయి ఓ వీధి గూండాలా ప్రవర్తించాడు. ఉద్యోగిపై పిడిగుద్దులు కురిపించాడు. ఇంత జరిగినా …
Read More » -
29 September
సీఎం కేసీఆర్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ -రూ. 6 లక్షల వడ్డీ లేని రుణం..
తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి లో త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ టీబీజీకేఎస్ అనేది ఉద్యమ సమయంలో పుట్టిన కార్మిక సంఘమని తెలిపారు. గతంలో ఈ రాష్ర్టాన్ని కాంగ్రెస్, టీడీపీ పరిపాలించాయని గుర్తు చేశారు. ఆ రెండు పార్టీలు సింగరేణి కార్మికుల సమస్యలు పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ఇంతకాలం సింగరేణిలో ఏం జరిగిందో కార్మికులందరికీ బాగా తెలుసు అన్నారు.ఆయన …
Read More » -
29 September
సీఎం కేసీఆర్ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం ..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి సంస్థలో వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్న ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. ఈ క్రమంలో భద్రాది-కొత్తగూడెం జిల్లాలోని సింగరేణి కొత్తగూడెంలో కార్మికులు సంబురాలు జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ ఎమెల్యే జలగం వెంకటరావు, శాసన మండలి విప్ పల్లా రాజేశ్వరరెడ్డి, టీబీజీకేఎస్ నాయకులు పాల్గొన్నారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలతో పాటు, ఒకవేళ వద్దనుకుంటే ఉద్యోగానికి బదులు రూ.25 లక్షలు, ఎఎంసీ నెలకు …
Read More » -
29 September
జగన్ కు జేసీ సలహా -జగన్ పాటిస్తాడా ..?
ఏపీ అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన నేత ,రాష్ట్రంలోని అనంతపురం పార్లమెంట్ సభ్యులు అయిన జేసీ దివాకర్ రెడ్డి నిత్యం ఏదో ఒక సంచలనానికి కేంద్ర బిందువుగా నిలుస్తుంటారు అనే విషయం విదితమే .ఇటీవల తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నాను .వచ్చే బుధవారం తన ఎంపీ పదవికి రాజీనామా చేసి లోక్ సభ స్పీకర్ కు అందజేస్తాను అని కూడా ఆయన ప్రకటించేశారు .అంతే కాకుండా తనని నమ్మి …
Read More » -
29 September
వచ్చే ఆదివారం ఏపీకి సీఎం కేసీఆర్ ..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు త్వరలోనే ఏపీ లో పర్యటించనున్నారు .ఈ క్రమంలో వచ్చే నెల ఒకటో తారీఖున ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ రాష్ట్ర మంత్రి పరిటాల సునీత తనయుడి వివాహానికి హాజరు కానున్నారు . దీనిలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్ వివాహానికి కెసిఆర్ హాజరవుతున్న పర్యటన షెడ్యూల్ ను జిల్లా అధికారులకు అందింది. జిల్లా …
Read More » -
29 September
మహానుభావుడు సినిమా రివ్యూ.. నీటుగాడు మెప్పించాడా..!
రివ్యూ : మహానుభావుడు బ్యానర్ : యువి క్రియేషన్స్ తారాగణం : శర్వానంద్, మెహ్రీన్, నాజర్, వెన్నెల కిషోర్, రఘుబాబు, భద్రం తదితరులు కూర్పు : కోటగిరి వెంకటేశ్వరరావు సంగీతం : ఎస్.ఎస్. తమన్ కళ : రవీందర్ ఛాయాగ్రహణం : నిజర్ షఫీ నిర్మాతలు : వంశీ – ప్రమోద్ రచన, దర్శకత్వం : మారుతి విడుదల తేదీ : సెప్టెంబర్ 29, 2017 టాలీవుడ్ యూత్ఫుల్ డైరెక్టర్ …
Read More » -
29 September
జగన్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన జేసీ.. పులిహోర ప్యాకెట్ అందినట్టుంది..!
ఏపీ రాజకీయ వర్గాలు ఊహించినట్లే అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి మాట మార్చారు. ఆయన తన రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తాను ప్రస్తావించిన సమస్యలను తీర్చడానికి అంగీకరించారని, అందువల్ల తాను లోక్ సభకు రాజీనామా చేయడం లేదని ఆయన చెప్పారు. గతంలో తాను ఎంపీగా అట్టర్ ప్లాప్ అయ్యానని జేసీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అప్పటికప్పుడు రాజీనామా చేసినంత హాడావుడి చేసి.. …
Read More » -
29 September
సింగరేణిలో బోగస్ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ ..!
తెలంగాణ రాష్ట్రంలో సింగరేణిలో బోగస్ ఉద్యోగులను రెండు నెలల్లో క్రమబద్దీకరిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ రోజు సింగరేణి ఎన్నికల గురించి తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ సింగరేణిలో సుమారు 14 నుండి 19 వేల మంది ఉంటారని చెప్పారు.బోగస్ ఉద్యోగులను ప్రతి ఒక్కరూ బెదిరిస్తారని చెప్పారు. దీంతో బోగస్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని కెసిఆర్ చెప్పారు.వారసత్వ ఉద్యోగాల …
Read More »