ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించిన సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప పార్ట్-1తో సక్సెస్ అందుకున్న నేషనల్ క్రష్ రష్మిక.. రెండో పార్ట్ కోసం భారీగా రెమ్యునరేషన్ పెంచేసిందని టాలీవుడ్ టాక్. పార్ట్-1 కోసం రూ.2 కోట్లు తీసుకున్న ఈ అమ్మడు.. రెండో భాగం కోసం రూ.3 కోట్లు డిమాండ్ చేస్తోందట. అందుకు ప్రొడ్యూసర్లు సైతం ఓకే చెప్పారని సమాచారం. కాగా పుష్ప పార్ట్-2 షూటింగ్ ఈ …
Read More »TimeLine Layout
January, 2022
-
10 January
టామ్ లాథమ్ డబుల్ సెంచరీ(252)
బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్ట్ కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ డబుల్ సెంచరీ(252)తో చెలరేగాడు. లాథమ్తో పాటు కాన్వే సెంచరీ(109)తో రాణించడంతో తొలి ఇన్నింగ్స్లో 521/6 వద్ద డిక్లేర్ చేసింది. బంగ్లా బౌలర్లలో షరిఫుల్ ఇస్లాం 2, ఇబాదత్ హొస్సేన్ 2, మొమినుల్ ఒక వికెట్ తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 11 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
Read More » -
10 January
మామిడి పండ్లతో వైన్
సాధారణంగా ద్రాక్షతో వైన్ తయారుచేస్తారు. మరి ద్రాక్ష ఉత్పత్తి సరిగా లేకపోతే వేరే పండ్లతో వైన్ తయారుచేయలేమా? అనే ఆలోచన యూపీ ఎక్సైజ్ శాఖకు వచ్చింది. వినూత్నంగా ఆలోచించి.. తమకు అందుబాటులో ఉన్న మామిడి పండ్లతో వైన్ తయారుచేయాలని నిర్ణయించింది. ఇందుకోసం మద్యం విధానాన్ని సవరించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఆమోదం పొందగానే మ్యాంగో వైన్ తయారీ ప్రారంభం కానుంది.
Read More » -
10 January
మెంతులతో ఎంతో మేలు..?
మెంతులతో ఎంతో మేలు ఉందంటున్నరు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం రక్తంలో చక్కెర స్థాయిని క్రమబద్దీకరిస్తాయి అజీర్తి, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి రాత్రి మెంతులు నానబెట్టిన నీటిని పరగడుపున తాగితే అజీర్తి సమస్య తగ్గుతుంది చెంచా మెంతులను రోజూ ఉదయం, రాత్రి తింటే జీర్ణశక్తి పెరుగుతుంది, విరోచనాలు తగ్గుతాయి వీటిలోని ఫైబర్ కడుపు నిండిన భావన కల్గిస్తుంది. దీంతో తక్కువ ఆహారం తీసుకోవడంతో ఊబకాయ సమస్య తగ్గుతుంది
Read More » -
9 January
టెస్టు క్రికెట్ కి ధనుష్క గుణతిలక వీడ్కోలు
శ్రీలంక కు చెందిన క్రికెటర్ ధనుష్క గుణతిలక టెస్టు క్రికెట్ కి వీడ్కోలు పలికాడు. ఇప్పటివరకు మొత్తం 8 టెస్టులు 8 ఆడిన అతడు.. 299 రన్స్ చేశాడు. వన్డేలపై దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు 30 ఏళ్ల గుణతిలక వెల్లడించాడు. అయితే గుణతిలకతోపాటు మరో ఇద్దరిపై శ్రీలంక బోర్డు విధించిన ఏడాది నిషేధం ఎత్తివేసిన రోజే అతడు రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం. కాగా, ఇటీవలే భానుక రాజపక్సె …
Read More » -
9 January
క్యాలీఫ్లవర్ తో లాభాలు ఎన్నో..?
క్యాలీఫ్లవర్ తో లాభాలు చాలా ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుస్కుందాం * దంత సమస్యలతో బాధపడేవారు క్యాలీఫ్లవర్ తింటే ఉపశమనం పొందొచ్చు. * ఇందులో ఉండే యాంటీ యాక్సిడెంట్లు కడుపులో ఎసిడిటీని కలిగించే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. * క్యాలీఫ్లవర్లో క్యాలరీలు తక్కువ కాబట్టి.. బరువు తగ్గాలనుకునే వారికి చాలా ఉపయోగం. * గుండె సంబంధిత సమస్యలకు కూడా చక్కగా పనిచేస్తుంది. * క్యాలీఫ్లవర్ రసం పరగడుపున తాగడం …
Read More » -
9 January
బూస్టర్ డోసు తీసుకుంటే లాభమా..? నష్టామా..?
రెండు డోసుల టీకా తీసుకున్నవారు 6 నెలల తరువాత కొవాగ్జిన్ బూస్టర్ డోసు వేయించుకుంటే కొవిడ్ నుంచి మెరుగైన రక్షణ పొందవచ్చని భారత్ బయోటెక్ తెలిపింది. క్లినికల్ ట్రయల్స్లో ఈ ఫలితం వెల్లడైందని, సైడ్ ఎఫెక్ట్స్ కూడా కనిపించలేదని స్పష్టం చేసింది. బూస్టర్ డోసు తీసుకున్న 90శాతం మందిలో కరోనా వైరస్ ఆల్ఫా, బీటీ, డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్లను నివారించే యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు భారత్ బయోటెక్ పేర్కొంది.
Read More » -
9 January
దేశంలో కొత్తగా 1,59,632 కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 1,59,632 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 18వేల కేసులు ఎక్కువగా వచ్చాయి. పాజిటివిటీ రేటు రికార్డు స్థాయిలో 10.21%గా నమోదైంది. దేశంలోని యాక్టివ్ కేసుల సంఖ్య 5లక్షల 90వేలు దాటింది. ఇక 24గంటల్లో కరోనా మహమ్మారితో మరో 327 మంది మరణించారు. 40,863 మంది కోలుకున్నారు.
Read More » -
9 January
దేశంలో భారీగా కరోనా కొత్త వేరియంట్ కేసులు
దేశంలో కరోనా కొత్త వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకూ మొత్తం 3,623 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. 27 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో వీటిని గుర్తించారు. మహరాష్ట్ర-1,009, ఢిల్లీ-513, కర్ణాటక-441, రాజస్థాన్-373 కేసులు రాగా.. TS-123, AP-28 కేసులు నమోదయ్యాయి. ఇక, మొత్తం బాధితుల్లో 1,409 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
Read More » -
9 January
సూపర్ స్టార్ కృష్ణ ఇంట్లో విషాదం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు ,సూపర్స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు సోదరుడైన రమేష్ బాబు (56) అనారోగ్యంతో మృతి చెందారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనని హైదరాబాద్, గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రమేశ్బాబు మృతి చెందినట్టుగా వైద్యులు ధ్రువీకరించారు. రమేష్ బాబు మృతితో టాలీవుడ్ …
Read More »