TimeLine Layout

March, 2022

  • 7 March

    దేశంలో కొత్తగా 4,362 కరోనా కేసులు

    దేశంలో కొత్తగా 4,362 కరోనా  కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,29,67,315కు చేరింది. ఇందులో 4,23,98,095 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 5,15,102 మంది బాధితులు మరణించగా, 54,118 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకు 66 మంది మరణించగా, 9620 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

    Read More »
  • 7 March

    ఫిల్మ్ నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంత్రి హారీష్ రావు ప్రత్యేక పూజలు

    తెలంగాణ రాష్ట్ర బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడుతున్న సంద‌ర్భంగా ఫిల్మ్ న‌గ‌ర్ వెంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యంలో ఆర్థిక మంత్రి హ‌రీశ్ రావు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఆల‌య అర్చ‌కులు మంత్రిని ఆశీర్వ‌దించి తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేశారు. హ‌రీశ్‌రావుతో పాటు మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు కూడా పూజా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. అక్క‌డ్నుంచి నేరుగా హ‌రీశ్‌రావు అసెంబ్లీకి బ‌యల్దేర‌నున్నారు.కోకాపేట్‌లోని త‌న నివాసం వ‌ద్ద హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆశీస్సుల‌తో మూడోసారి బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడుతున్నాన‌ని …

    Read More »
  • 7 March

    నేటి నుండి తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు

    తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. సమావేశాల తొలిరోజే ప్రభుత్వం 2022-23 వార్షిక బడ్జెట్‌ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు, మండలిలో శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడుతారు. రాష్ట్ర మంత్రివర్గం ఆదివారం సాయంత్రం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. శాఖలవారీగా బడ్జెట్‌ ప్రతిపాదనలపై …

    Read More »
  • 7 March

    టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జీవ‌న్ రెడ్డి, ష‌కీల్‌కు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత జ‌న్మ‌దిన శుభ‌కాంక్ష‌లు

    తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు జీవ‌న్ రెడ్డి, ష‌కీల్‌కు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత జ‌న్మ‌దిన శుభ‌కాంక్ష‌లు తెలిపారు. ఈ ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌కు పుష్ప‌గుచ్ఛం అందించి, శాలువాతో స‌త్క‌రించారు. ఎమ్మెల్యేలు జీవ‌న్ రెడ్డి, ష‌కీల్‌కు టీఆర్ఎస్ శ్రేణులు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. వీరిద్ద‌రి జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో వారి మ‌ద్ద‌తుదారులు, అభిమానులు ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు.

    Read More »
  • 6 March

    కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో మెగాస్టార్ భేటీ

    మెగాస్టార్ చిరంజీవిని  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కలిశారు.. ఏప్రిల్  నెలలో జరిగే అఖిల భారత సాంస్కృతిక కార్యక్రమాలకు రావాలని ఆహ్వానించారు. అనంతరం మాట్లాడిన చిరంజీవి.. ‘ఈ వేడుకల్లో పాల్గొనడం నాకు దక్కిన గౌరవం. జానపద, గిరిజన కళలు, సంగీత, వివిధ రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రోత్సహించడానికి ఇలాంటివి అవసరం’ అని అన్నారు. కాగా ఏప్రిల్ 1 నుంచి 3 వరకు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి.

    Read More »
  • 6 March

    రాత్రి నా వీడియోలు చూస్తారు.. పగలు తిడతారు

    బాలీవుడ్ హాట్ బ్యూటీ కంగనా రనౌత్ హోస్ట్ చేస్తున్న ‘లాకప్’ రియాలిటీ షోలో బాలీవుడ్ నటి పూనమ్ పాండే హాట్ కామెంట్స్ చేసింది. ‘నా వీడియోలకు లక్షల వ్యూస్ వస్తున్నాయి. అంటే రాత్రి వాటిని చూసి, పగలు నాపై విమర్శలు చేస్తున్నారు. కొందరు మహిళలు గ్రూప్ గా ఏర్పడి నాపై పుకార్లు సృష్టిస్తున్నారు. నేను బోల్డ్ షో చేసినంత మాత్రాన సిగ్గులేని దాన్ని అవుతానా? ఇతరులను ఇబ్బందికి గురి చేసేవారే …

    Read More »
  • 6 March

    ట్రోల్స్ పై నేహా శెట్టి సంచలన వ్యాఖ్యలు

    ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన డీజే టిల్లు సినిమాలో తన పాత్రతో మెప్పించిన హీరోయిన్ నేహా శెట్టిపై ఇటీవల సోషల్ మీడియాలో పలు ట్రోల్స్ వచ్చాయి. తాజాగా వాటిపై స్పందించింది ఈ బ్యూటీ.. ‘మనం ప్రతి ఒక్కరికీ నచ్చాలని లేదు. కొంతమందికి నచ్చవచ్చు. లేకపోతే లేదు. నేను చేసిన రాధికా రోల్ కొంతమందికి నచ్చలేదు. మెజార్టీ ఆడియన్స్ మాత్రం ఇష్టపడ్డారు. అది నాకు సంతోషంగా అనిపించింది’ అని చెప్పింది.

    Read More »
  • 6 March

    మీ ఎముకలు బలంగా ఉండాలా?

    ఎముకలు బలంగా ఉండాలా? ఇవి తినండి .  ఆహారంలో పైనాపిల్, స్ట్రాబెర్రీ ఉండేలా చూసుకోండి  ప్రతిరోజూ యాపిల్, బొప్పాయి తినండి పాలు క్రమం తప్పకుండా తాగండి  గుడ్లు నిత్యం తినండి అప్పుడప్పుడు సాల్మన్ ఫిష్, జున్ను తీసుకోండి ISF బచ్చలికూర, అవిసె, గుమ్మడి గింజలు తినండి

    Read More »
  • 6 March

    యూపీలో బీజేపీకి షాక్

    యూపీలో చివరి దశ ఎన్నికల ముందు  బీజేపీకి షాక్ తగిలింది. ప్రయాగ్జ్ బీజేపీ ఎంపీ రీటా బహుగుణ జోషి కుమారుడు మయాంక్ జోషి సమాజ్వాదీ పార్టీలో చేరారు. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్.. మయాంక్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అభివృద్ధి, మహిళల భద్రత, యువతపై అఖిలేశ్ దృష్టి పెట్టారని, రాష్ట్ర భవిష్యత్తు ఆయన చేతుల్లోనే ఉందని, అందుకే ఆయన వెంట నడవాలని నిర్ణయించుకున్నట్లు మయాంక్ తెలిపారు.

    Read More »
  • 6 March

    పాదయాత్రను మళ్లీ ప్రారంభించనున్న YS Sharmila

    ప్రజాప్రస్థానం పేరిట YSRTP అధినేత్రి వైఎస్ షర్మిల తలపెట్టిన పాదయాత్ర ఈ నెల 11న పునఃప్రారంభం కానుంది. గత ఏడాది అక్టోబర్ 20న చేవెళ్ల నుంచి పాదయాత్రను ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రను చేపట్టాలనుకున్నారు.. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నల్లగొండ జిల్లాలోని కొండపాకగూడెం వద్ద పాదయాత్రకు బ్రేక్ పడింది. దీంతో ఇప్పుడు మళ్లీ అక్కడ నుంచే ప్రారంభించనున్నారు.

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat