TimeLine Layout

January, 2022

  • 26 January

    తెలంగాణలో డ్రగ్స్ వాడకాన్ని నియంత్రించేందుకు కఠిన చర్యలు

    తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల (డ్రగ్స్ ) వాడకం అనేమాటే వినపడకుండా అత్యంత కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా డ్రగ్స్ వాడకాన్ని నియంత్రించేందుకు కఠిన చర్యలు చేపట్టే దిశగా ఈ నెల 28వ తేదీ శుక్రవారం నాడు ప్రగతి భవన్ లో ‘స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్’ జరుపాలని సీఎం నిర్ణయించారు. సీఎం అధ్యక్షతన జరుగనున్న ఈ సదస్సు లో …

    Read More »
  • 26 January

    శ్రీకాంత్ కు కరోనా పాజిటీవ్

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో  శతాధిక చిత్రాల్లో నటించి మెప్పించిన హీరో శ్రీకాంత్. ప్రస్తుతం కేరక్టర్ ఆర్టిస్ట్‌గానూ, విలన్ గానూ సత్తాచాటుకుంటున్నారు. ఇటీవలే ఓ సీనియర్ హీరో సినిమాలో విలన్‌గా నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఈ క్రమంలో ఆయనకి మరిన్ని అవకాశాలు వస్తున్నాయి.  ఇదిలా ఉంటే.. శ్రీకాంత్ తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఈ రోజు (బుధవారం) సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ‘మిత్రులారా.. అవసరమైన జాగ్రత్తలు …

    Read More »
  • 26 January

    ప్రగతి భవన్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

    తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని సీఎం క్యాంప్ కార్యాలయం ప్రగతి భవన్ లో జరిగిన 73వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి తో పాటు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు పాల్గొన్నారు. సీఎం గారు జాతీయ జెండా ను ఆవిష్కరించగా, మంత్రి ఆ జాతీయ జెండాకు వందనం …

    Read More »
  • 26 January

    సైనిక అమరవీరులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు

    సైనిక అమరవీరులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. 73వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లోని అమరవీరుల స్థూపం వద్దకు వచ్చిన సీఎం కేసీఆర్‌కు త్రివిధ దళాధిపతులు సాదరంగా స్వాగతం పలికారు.అనంతరం సీఎం కేసీఆర్ అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి యుద్ధవీరులకు వందనం చేశారు. త్రివిధ దళాధిపతులు సైతం అమరవీరులకు నివాళులర్పించారు.తెలంగాణ వ్యాప్తంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై, తాత్కాలిక …

    Read More »
  • 26 January

    తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంత్రి సత్యవతి రాథోడ్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు

    ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, అత్యంత గొప్ప లిఖిత రాజ్యాంగం ఉన్న భారతదేశం సగర్వంగా జరుపుకుంటున్న 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు.ప్రజలే ప్రభువులుగా పాలించుకునే గొప్ప లక్షణం ఈ గణతంత్రమని…అందుకే ఈ రోజును మనమంతా జాతీయ పండుగగా ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు. కొవిడ్ నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం …

    Read More »
  • 26 January

     సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం

     సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం మూడోసారి ఎన్నికయ్యారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌లో జరిగిన పార్టీ రాష్ట్ర మహాసభలో ఆయనను మరోసారి ఎన్నుకుంటూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. 2014లో రాష్ట్రం విడిపోయిన అనంతరం సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా తొలిసారి ఎన్నికైన వీరభద్రం.. 2018లో రెండో సారి ఆ బాధ్యతలు చేపట్టారు. మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో పార్టీ కేడర్‌ వీరభద్రంపైనే నమ్మకం ఉంచింది. కాగా, మంగళవారం జరిగిన సభలో …

    Read More »
  • 26 January

    కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వం లేఖాస్త్రాలు

    కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాల్లో నిలదీసేం దుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖాస్త్రాలు సంధిస్తోంది. ఇప్పటికే పలు అంశాలపై వరుసగా లేఖలు రాయగా.. నెలాఖరు నుంచి కేంద్ర బడ్జెట్‌ సమా వేశాలు మొదలవుతుండటంతో మరిన్ని లెటర్లు రాసేందుకు సిద్ధమైంది. తద్వారా రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలు, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పనకు నిధు లివ్వడంలో వివక్ష వంటి అంశాలపై కేంద్రం వైఖరిని ఎత్తిచూపాలని …

    Read More »
  • 26 January

    తెగ సంబురపడుతున్న సాయిపల్లవి

    బక్కపలచు భామ సాయి పల్లవి ‘శ్యామ్ సింగ రాయ్’ మూవీలోని ‘ప్రణవాలయ’ పాటకు డాన్స్ రిహార్సల్స్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. ‘ఫిదా’ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి మొదటి సినిమాతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. వరుసగా సినిమాలు చేస్తూ క్రేజీ హీరోయిన్‌గా మారిన ఆమె నానితో రెండవసారి నటించిన ‘శ్యామ్ …

    Read More »
  • 26 January

    మెగాస్టార్ చిరంజీవికి కొవిడ్

    తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి కొవిడ్ బారిన పడ్డారు. తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. థర్డ్ వేవ్ మొదలైనప్పటికి పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసందే. ఈ క్రమంలోనే తాజాగా చిరంజీవికి కరోనా వైరస్ సోకింది. ప్రస్తుతం ఆయన హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. ఇక ఇటీవల ఆయనను కలిసిన వారందరూ టెస్ట్ చేయించుకోవలసిందిగా …

    Read More »
  • 26 January

    బీజేపీ ప్రభుత్వానిది మాటలెక్కువ.. పనితక్కువ

     కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానిది మాటలెక్కువ.. పనితక్కువ సిద్ధాంతమని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఏడేళ్లలో దేశంలో 153 మెడికల్‌ కాలేజీలు మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలో మాతా శిశు ఆరోగ్య కేంద్రం, (ఎంసీహెచ్‌), నవజాత శిశు సంరక్షణ కేంద్రాలను ఆయన ప్రారంభించారు.  గతంలో ప్రభుత్వాస్పత్రుల్లో 30ు లోపు ఉన్న ప్రసవాల సంఖ్య ఇప్పుడు 52 …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat