TimeLine Layout

February, 2022

  • 25 February

    దేశంలో కొత్తగా 13,166 కరోనా కేసులు

    దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 10 లక్షల మందికి కరోనా టెస్టులు నిర్వహిచారు. ఈ పరీక్షల్లో 13,166 మందికి కరోనా అని తేలింది.26,988 మంది కోలుకున్నారు. 302 మంది మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 5,13,226కు చేరింది. యాక్టివ్ కేసులు 1,34,235 ఉన్నాయి. రికవరీ రేటు 98.49 శాతానికి పెరిగింది. నిన్న 32,04,426 మంది టీకా తీసుకున్నారు. మొత్తంగా 176 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయి.

    Read More »
  • 25 February

    రష్యా-ఉక్రెయిన్ విషయంలో భారత్ వైఖరి ఏంటి..?

    అమెరికా, రష్యాతో భారత్ కు బలమైన సంబంధాలున్నాయి. చైనాతో మన దేశానికి సరిహద్దుల్లో సంక్షోభం తలెత్తిన వేళ చైనాతో ఉన్న పరపతి ఉపయోగించి పుతిన్ ఆ దేశ దూకుడుకు కళ్లెం వేశారు. అలాగే రష్యా నుంచి మనం పెద్దఎత్తున ఆయుధాలు, క్షిపణులు కొనుగోలు చేస్తున్నాం. మనం ఉక్రెయిన్కు మద్దతు ఇస్తే రష్యాకు కోపం వస్తుంది. అలా అని నేరుగా రష్యాకు సపోర్ట్ చేస్తే అమెరికా, యూరప్ దేశాలకు మంట. దీంతో  …

    Read More »
  • 25 February

    విటమిన్”ఇ” తో అందంగా ఉండోచ్చా..?

    విటమిన్”ఇ”లో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ముఖానికి కావాల్సిన తేమ అందిస్తుంది. చుండ్రు, దురద, జుట్టు త్వరగా పెరగకపోవడం వీటన్నింటికి “ఇ” విటమిన్తో చెక్ పెట్టొచ్చు. రెండు క్యాప్సూళ్ల విటమిన్ “ఇ” నూనెను.. తలకు రాసే నూనెకు కలిపి, రాత్రి లేదా తల స్నానానికి అరగంట ముందు పట్టిస్తే ఫలితం ఉంటుంది. నిర్జీవంగా మారిన చేతి గోళ్లకు “ఇ” విటమిన్ నూనెతో మర్దన చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది.

    Read More »
  • 25 February

    ఢిల్లీకి సీఎం కేసీఆర్

    జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టిన తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఈ నెలాఖరులో ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. బీజేపీయేతర ముఖ్యమంత్రులతో భేటీ ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు సీఎం కేసీఆర్.. అందులో చర్చించాల్సిన అంశాలపై ఢిల్లీకి వెళ్లనున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రాంతీయ పార్టీల నాయకులతో పాటు వివిధ రంగాల నిపుణులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సమావేశం కానున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.

    Read More »
  • 25 February

    భీమ్లా నాయక్ పై దర్శకుడు హరీష్ శంకర్ సంచలన వ్యాఖ్యలు

    తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో హీరోయిన్స్ నిత్యా మీనన్ ,సంయుక్త మీనన్ ,ఇతర నటులు రావు రామేష్ ,మురళి శర్మ,సముద్ర ఖని ప్రధాన పాత్రల్లో నటించగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఈ సినిమాని సితారా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగదేవర సూర్యవంశీ నిర్మాతగా ..ఎస్ఎస్ తమన్ సంగీతం వహించగా ఈ రోజు …

    Read More »
  • 25 February

    ఆడవాళ్లు ఎందుకు ఆనందంగా ఉండకూడదు

    ఆడవాళ్లు ఎందుకు ఆనందంగా ఉండకూడదు అనే కోణంలో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా సాగుతుందని నటి ఖుష్బు తెలిపారు. ఆడవాళ్లకు, మానవ సంబంధాలకు ప్రాధాన్యతనిస్తూ దర్శకుడు కిషోర్ ఈ కథ రాసుకున్నారని చెప్పారు. ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు వినోదం చక్కగా కుదిరిందని, అందుకే కథ వినగానే చేశానని పేర్కొన్నారు. ఈ చిత్రంలో హీరో పాత్రకు ఐదుగురు తల్లులు ఉంటారన్నారు. తన పాత్ర ఎలా ఉంటుంది? అన్నది మూవీలో చూడాలని తెలిపారు.

    Read More »
  • 25 February

    చరిత్ర సృష్టించిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ

    టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు (3,307) చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో 37 పరుగుల వ్యక్తిగత స్కోర్ ఈ ఘనతను అందుకున్న రోహిత్.. న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్(3,299) పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు. ఈ మ్యాచ్లో రోహిత్ 32 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 44 పరుగులు చేశాడు.

    Read More »
  • 25 February

    బీసీ గురుకులాలకు రూ.82.84 కోట్లు విడుదల

    తెలంగాణలో  మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడ్డ తరగతుల గురుకుల విద్యా సంస్థల సొసైటీకి ప్రభుత్వం రూ.82.84 కోట్లు విడుదల చేసింది. 2021-22 రెండవ త్రైమాసికానికి ఈ నిధులు విడుదల చేస్తూ బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సొసైటీ పరిధిలోనీ హైస్కూల్‌, జూనియర్‌ కాలేజీల నిర్వహణకు ఈ నిధులు వినియోగిస్తారు. 2021-22 బడ్జెట్‌లో సొసైటీకి ప్రభుత్వం రూ.165.68 కోట్లు కేటాయించిన విషయం …

    Read More »
  • 25 February

    లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో తెలంగాణ తనదైన ముద్ర

    లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో తెలంగాణ తనదైన ముద్రతో పురోగమిస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. ఈ రంగంలోకి ఇప్పటికి రూ.6,400 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, ప్రస్తుతం పని చేస్తున్న కంపెనీలతో పాటు భవిష్యత్తులో రాబోయే కంపెనీలు కూడా తోడయితే మొత్తం 215 కంపెనీలు అవుతాయని ఆయన తెలిపారు. బయో ఆసియా 2022 సదస్సును ఆయన వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. లైఫ్‌ సైన్స్‌ కంపెనీలు …

    Read More »
  • 25 February

    శ్రీలంకపై టీమిండియా ఘన విజయం

    సఫారీ గడ్డపై నిరాశాజనక ప్రదర్శన అనంతరం స్వదేశంలో వెస్టిండీస్‌ను చిత్తు కింద కొట్టిన టీమ్‌ఇండియా.. శ్రీలంకపై కూడా అదే జోరు కొనసాగించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన తొలి టీ20లో రోహిత్‌ సేన 62 పరుగుల తేడాతో లంకపై విజయం సాధించింది. పొట్టి ఫార్మాట్‌లో భారత జట్టుకు ఇది వరుసగా పదో విజయం కావడం విశేషం. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. టాస్‌ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat