TimeLine Layout

December, 2021

  • 16 December

    దేశంలో కొత్తగా 7,974 కరోనా కేసులు

    దేశంలో గడిచిన 24 గంటల్లో 7,974 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. 343 మంది వైరస్లో మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,76,478కి చేరింది. మరోవైపు తాజాగా 7,948 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,41,54,879గా ఉంది. ప్రస్తుతం దేశంలో 87,245 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 135.25 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు.

    Read More »
  • 16 December

    వెస్టిండీస్ జట్టులో కరోనా కలకలం

    పాకిస్తాన్ పర్యటనలో ఉన్న వెస్టిండీస్ జట్టులో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే ముగ్గురు ప్లేయర్లకు కరోనా సోకగా తాజాగా మరో ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. ప్లేయర్లు హోప్, హుసేన్, గ్రీప్తో పాటు అసిస్టెంట్ కోచ్, టీమ్ ఫిజీషియన్కు వైరస్ సోకిందని ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అంతకుముందు కాట్రెల్, మేయర్స్, ఛేజ్కు పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ టీంలో కరోనా సోకిన వారి సంఖ్య 8కి చేరింది.

    Read More »
  • 16 December

    దేశంలో ఒమిక్రాన్ కలవరం

    దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో 4 ఒమిక్రాన్ కేసులు వచ్చినట్లు ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. దీంతో ఢిల్లీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 10కి చేరింది. కాగా ఒమిక్రాన్ వేరియంట్ సాధారణ కరోనా వైరస్ కంటే 70% వేగంగా వ్యాప్తి చెందుతుందని హాంగ్కాంగ్ చేసిన ఓ అధ్యయనం తెలిపింది.

    Read More »
  • 15 December

    విదేశాల నుండి తెలంగాణకు వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్

    తెలంగాణ‌లోకి ఒమిక్రాన్ వేరియంట్ ప్ర‌వేశించింది. ఇద్ద‌రు విదేశీయులు ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారించ‌బ‌డిన‌ట్లు తెలంగాణ వైద్యారోగ్య సంచాల‌కులు శ్రీనివాస్ రావు మీడియాకు వెల్ల‌డించారు. ఈ నెల 12న కెన్యా, సోమాలియా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వ‌చ్చిన ఇద్ద‌రు వ్య‌క్తుల‌కు ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారించ‌బ‌డ్డారు అని తెలిపారు. కెన్యా జాతీయురాలి వ‌య‌సు 24 ఏండ్లు కాగా, సోమాలియా దేశ‌స్థుడి వ‌య‌సు 23 ఏండ్లు అని పేర్కొన్నారు. 12వ తేదీనే వీరిద్ద‌రి శాంపిల్స్ సేక‌రించి …

    Read More »
  • 15 December

    TEST క్రికెట్ కు టీమిండియా స్టార్ ఆటగాడు గుడ్ బై

    టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వన్డేలు, T20ల్లో ఎక్కువ కాలం కొనసాగేందుకు జడ్డూ ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. కాగా న్యూజిలాండ్ తో  సిరీస్ సందర్భంగా గాయపడ్డ ఈ 33 ఏళ్ల స్టార్ ఆల్ రౌండర్ సౌతాఫ్రికా పర్యటనకు దూరమయ్యాడు. అతడు కోలుకునేందుకు మరో 6 నెలలు పట్టవచ్చని సమాచారం. గాయంతో కోలుకున్నాక కూడా టెస్టులు ఆడేది …

    Read More »
  • 15 December

    ఏపీలో కొత్తగా 132 కరోనా కేసులు

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 29,228 కరోనా టెస్టులు చేయగా 132 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. నిన్న కరోనాతో ఒకరు మరణించారు. మొత్తం కేసులు సంఖ్య 20,75,108కు చేరగా ఇప్పటివరకు 14,468 మంది చనిపోయారు. గత 24 గంటల్లో 186 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,823 యాక్టివ్ కేసులున్నాయి.

    Read More »
  • 15 December

    దేశంలో ఒమిక్రాన్ కలవరం

    దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఒక్క మహారాష్ట్రలోనే 8 కేసులు వచ్చాయి. ఈ ఉదయం ఢిల్లీలో 4, రాజస్థాన్లో 4 కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ ఒక్కరోజే దేశంలో 16 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 57కు పెరిగింది. ఇప్పటివరకు 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు వచ్చాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది.

    Read More »
  • 15 December

    తెలంగాణలో థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు సిద్ధం

    తెలంగాణలో థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని.. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన ఆయన.. 21 లక్షల హోమ్ ఐసోలేషన్ కిట్లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పరిస్థితుల పరిశీలనకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని, 545 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రజలు మాస్కులు ధరించాలని, రెండు డోసుల వాక్సిన్ తీసుకోవాలని మంత్రి హరీష్ సూచించారు.

    Read More »
  • 15 December

    ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ వరాల జల్లు

    ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ ఉత్తరాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. 18 ఏళ్లు దాటిన మహిళలందరికీ ప్రతి నెలా రూ.1,000 ఇస్తామని హామీ ఇచ్చారు. ‘నేను నాయకుడిని కాదు. రాజకీయాలు ఎలా చేయాలో నాకు తెలీదు. పని ఎలా చేయాలో మాత్రమే తెలుసు. ఢిల్లీలో 10 లక్షల మందికి ఉద్యోగాలిచ్చాం. ఇక్కడ కూడా అదే విధంగా చేస్తాం’ అని తెలిపారు.

    Read More »
  • 15 December

    పాకిస్తాన్ ఘనవిజయం

    వెస్టిండీస్ తో  జరిగిన ఉత్కంఠభరిత రెండో టీ20లో పాకిస్తాన్ విజయం సాధించింది. చివరి ఓవర్లో 23 రన్స్ అవసరం కాగా విండీస్ 13 రన్స్ మాత్రమే చేయగల్గింది. దీంతో పాక్ 9 రన్స్ తేడాతో గెలిచింది. 3 టీ20ల సిరీసు మరో మ్యాచ్ ఉండగానే కైవసం చేసుకుంది. అంతకుముందు పాక్ 20 ఓవర్లలో 172/8 రన్స్ చేసింది. కాగా, ఈ క్యాలెండర్ ఇయర్లో పాకిస్తాన్కు ఇది 19వ విజయం. చివరి …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat