TimeLine Layout

March, 2022

  • 5 March

    రష్యాకు సామ్‌సంగ్‌ షాక్

    ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో బహుజాతి సంస్థలు ఒక్కొక్కటిగా రష్యాలో తమ సేవలను నిలిపివేస్తున్నాయి. ఇప్పటికే యాపిల్‌, నైక్‌, ఐకియా, యూటూబ్, ఫేస్‌బుక్‌ వంటి సంస్థలు రష్యాలో తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయగా, తాజాగా సామ్‌సంగ్‌ (Samsung) కూడా ఆ జాబితాలో చేరింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశానికి ఫోన్లు, చిప్‌ల సరఫరాను నిలిపివేసినట్లు ప్రకటించింది సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రకటించింది. పరిస్థితులను బట్టి తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుంటామని స్పష్టం చేసింది. …

    Read More »
  • 5 March

    ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీకి అరుదైన ఆహ్వానం

    ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీకి అరుదైన ఆహ్వానం అందింది. అమెరికా సేనేట్‌లో ప్ర‌సంగం చేయ‌డానికి జెలెన్‌స్కీకి ఆహ్వానం వ‌చ్చింది. జూమ్ ద్వారా జ‌రిగే స‌భా కార్యక్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతారు. అమెరికా అధ్య‌క్షుడు బైడెన్ ఇటీవ‌ల జెలెన్‌స్కీతో ట‌చ్‌లో ఉన్నారు. ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడికి దిగిన నాటి నుంచి ఆ దేశానికి బైడెన్ మ‌ద్ద‌తు ఇస్తున్న విష‌యం తెలిసిందే. సేనేట్‌లో ఉన్న స‌భ్యులంద‌రితో జెలెన్‌స్కీ మాట్లాడ‌నున్నారు. ఉక్రెయిన్‌కు చెందిన అంబాసిడ‌ర్ ఒక్‌సానా మ‌ర్క‌రోవా …

    Read More »
  • 5 March

    ‘తె‌లం‌గాణ హెల్త్‌ ప్రొఫైల్‌’ను ప్రారంభించిన మంత్రి హరీశ్‌ రావు

    తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వం ప్రతి‌ష్ఠా‌త్మకంగా చేప‌ట్టిన మరో పథకం ‘తె‌లం‌గాణ హెల్త్‌ ప్రొఫైల్‌’ను మంత్రి హరీశ్‌ రావు ప్రారంభించారు. ఆరోగ్య తెలం‌గాణే లక్ష్యంగా అడు‌గులు వేస్తున్న ప్రభుత్వం రాష్ట్రం‌లోని 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరి ఆరోగ్య సమగ్ర సమా‌చార నివే‌దిక (హెల్త్‌ ప్రొఫైల్‌) సిద్ధం చేయా‌లని నిర్ణయిం‌చింది. దీనికోసం పైలట్‌ ప్రాజెక్టులుగా ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇందులో భాగంగా ములుగు జిల్లా కలెక్టరేట్‌లో …

    Read More »
  • 5 March

    విరాట్ ఔట్ – వైరలవుతున్న ట్వీట్

    టీమిండియా మాజీ కెప్టెన్… పరుగుల యంత్రం విరాట్ కోహ్లి శ్రీలంకతో జరుగుతున్న తొలిటెస్ట్ మ్యాచ్ తో తన వందో టెస్టులో సెంచరీ కొట్టలేడు., 45 పరుగుల వద్ద ఎంబుల్డెనియా బౌలింగ్ అవుటవుతాడని మ్యాచ్ కు ముందే ఓ ట్వీట్ వైరల్ అయ్యింది. శ్రుతి అనే పేరుతో ఉన్న యూజర్ ట్వీట్లో ఈ పోస్టు ఉంది. దీనికి వీరేంద్ర సెహ్వాగ్ వావ్ అంటూ స్పందించాడు. అయితే ఇది ఫ్యాబ్రికేటెడ్ ట్వీట్లా ఉందని …

    Read More »
  • 5 March

    ఆరోగ్యంగా ఉండాలంటే

    ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ ఇవి పాటించండి *వ్యాయామం ప్రతిరోజూ ఓ గంటపాటు చేయాలి. *పుస్తక పఠనం, గార్డెనింగ్, కుటుంబంతో గడపడానికి * కనీసం రెండు గంటలు కేటాయించాలి. *సమయం తప్పకుండా రోజుకు మూడు సార్లు ఆహారం తినాలి. *ఐదు రకాల పండ్లు, కూరగాయలను తీసుకోవాలి. *ఏకాగ్రత కోసం ఐదారు నిమిషాలు ధ్యానం చేయాలి *రోజులో కనీసం 7 గ్లాసుల నీళ్లు తాగాలి. 8 గంటలు నిద్రపోవాలి. *రోజులో కనీసం 9వేల …

    Read More »
  • 5 March

    రోజూ ఒక ఉసిరి తింటే

    రోజూ ఒక ఉసిరి తింటే ఉపయోగాలివే.. ఊపిరితిత్తులు, కంటి వ్యాధుల నివారణకు ఉసిరిని మంచి ఔషధం.  ఉసిరిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మం త్వరగా ముడతలు పడకుండా చేస్తాయి. ఉసిరికాయల్ని గ్రైండ్ చేసి, తలకి పట్టిస్తే కళ్ల మంటలు తగ్గుతాయి. వెంట్రుకలు బాగా పెరగడంతోపాటు నల్లగా నిగనిగలాడుతూ ఉంటాయి. ఇందులో రోగ నిరోధక శక్తిని పెంచే లక్షణాలు ఉన్నాయి.  ఎముకలు, దంతాలు, గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి

    Read More »
  • 5 March

    ఉక్రెయిన్ లో చనిపోయిన నవీన్ గురించి బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

    ఉక్రెయిన్లో చనిపోయిన నవీన్ మృతదేహం తరలింపుపై కర్ణాటక  బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యుద్ధ ప్రాంతం నుంచి బతికున్న వారిని తీసుకురావడం సవాల్ తో కూడుకున్న పని అని, మృతదేహాన్ని తేవడం ఇంకా కష్టమని చెప్పాడు. విమానంలో మృతదేహం ఎక్కువ స్థలం ఆక్రమిస్తుందని, ఆ ప్లేసులో 10 మంది కూర్చోవచ్చంటూ పేర్కొన్నాడు. గత 4 రోజులుగా నవీన్ డెడ్ బాడీ కోసం కుటుంబసభ్యులు ఎదురుచూస్తున్నారు.

    Read More »
  • 5 March

    ఇంటర్ పాసైనవారికి తెలంగాణ సర్కారు శుభవార్త

    కనీస మార్కులతో(35) ఇంటర్ పాసైనవారిని కూడా ఎంసెట్ ర్యాంకులకు అర్హులుగా ప్రకటించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. దీంతో ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాస్తున్న ప్రతి ఒక్కరికీ ఎంసెట్ కు అర్హత లభిస్తుంది. కరోనాతో రెండేళ్లుగా సరిగ్గా క్లాసులు జరగక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 40 మార్కులు వస్తేనే ఎంసెట్లో ఇంజనీరింగ్ సీటు సంపాదించే వీలుంది.

    Read More »
  • 5 March

    బరువు తగ్గడానికి ఈ చిట్కాలు చాలా అవసరం..?

    బరువు తగ్గడానికి చాలా మంది జొన్న రొట్టెలు, చపాతీలు తింటుంటారు. వీటితోపాటు సజ్జ రొట్టెలను తీసుకుంటే మంచి ప్రయోజనాలుంటాయి. సజ్జ రొట్టె లేట్గా జీర్ణమవుతుంది కాబట్టి త్వరగా ఆకలి వేయదు. ఫలితంగా బరువు తగ్గొచ్చు. సజ్జల్లో ప్రొటీన్స్, ఫైబర్, మినరల్స్ ఉంటాయి. ఇది గ్లూటెన్ రహిత ఆహారం. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు బ్యాలెన్స్ అవుతాయి. డయాబెటిస్ రోగులకు ఎంతో మంచిది. గ్యాస్ట్రి గ్యాస్ట్రిక్, మలబద్ధకం సమస్యలు రావు.

    Read More »
  • 5 March

    మరోసారి సెంచరీ చేజార్చుకున్నరిషబ్ పంత్-ట్వీట్ వైరల్

    శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో  టీమిండియా  డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్  వికెట్ కీపర్ రిషబ్ పంత్ మరోసారి సెంచరీ చేజార్చుకున్నాడు. శ్రీలంకతో తొలి టెస్టులో 96 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీనిపై మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ‘పిల్లలు పరీక్షల్లో 90కి పైగా మార్కులు సాధిస్తే తల్లిదండ్రులు గర్వపడతారు. లెజెండ్స్ 90+ స్కోర్ చేస్తే దేశం మొత్తం గర్వంగా ఫీలవుతుంది. సెంచరీ చేజారిందని …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat