TimeLine Layout

April, 2022

  • 3 April

    Hyderabad Drugs Case-4గురు అరెస్టు

    తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో బంజారాహీల్స్ లో డ్రగ్స్ కేసు సంచలనం సృష్టిస్తుంది..ఇందులో భాగంగా బంజారాహిల్స్ లోని  పబ్ లో డ్రగ్స్ పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు నలుగురిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. డీజే ఆపరేటర్ వంశీధర్ రావు, పబ్ నిర్వాహకుడు అభిషేక్ ముప్పల, ఈవెంట్ మేనేజర్ అనిల్, వీఐపీ మూమెంట్ చూసే …

    Read More »
  • 2 April

    కేంద్రంపై టీఆర్‌ఎస్‌ యాక్షన్‌ ప్లాన్‌.. ప్రకటించిన కేటీఆర్‌

    తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రప్రభుత్వంపై మరింత గట్టిగా ఫైట్‌ చేయాలని టీఆర్‌ఎస్‌ పార్టీ నిర్ణయించింది. దీనికి సంబంధించిన యాక్షన్‌ ప్లాన్‌ను టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌ ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలు అంశంలో బీజేపీ నేతలు ఢిల్లీలో ఒకలా.. గల్లీలో మరొకలా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఆనవాయితీగా బియ్యాన్ని కొనుగోలు చేస్తోందని కేటీఆర్‌ చెప్పారు. ఈ యాసంగిలో …

    Read More »
  • 2 April

    ఆ సమయంలోపు రాజధాని నిర్మాణం పూర్తికాదు: ఏపీ ప్రభుత్వం

    ఏపీ రాజధాని అమరావతి అంశంలో సీఎస్‌ సమీర్‌ శర్మ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఈనెల 3వ తేదీలోపు రైతులకు ఇచ్చిన స్థలాల్లో పనులు పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎస్‌ అఫిడవిట్‌ సమర్పించారు. మొత్తం 190 పేజీల అఫిడవిట్‌ను కోర్టులో అందజేశారు. ఆ అఫిడవిట్‌ ప్రకారం హైకోర్టు నిర్దేశించిన గడువులోపు రాజధాని నిర్మాణం సాధ్యం కాదని ప్రభుత్వం పేర్కొంది. రాజధాని …

    Read More »
  • 2 April

    చంద్రబాబు అలా గెలిస్తే నేను పాలిటిక్స్‌ నుంచి తప్పుకుంటా

    మంత్రి పదవులపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తీసుకునే నిర్ణయం తమకు శిరోధార్యమని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. తమకు పదవులు ఉన్నా.. లేకపోయినా జగన్‌తోనే ఉంటామని చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం నారాయణస్వామి మీడియాతో మాట్లాడారు.  దేవుని అనుగ్రహం, ప్రజల ఆశీస్సులు ఉన్నంతకాలం సీఎంగా జగనే ఉంటారని నారాయణస్వామి చెప్పారు. అన్నీ అనుకూలిస్తే 15 సంవత్సరాల తర్వాత జగన్‌ ప్రధాని కూడా అవుతారని వ్యాఖ్యానించారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌పై …

    Read More »
  • 2 April

    RRRకి సీక్వెల్‌? రాజమౌళి తండ్రి ఏం చెప్పారంటే..

    ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటించిన RRR మూవీ సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రన్‌ అవుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లు కలెక్ట్‌ చేసి మరిన్ని రికార్డుల దిశగా దూసుకెళ్తోంది. అయితే ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీకి సీక్వెల్‌ ఉంటుందా అనే ప్రశ్న ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ అభిమానుల్లో ఎప్పటినుంచో ఉంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా సీక్వెల్‌పై ఆర్‌ఆర్‌ఆర్‌ కథా రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ ఓ ఇంటర్వ్యూలో …

    Read More »
  • 2 April

    హైదరాబాద్‌ మెట్రోలో ‘సూపర్‌ సేవర్‌’ వచ్చేసింది!

    హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం చేకూర్చే  ‘సూపర్‌ సేవర్‌’ ఆఫర్‌ అమల్లోకి వచ్చింది. నేటి నుంచి అన్ని మెట్రో స్టేషన్లలో దీనికి సంబంధించిన కార్డులను అందజేస్తున్నారు. మెట్రో రైలు యాజమాన్యం పేర్కొన్న విధంగా ప్రతి నెల మొదటి, నాలుగో శనివారాలు, అన్ని ఆదివారాలు, ఇతర పండగలు కలిపి ఏడాదిలో మొత్తం 100 రోజుల పాటు ఈ సూపర్‌ సేవర్‌ ఆఫర్‌ వర్తిస్తుంది. ఆయా రోజుల్లో కేవలం రూ.59కే …

    Read More »
  • 2 April

    మరోసారి ప్రపంచాన్ని వణికిస్తోన్న కొత్త కరోనా వేరియంట్

    ప్రపంచంలో తాజాగా ఎక్స్ఈ ఒమైక్రాన్ కొత్త కొవిడ్ సబ్ వేరియంట్ వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఒమైక్రాన్ బీఏ.2 సబ్ వేరియంట్ కంటే 10 శాతం అధికంగా వ్యాప్తి చెందుతుందని డబ్ల్యూహెచ్‌వో  హెచ్చరించింది. కరోనా బీఏ.2 ఒమైక్రాన్ తో పోలిస్తే ఒమైక్రాన్ ఎక్స్ఈ సబ్ వేరియంట్ 10 శాతం వృద్ధి రేటు ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన ఎపిడెమియోలాజికల్ నివేదికలో పేర్కొంది.ఎక్స్ఈ కరోనా వేరియంట్ మొదటిసారి …

    Read More »
  • 2 April

    ఉగాది పంచాంగం – ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందంటే..?

    మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 పాదం) ఆదాయం : 14, వ్యయం : 14;  రాజపూజ్యం : 3, అవమానం : 6 మేష రాశి వారు శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరంలో ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఆస్తిపాస్తులు సమకూర్చుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి కనిపిస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. అనుబంధాలు బలపడతాయి. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. న్యాయవివాదాల్లో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. …

    Read More »
  • 2 April

    కమర్షియల్‌ సిలిండర్‌ ధర జోక్‌ అయితే బాగుండు – మంత్రి కేటీఆర్‌ ట్వీట్లు

    ’19 కేజీల కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.250 పెరిగింది. ఇప్పుడా గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.2,253కు చేరింది. పెరిగిన ధరలు శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయి’ అనే వార్తను ట్వీట్‌ చేశారు. ఇది ‘ఏప్రిల్‌ ఫూల్‌ తరహాలో జోక్‌ అయితే బాగుండేదని నేను తీవ్రంగా ఆకాంక్షిస్తున్నాను’ అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. కాసేపటికి ‘ఏప్రిల్‌ ఫస్ట్‌ చాలా ముఖ్యమైన రోజు.. నేను దీన్ని అచ్చే దిన్‌ దివస్‌’గా సెలబ్రేట్‌ …

    Read More »
  • 2 April

    దేశంలో అత్యధికంగా పని కల్పిస్తున్న రాష్ర్టాల్లో ఒకటిగా తెలంగాణ

    దేశంలో అత్యధికంగా పని కల్పిస్తున్న రాష్ర్టాల్లో ఒకటిగా నిలిచింది. కేంద్రం నిర్దేశించిన లక్ష్యం 13 కోట్లు కాగా 2021-22లో 14.40 కోట్ల పనిదినాలను ఉపాధి హామీ కూలీలకు కల్పించారు. మొత్తం రూ.4,080 కోట్లు ఖర్చు చేశారు. గత ఎనిమిదేండ్లలో తెలంగాణ రెండుసార్లు అత్యధిక పనిదినాలను కల్పించింది. 2019-20లో 15.79 కోట్ల పనిదినాలను కల్పించారు. పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో శాశ్వత మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఉపాధి హామీ పనులను వినియోగిస్తున్నారు. …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat