TimeLine Layout

July, 2022

  • 16 July

    మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన ష‌ర‌పోవా

     టెన్నిస్ స్టార్ మారియా ష‌ర‌పోవా మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది.ఆ బాబుకు  థియోడ‌ర్ అని పేరు పెట్టారు అని తెలిపింది ఈ స్టార్. అయిదు సార్లు(2004లో వింబుల్డ‌న్‌, 2006లో యూఎస్ ఓపెన్‌, 2008లో ఆస్ట్రేలియా ఓపెన్‌, ఇక 2012, 2014లో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచింది.) గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల‌తో పాటు మాజీ వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ వ‌న్ మారియా ష‌ర‌పోవా ఒక‌ప్పుడు టెన్నిస్‌లో సెన్షేష‌న్ క్రియేట్ చేసిన విష‌యం తెలిసిందే. బాబుకు జ‌న్మ‌నిచ్చిన విష‌యాన్ని …

    Read More »
  • 15 July

    ఎగ్‌ఫ్రైడ్‌ కలుషితం.. ట్రిపుల్‌ ఐటీలో 600 మందికి అస్వస్థత!

    బాసర ట్రిపుల్‌ ఐటీలో భోజనం వికటించి సుమారు 600 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత వాంతులు, విరేచనాలతో పలువురు విద్యార్థులు సృహతప్పి పడిపోయారు. మధ్యాహ్న భోజనంలో వడ్డించిన ఎగ్‌ఫ్రైడ్‌ రైస్‌ కలుషితం కావడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు ప్రాథమికంగా గుర్తించారు. పీయూసీ-1, పీయూసీ-2 మెస్‌లలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ రెండు మెస్‌లకు ఒకే చోట భోజనం తయారు చేస్తుంటారు. అప్రమత్తమైన అధికారులు …

    Read More »
  • 15 July

    అక్కడ గెలవలేనోళ్లు సిరిసిల్లలో కాంగ్రెస్‌ను గెలిపిస్తారా? కేటీఆర్‌

    టీఆర్‌ఎస్‌లో కొన్ని చోట్ల గొడవలు ఉండడం టీఆర్‌ఎస్‌ బలంగా ఉందనడానికి నిదర్శనం అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మంత్రి కేటీఆర్‌ అన్నారు. బలంగా ఉన్న నేతలను పార్టీ కలుపుకొని పోతుందని, ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆయన చిట్‌చాట్‌ నిర్వహించారు. రాష్ట్రమంతా టీఆర్‌ఎస్‌ ఒక్కటే ఉందని ఈ విషయాన్ని కాంగ్రెస్‌, బీజేపీ సర్వేలే స్పష్టం చేస్తున్నాయని కేటీఆర్‌ తెలిపారు. కేసీఆర్‌ దొర అంటూ ప్రతిపక్షాలు …

    Read More »
  • 15 July

    గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌: మొక్కలు నాటిన కీరవాణి టీమ్

    గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఎమ్‌ఎమ్‌. కీరవాణి తన టీమ్‌తో జూబ్లీహిల్స్‌లో  మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్‌ కీరవాణికి ఈ ఛాలెంజ్ఇచ్చారు. అనంతరం కీరవాణి మొక్కలు నాటమని డైరెక్టర్లు మణిశర్మ, వందేమాతరం శ్రీనివాస్, సింగర్ సునీతకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇస్తూ రిక్వెస్ట్‌ చేశారు. కీరవాణితో పాటు బిగ్‌బాస్ విన్నర్ సింగర్‌ రాహుల్ సిప్లిగంజ్, మోహనా బోగరాజు  తదితరులు ఉన్నారు.

    Read More »
  • 15 July

    మెట్రోపిల్లర్‌ను ఢీ కొట్టిన బైకు.. ఇద్దరు ష్పాట్‌డెడ్

    బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు అతివేగంతో మెట్రోపిల్లర్‌ను ఢీకొట్టి అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో చోటు చేసుకుంది. కర్ణాటకకు చెందిన మోహిన్‌ (23), ఒబేద్‌(22) హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో ఎర్రమంజిల్‌ నుంచి ఖైరతాబాద్ వైపు వెళ్తుండగా హనుమాన్‌ ఆలయం ఎదురుగా మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టారు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రతకు బైకు ధ్వంసం అయింది. పంజాగుట్ట పోలీసులు ఘటనాస్థలాన్ని …

    Read More »
  • 15 July

    డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ కన్నుమూత

    అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ కన్నుమూశారు. ఆమె అద్భుతమైన, అందమైన మహిళ అని, ఆమె జీవితం స్ఫూర్తిదాయకం అని ట్రంప్ ట్వీట్ చేశారు. మరణానికి గల కారణాలను పేర్కొనలేదు. 1977లో ట్రంప్, ఇవానా పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. 1990లో విడాకులు తీసుకున్నారు. 1993లో నటి మార్గాను ట్రంప్ పెళ్లి చేసుకున్నారు. 1999లో ఆమెను వదిలేసి, 2005లో మెలానియా ట్రంపు పెళ్లాడారు.

    Read More »
  • 15 July

    పన్నీరు సెల్వానికి మరో షాక్

    తమిళనాడు ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన ఆ రాష్ట్ర మాజీ సీఎం పన్నీరు సెల్వానికి మరో షాక్ తగిలింది. ఆయన ముగ్గురు కుమారులు సహా 16 మంది అనుచరులపై తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళనిస్వామి వేటు వేశారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యహరిస్తున్నందునే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. క్రమంగా పన్నీరుసెల్వం వర్గాన్ని పార్టీ నుంచి పూర్తిగా తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

    Read More »
  • 15 July

    రెండో వన్డేలో టీమిండియాపై 100 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం

     నిన్న గురువారం  జరిగిన రెండో వన్డేలో టీమిండియాపై 100 పరుగుల తేడాతో  ఇంగ్లాండ్  జట్టు  గెలిచింది. దీంతో సిరీస్ లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. 247 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా 38.5 ఓవర్లలో 146 రన్స్కే ఆలౌటైంది. టీమిండియా ఆటగాళ్లలో రోహిత్(0), ధావన్ (9), కోహ్లి(16), పంత్ (0), సూర్య (27), హార్దిక్ (29), జడేజా(29), షమీ(23) రన్స్ చేశారు. ఇంగ్లీష్ బౌలర్లలో టోప్లే …

    Read More »
  • 15 July

    నెలకు రూ.25లక్షలు ఆఫర్ చేశారు-నీతూ చంద్ర సంచలన వ్యాఖ్యలు

    అప్పుడేప్పుడో విడుదలైన ‘గోదావరి’తో  తెలుగు సినిమా ఇండస్ట్రీకి  పరిచయమైన అలనాటి నటి నీతూ చంద్ర. ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లయినా ఛాన్స్ల కోసం ప్రయత్నిస్తోంది ఈ ముద్దుగుమ్మ. తనను కావాలనే కొందరు దూరం పెడుతున్నట్లు ఆరోపించింది. ఛాన్స్లు రాకపోవడంతో సూసైడ్ చేసుకోవాలని అనిపించిందని తెలిపింది. ఓ వ్యాపారవేత్త తనకు భార్యగా ఉంటే నెలకు రూ.25 లక్షలు ఇస్తానని ఆఫర్ చేశాడని చెప్పింది. తాను హాలీవుడ్ కు ఎంపిక కావడం కొందరు …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat