తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ త్వరలో సొంతగూటికి వెళ్లనున్నారు. ఈనెల 24న సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరే అవకాశం కనిపిస్తోంది. గతంలో P.C.C అధ్యక్షుడిగా, మంత్రిగా కాంగ్రెస్లో కీలక పాత్ర పోషించిన ఆయన 2015లో తెరాసలో చేరారు. తెరాస నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన డీఎస్.. కొంత కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకున్నారు.
Read More »TimeLine Layout
January, 2022
-
17 January
ఏపీలో విద్యాసంస్థలు యథావిథిగా ప్రారంభం
ఏపీలో విద్యాసంస్థలు యథావిథిగా ప్రారంభం అవుతాయని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ‘టీచర్లకు 100% వ్యాక్సినేషన్ పూర్తైంది. 15-18 ఏళ్ల మధ్య వయసు ఉన్న విద్యార్థులకు 90శాతానికి పైగా వ్యాక్సిన్ ఇచ్చాం. కరోనా పట్ల అప్రమత్తంగా ఉన్నాం. విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందవద్దు. అమెరికాలో లక్షల కేసులు వస్తున్నా విద్యాసంస్థలు మూసివేయలేదు. అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం’ అని ఆయన అన్నారు.
Read More » -
17 January
వ్యాక్సిన్ తీస్కున్న అజాగ్రత్త వద్దు
దేశంలో, రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా వైరస్ సోకుతుంది. కొందరు తాము వ్యాక్సిన్ తీసుకున్నాములే అని అజాగ్రత్తగా ఉంటున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నా.. భౌతికదూరం పాటించడం, మాస్క్ ధరించడం, చేతులను శానిటైజ్ చేసుకోవడం వంటి నిబంధనలను తప్పక పాటించండి. తుమ్మినా, దగ్గినా చేతిని కాకుండా మోచేతిని అడ్డుపెట్టుకోండి.
Read More » -
17 January
దేశంలో కరోనా విలయతాండవం
దేశ వ్యాప్తంగా రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నాయి.. ఈ క్రమంలో దేశంలో రాష్ట్రాల వారీగా కరోనా కేసులు నమోదు ఇలా ఉంది.. మహారాష్ట్ర – 41,327 కేసులు కర్ణాటక – 34,047 కేసులు తమిళనాడు – 23,975 కేసులు కేరళ – 18,123 కేసులు గుజరాత్ – 10,150 కేసులు హర్యాణా 9,000 కేసులు ఆంధ్రప్రదేశ్ – 4,570 కేసులు గోవా – 3,232 కేసులు …
Read More » -
17 January
ఏపీలో ప్రముఖులకు కరోనా
ఏపీలో ప్రకాశం జిల్లాలో పలువురు రాజకీయ నేతలు కరోనా బారిన పడ్డారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు కరోనా రావడంతో హోం ఐసోలేషన్లోకి వెళ్లారు. కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డికి కూడా పాజిటివ్ రాగా.. మంత్రి బాలినేని భార్యకు కరోనా సోకడంతో ఆమెతో పాటు మంత్రి కూడా హోం ఐసోలేషన్లో ఉన్నారు. అటు మంత్రి అవంతి, ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాద్, అంబటి రాంబాబు ఇటీవలే కరోనా బారిన పడ్డారు.
Read More » -
17 January
తెలంగాణలో 5 కోట్ల కరోనా డోసుల పంపిణీ
తెలంగాణ రాష్ట్రంలో 5 కోట్ల కరోనా డోసుల పంపిణీ పూర్తైనట్లు వైద్యారోగ్య,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలిపారు. ప్రజల స్ఫూర్తి, వైద్య సిబ్బంది అంకితభావం వల్లే ఈ ఘనత సాధించామన్న ఆయన.. అనేక ఆటంకాలు దాటి ఈ స్థాయికి చేరుకున్నట్లు చెప్పారు. వ్యాక్సినేషన్ ప్రయాణాన్ని ఇలానే కొనసాగిద్దామన్న హరీశ్.. 15-18 ఏళ్ల మధ్య వయసు వారు వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రావాలని మంత్రి తన్నీరు హారీష్ రావు …
Read More » -
16 January
కరోనా నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 15-18 ఏళ్లలోపు విద్యార్థులు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని.. అలా వ్యాక్సిన్ తీసుకున్న వారు మాత్రమే స్కూళ్లకు హాజరుకావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం స్కూళ్లను మూసివేసినా.. ఓపెన్ చేసిన తర్వాత వ్యాక్సిన్ తీసుకున్న వారినే అనుమతించాలంది. కాగా హర్యానాలో ఇప్పటివరకు 15 లక్షల మంది విద్యార్థులు టీకా తీసుకున్నారు.
Read More » -
16 January
తెలంగాణలో కొత్తగా 1,963 మందికి కరోనా వైరస్
తెలంగాణలో నిన్నటితో పోల్చితే రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 53,073పరీక్షలు చేయగా 1,963 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం రాష్ట్రంలో 22,017 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న రాష్ట్రంలో 2,398 కరోనా కేసులు వచ్చాయి.
Read More » -
16 January
నిలకడగానే లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ఐసీయూలో తమ పర్యవేక్షణలోనే ఆమెకు చికిత్సను కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొందని వైద్యులు తెలిపారు. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులంతా ప్రార్థించాలని వైద్యులు కోరారు. కాగా కరోనాతో పాటు న్యుమోనియాతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో లతా మంగేష్కర్ చేరారు.
Read More » -
16 January
విరాట్ కోహ్లి ప్రకటనపై బీసీసీఐ స్పందన
భారత టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లి చేసిన ప్రకటనపై బీసీసీఐ స్పందించింది. ‘కోహ్లికి ధన్యవాదాలు. అద్భుతమైన నాయకత్వ లక్షణాలతో భారత జట్టును ఎన్నో శిఖరాలకు తీసుకెళ్లావు. 68 టెస్టుల్లో 40 విజయాలతో అత్యంత విజయవంతమైన కెప్టెన్గా నిలిచావు కోహ్లి’ అని బీసీసీఐ తెలిపింది.
Read More »