దొండకాయతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో ఇప్పుడు తెలుసుకుందాం.. *రక్తపోటును, డయాబెటిస్ను నియంత్రిస్తుంది. *పీచు, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. *ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు హానికర బ్యాక్టీరియాను అడ్డుకుంటాయి. *మానసిక ఆందోళన, మూర్ఛ వ్యాధితో బాధపడేవారికి ఉపయోగకరం *దీనిలోని కాల్షియం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది. *ఎముకలకు గట్టిదనాన్ని ఇస్తుంది.
Read More »TimeLine Layout
February, 2022
-
24 February
యుక్త వయసులో ఇది చేయాలి..?
యుక్త వయసులో చేసే ఎక్సర్ సైజులు భవిష్యత్లో ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. యుక్త వయస్సు పిల్లలు రోజుకు గంట లేదా అంతకన్నా ఎక్కువసేపు ఎక్సర్సైజులు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. సైకిల్ తొక్కడం, డ్యాన్స్, రన్నింగ్, ఏరోబిక్ ఎక్సర్సైజులు వంటివి ఉండేలా చూసుకోవాలి. తర్వాత కొద్ది నిమిషాలు వెయిట్ లిఫ్టింగ్, పుషప్స్ వంటివి చేస్తే జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు.
Read More » -
24 February
మీరు Break Fast ను తీసుకోవడం లేదా…?
కొంత మంది Break Fast ను తీసుకోవడం తప్పిస్తారు. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ మానేస్తే మహిళల్లో టైప్- 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అల్పాహారం తీసుకోకపోవడం వల్ల క్యాన్సర్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. యువత బ్రేక్ఫాస్ట్ తీసుకోకపోతే ఏకాగ్రత దెబ్బతింటుంది. మైగ్రేన్, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. బ్రేక్ఫాస్ట్ మానేయడం వల్ల బరువు కూడా పెరిగే అవకాశం ఉంది.
Read More » -
23 February
మంత్రి హరీశ్రావు డైనమిక్ లీడర్- సీఎం కేసీఆర్ ప్రశంసలు
తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. హరీశ్రావు డైనమిక్ లీడర్.. చురుకైన మంత్రి అంటూ కేసీఆర్ కొనియాడారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టును జాతికి అంకింత చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను గాలిలో కట్టడం సాధ్యం కాదు. భూమ్మీదనే కట్టాలి. ముంపునకు గురైన గ్రామాలకు న్యాయం చేస్తాం. భూనిర్వాసితులకు న్యాయం చేస్తాం. చరిత్రలో ఇప్పటి …
Read More » -
23 February
టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడుపై కేసు నమోదు
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడుపై పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలోని నల్లజర్లలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ను అసభ్య పదజాలంతో దూషించారని వైసీపీ నాయకుడు రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నల్లజర్ల పోలీసులు ఈ రోజు అయ్యన్నపాత్రుడు ఇంటికి వెళ్లి ఆరా తీశారు. స్వయంగా అయ్యన్నపాత్రుడికి నోటీసులు ఇవ్వాలని పోలీసులు సూచించగా ఇంట్లో లేరని …
Read More » -
23 February
మల్లన్నసాగర్ ను జాతికి అంకితం చేసిన సీఎం కేసీఆర్
తెలంగాణ జలకిరీటం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ జలాశయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మల్లన్నసాగర్ జలాశయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా కొమురవెల్లి మల్లన్నకు కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్విచ్ఛాన్ చేసిన మల్లన్న సాగర్ రిజర్వాయర్లోకి సీఎం కేసీఆర్ నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్రావు, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు …
Read More » -
23 February
విజయ్ దేవరకొండతో కియారా అద్వానీ
బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ మరో టాలీవుడ్ ఆఫర్ కొట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి.రౌడీ ఫెలో యువ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, శివ నిర్వాణ కాంబినేషన్లో రానున్న సినిమాలో కియారాను తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ భామ భరత్ అనే నేను, వినయవిధేయరామ సినిమాల్లో నటించింది. రాంచరణ్-శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలోనూ కూడా అద్వానీ ఛాన్స్ దక్కించుకుంది.
Read More » -
23 February
రాష్ట్రపతి అభ్యర్థిగా బిహార్ సీఎం .. నిజమా..?
బిహార్ సీఎం నితీశ్ కుమార్ రాష్ట్రపతి కాబోతున్నారని ప్రచారం జరుగుతోంది. నితీశ్ బీజేపీతో తెగదెంపులు చేసుకుంటే రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయనను ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టేందుకు అభ్యంతరాలు ఉండవని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ చెప్పారు. అయితే ఈ వార్తలను నితీశ్ ఖండించారు. తనకు అలాంటి ఆలోచనలు లేవని స్పష్టం చేశారు.
Read More » -
23 February
టీమిండియాకు ఎదురుదెబ్బ
శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్ కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల వెస్టిండీస్ జరిగిన క్రికెట్ సిరీస్ లో అదరగొట్టి, మంచి ఫామ్ లో ఉన్న యువ బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్ గాయంతో శ్రీలంకతో జరగనున్న సిరీస్ కు దూరమయ్యాడు. వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో సూర్య చేతికి గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో అతడు నిన్న ప్రాక్టీస్ చేయలేదు. ఇప్పటికే ప్రధాన …
Read More » -
23 February
పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిని ఖరారు చేసిన చంద్రబాబు
ఏపీలో జరగనున్న వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లా పులివెందుల నుంచి పోటీచేయబోయే పార్టీ అభ్యర్థి పేరును టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రవీంద్రనాథ్ రెడ్డి (బీటెక్ రవి) అక్కడ నుంచి పోటీ చేస్తారని తెలిపారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న బీటెక్ రవి.. పులివెందుల టీడీపీ ఇంచార్జ్ గా కొనసాగుతున్నారు. గతంలో జరిగిన 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన …
Read More »