ఇంగ్లాండ్ బ్యాటర్ జేసన్ రాయ్ 36 బంతుల్లో 10 సిక్సర్లు, 9 ఫోర్లతో విధ్వంసం సృష్టించాడు. మొత్తం 47 బంతులను ఎదుర్కొని 115 పరుగులు చేశాడు. వెస్టిండీస్తో 5 మ్యాచ్ల టీ20 సిరీస్క ముందు జరిగిన వార్మప్ మ్యాచ్ లో ఈ ఘనత సాధించాడు. ఇంగ్లాండ్ 4 వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది. ప్రత్యర్థి జట్టు 137 రన్స్క చేతులెత్తేసింది.
Read More »TimeLine Layout
January, 2022
-
21 January
విరాట్ కోహ్లి కెప్టెన్సీ వదులుకోవడానికి గల కారణాలు ఇవే..?
టీమిండియా పరుగుల మిషన్ విరాట్ కోహ్లి కెప్టెన్సీ వదులుకోవడానికి గల కారణాలను అనేక మంది పలు రకాలుగా చెబుతున్నారు. తాజాగా దక్షిణాఫ్రికా మాజీ పేసర్ స్టెయిన్ తన అభిప్రాయాన్ని చెప్పాడు. తన కుటుంబానికి అండగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని తెలిపాడు. ప్రస్తుత బయోబబుల్స్ కారణంగా కుటుంబానికి దూరం కావడం ఇబ్బందికరంగా ఉంటుందన్నాడు. కెప్టెన్సీ నుంచి వైదొలిగాక విరాట్ తన కుటుంబం, బ్యాటింగ్పై దృష్టి సారిస్తాడని వివరించాడు
Read More » -
21 January
డిసెంబర్ నాటికి దేశంలో 5.3కోట్ల మంది నిరుద్యోగులు
కరోనా కారణంగా 2021 డిసెంబర్ నాటికి దేశంలో 5.3కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ తెలిపింది. ఇందులో 3.5 కోట్ల మంది ఉద్యోగం కోసం నిరంతరం ప్రయత్నిస్తున్నారు.. 1.7కోట్లమంది జాబ్ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదంది. కాగా ఉద్యోగ వేటలో అంత యాక్టివ్గా లేనివారిలో సగానికి పైగా మహిళలే ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
Read More » -
21 January
కర్హాల్ నియోజకవర్గం నుంచి అఖిలేశ్ యాదవ్ పోటీ
నిన్న మొన్నటివరకు అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని చెబుతూ వచ్చిన సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. ఆయన కర్హాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ వెల్లడించింది. ఆయన ప్రస్తుతం అజంగఢ్ ఎంపీగా ఉన్నారు. గతంలో యూపీ సీఎంగా చేసినప్పటికీ.. మండలి నుంచి ప్రాతినిథ్యం వహించారు.
Read More » -
21 January
మరోకసారి సంచలనం సృష్టించిన ఎంపీ సుబ్రమణియన్ స్వామి
ప్రస్తుత కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకు ప్రజలకు ఇన్కమ్ ట్యాక్స్ ను రద్దు చేయడం మంచిదని రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్ స్వామి అభిప్రాయపడ్డారు. రానున్న ఆర్థిక సంవత్సరం మొదటి రోజే ఈ నిర్ణయం ప్రకటిస్తే ఆర్థిక ప్రగతికి బలం ఇచ్చినట్లు అవుతుందన్నారు. ట్యాక్సేషన్ బదులుగా ప్రత్యామ్నాయ మార్గాల్లో వనరుల్ని పెంచుకోవచ్చని గతంలోనూ ప్రభుత్వానికి సూచించానని తెలిపారు.
Read More » -
21 January
ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలోస్తే గెలుపు ఎవరిది..?
ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగితే ఎన్డీయే తిరిగి అధికారంలోకి వస్తుందని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో వెల్లడైంది. 543 స్థానాలున్న లోక్సభలో ఎన్డీయేకు 296, యూపీఏకు 127, ఇతరులు 120 స్థానాలు దక్కుతాయని జోస్యం చెప్పింది. ఇందులో ఒక్క బీజేపీకే 271 స్థానాలు, కాంగ్రెస్కు 62, మిగతా పార్టీలకు 210 స్థానాలు దక్కుతాయని వెల్లడించింది.
Read More » -
21 January
నేడే సౌతాఫ్రికా-టీమిండియా మధ్య రెండో వన్డే
దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ ఇప్పటికే కోల్పోయి, తొలి వన్డేలోనూ ఓటమి పాలైన టీమిండియాకు నేడు చావోరేవో మ్యాచ్ జరగనుంది. స్టార్ స్పోర్ట్స్ 1లో మధ్యాహ్నం 2 గంటల నుంచి రెండో వన్డే ప్రత్యక్ష ప్రసారం కానుంది. వరుస విజయాలతో దక్షిణాఫ్రికా ఉత్సాహంతో ఉండగా, ఎలాగైనా రెండో వన్డేలో గెలవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్లో ఇరు మార్పుల్లేకుండానే బరిలో దిగే అవకాశం ఉంది.
Read More » -
21 January
పుష్ప సినిమా తర్వాత తగ్గేదేలే అంటున్న అల్లు అర్జున్
సుకుమార్ దర్శకత్వంలో ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన పుష్ప సినిమా తర్వాత మరో పాన్ ఇండియా మూవీకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్ నిర్మించే ఈ సినిమా కోసం బన్నీ ఏకంగా రూ.75 కోట్ల రెమ్యునరేషన్ అడిగినట్లు వార్తలొస్తున్నాయి. అందుకు ఆ సంస్థ కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ డైరెక్టర్లు అట్లీ, మురుగదాస్లలో ఒకరు ఈ సినిమాకు దర్శకత్వం …
Read More » -
21 January
హైదరాబాద్ లో భారీగా కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో కరోనా కేసులు భారీగానే నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,645 కరోనా కేసులు నమోదైనట్లు హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 1,670,866 కరోనా కేసులు నమోదయ్యాయి. ఓవైపు కరోనా కేసులు, మరోవైపు ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు
Read More » -
21 January
కరోనా ఫస్ట్ వేవ్ థర్డ్ వేవ్ ల మధ్య తేడా ఇదే..?
ప్రస్తుత కరోనా థర్డ్ వేవ్ వ్యాక్సినేషన్ తో మరణాలు గణనీయంగా తగ్గాయని కేంద్రం వెల్లడించింది. సెకండ్ వేవ్ ఏప్రిల్ 30న 3,86,452 కొత్త కేసులు, 3,059 మరణాలు నమోదయ్యాయని తెలిపింది. అప్పటికి 2% మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తయిందని పేర్కొంది. తాజాగా జనవరి 20న 3,17,532 కేసులు, 380 మరణాలు నమోదయ్యాయని తెలిపింది. 72 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి కావడంతో మరణాల సంఖ్య భారీగా తగ్గిందని పేర్కొంది.
Read More »