నటుడు అక్కినేని అఖిల్ను ఉద్దేశించి ప్రముఖ నటి సమంత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత తొలిసారిగా అఖిల్పై సామ్ పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో అది వైరల్ అవుతోంది. అఖిల్ బర్త్ డే సందర్భంగా అతనికి విషెష్ తెలుపుతూ సమంత పోస్ట్ చేశారు. ‘హ్యాపీ బర్త్డే అఖిల్. నువ్వు దేనికోసమైతే కలలు కంటున్నావో అవన్నీ నిజం కావాలని దేవుడ్ని ప్రార్థిస్తాను. ఈ ఇయర్ నీకు …
Read More »TimeLine Layout
April, 2022
-
9 April
గుడ్ న్యూస్.. కరోనా వ్యాక్సిన్ల ధర భారీగా తగ్గింపు
దేశ ప్రజలకు ప్రముఖ వ్యాక్సిన్ తయారీ సంస్థలు గుడ్ న్యూస్ చెప్పాయి. కరోనా నియంత్రణకు సంబంధించిన కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్ల ధరలను తగ్గిస్తున్నట్లు ఆయా సంస్థలు ప్రకటించాయి. రేపటి నుంచి 18 ఏళ్లు దాటిన వారందరికీ ప్రికాషన్ డోసు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ధరలను భారీగా తగ్గించినట్లు తెలుస్తోంది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని కొవిషీల్డ్ ధర ప్రైవేట్ హాస్పటల్స్లో రూ.225 ఉండనున్నట్లు ఆ సంస్థ సీఈవో …
Read More » -
9 April
కేసీఆర్ ముందే చెప్పినా బీజేపీ నేతలు రెచ్చగొట్టారు: కేటీఆర్
రాష్ట్ర బీజేపీ నేతలు రైతులను రెచ్చగొట్టి వరి వేయించారని.. ఇప్పుడు ధాన్యం కొనమంటే కేంద్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. యాసంగి ధాన్యం కొనుగోలుకు కేంద్రం సిద్ధంగా లేదని కేసీఆర్ ముందే రైతులకు సూచించారని.. అయినప్పటికీ రైతులను బీజేపీ నేతలు రెచ్చగొట్టారని ఆరోపించారు. ఇది అన్నదాత పోరాటం మాత్రమే కాదని.. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటమని …
Read More » -
9 April
ఏపీలో కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ.. వాళ్లకి ఆహ్వానాలు వెళ్లాయ్!
ఎల్లుండి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ జరగనున్న నేపథ్యంలో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 11న మంత్రివర్గ ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆహ్వానపత్రాలు, పాస్లు పంపుతున్నారు. పాత, కొత్త మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులకు ఈ ఆహ్వానపత్రాలు వెళ్తున్నాయి. ప్రజాప్రతినిధుల స్థాయిని బట్టి Aa, A1, A2, B1, B2 కేటగిరీలుగా పాస్లను జారీ చేశారు. ప్రమాణస్వీకారం అనంతరం గవర్నర్తో తేనీటి …
Read More » -
9 April
డ్రగ్స్ వెనుక సొంతపార్టీ వాళ్లున్నా వదలం: శ్రీనివాస్ గౌడ్
సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి దశలో పేకాట క్లబ్లు మూసివేయించారని.. ఆ తర్వాత గుడుంబా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దారని తెలంగాణ ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మాదక ద్రవ్యాలు ఏ రూపంలో ఉన్నా అడ్డుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇటీవల బంజారాహిల్స్లోని ఓ పబ్పై పోలీసుల దాడిలో కొన్ని రకాల మత్తు పదార్థాలు లభ్యమైన నేపథ్యలో హైదరాబాద్లోని పబ్ యజమానులతో మంత్రి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో …
Read More » -
9 April
అమిత్ షా కు మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
హిందీ భాష పై అమిత్ షా వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ ట్విటర్లో కౌంటర్ ఇచ్చారు. ‘‘భిన్నత్వంలో ఏకత్వం అనేది భారత దేశం బలం.. అందుకే భారతదేశం వసుదైక కుటుంబం అయింది. ఏం తినాలో ఏం వేసుకోవాలో ఎవర్ని పూజించాలో ఏ భాష మాట్లాడాలో అనేది ప్రజలను నిర్ణయించుకొనివ్వండి. భాష ఆధిపత్యం ఎప్పటికీ చెల్లదు. నేను ముందు భారతీయుడిని , తర్వాతే తెలంగాణ బిడ్డను. నా మాతృ భాష తెలుగు, నేను …
Read More » -
9 April
బీజేపీ ప్రభుత్వంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు
కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీ ప్రభుత్వంపై మహరాష్ట్ర అధికార పార్టీ అయిన శివసేనకి చెందిన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. మహరాష్ట్రలోని ముంబైను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసేందుకు బీజేపీకి చెందిన కొంతమంది నేతలు కొందరు వ్యూహరచన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కీరత్ సోమయ్య నాయకత్వంలో ఈ కుట్ర జరుగుతుందని విమర్శించారు. ఇందుకు సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ప్రెజెంటేషన్ ఇచ్చారని చెప్పారు. మరాఠీ భాష …
Read More » -
9 April
తన అభిమానులకు హీరో విజయ్ వార్నింగ్.. ఎందుకంటే..?
తమిళ పవర్ స్టార్ విజయ్ దళపతి హీరోగా నటించిన బీస్ట్ చిత్రం ఈనెల 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ తరుణంలో తన అభిమానుల విషయంలో హీరో విజయ్ ముందు జాగ్రత్తగా కొద్దిగా తొందర పడ్డాడు. దేశంలో ముఖ్యంగా రాష్ట్రంలో పలు రాజకీయ పార్టీలను, పదవుల్లో ఉన్న వారిని, అధికారుల్ని.. ఇలా ఎవ్వరినీ విమర్శించ వద్దని అభిమానులను హెచ్చరించాడు. మీడియాలో, సోషల్ మీడియాలో ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సూచించాడు. …
Read More » -
9 April
ఒమిక్రాన్ బాధితుల గురించి షాకింగ్ న్యూస్
యావత్ ప్రపంచాన్ని గజగజ వణికించిన డెల్టా వేరియంట్ సోకినవారితో పోలిస్తే ఒమిక్రాన్ బాధితుల్లో కొవిడ్ లక్షణాలు 2 రోజుల ముందుగానే తగ్గుతున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. బ్రిటన్లో 2 డోసులు తీసుకున్న తర్వాత కూడా మహమ్మారి బారిన పడ్డ 63 వేల మంది డేటాను.. ‘కింగ్స్ కాలేజ్ లండన్’ పరిశోధకులు పరిశీలించగా ఈ వెల్లడయ్యాయి. మూడో డోసు కూడా తీసుకున్నవారిలోనైతే.. ఒమిక్రాన్ లక్షణాలు మరింత తక్కువ కాలంలోనే అదృశ్య మయ్యాయని …
Read More » -
9 April
దేశంలో కొత్తగా 1,150 కరోనా కేసులు
దేశంలో కరోనా వైరస్ కట్టడిలోనే ఉంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,150 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. 83 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కేరళలోనే 75 మంది కొవిడ్తో చనిపోయారు. దేశంలో ప్రస్తుతం 11,365 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ రెండేళ్ల కాలంలో 4.30 కోట్ల మందికి కరోనా సోకగా.. అందులో 98.76 శాతం మంది వైరస్ నుంచి బయటపడ్డారు. ఇప్పటి వరకు 185 కోట్లకు పైగా …
Read More »