TimeLine Layout

August, 2021

  • 24 August

    దళితబంధు పైలట్‌ ప్రాజెక్టుకు మరో 500 కోట్లు

    హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పైలట్‌ ప్రాజెక్టుగా అమలవుతున్న దళితబంధు పథకానికి ప్రభుత్వం సోమవారం మరో రూ.500 కోట్లను విడుదలచేసింది. ఈ పథకం అమలుకు ఇప్పటికే రూ.500 కోట్లు విడుదలచేసిన సంగతి తెలిసిందే. తాజా నిధుల విడుదలతో కరీంనగర్‌లో దళితబంధు ప్రత్యేక ఖాతాకు మొత్తం రూ.వెయ్యి కోట్లు జమయ్యాయి. ఈనెల 16న హుజూరాబాద్‌ నియోజకవర్గ కేంద్రంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. 15 మంది లబ్ధిదారులకు రూ.10 లక్షల మంజూరు పత్రాలను అందజేసి పథకానికి …

    Read More »
  • 24 August

    తెలంగాణ రాష్ట్రంలో కరోనా థర్డ్‌ వేవ్‌కు అవకాశం లేదా..?

    తెలంగాణ రాష్ట్రంలో కరోనా థర్డ్‌ వేవ్‌కు అవకాశం లేదని.. అయినప్పటికీ ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ తెలిపారు. ప్రస్తుతం 27 వేల పడకలు ఉన్నాయని, మరో ఏడు వేల పడకలు నెలాఖరుకు సిద్ధం చేయనున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌ నగరంలో చేపట్టిన 100 శాతం వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఇందులో భాగమేనని పేర్కొన్నారు. ఖైరతాబాద్‌ సర్కిల్‌లోని ఓల్డ్‌ సీబీఐ క్వార్టర్స్‌లో సోమవారం టీకా పంపిణీ …

    Read More »
  • 24 August

    దేశంలో కొత్త‌గా 25,467 క‌రోనా కేసులు

    భార‌త్‌లో కొత్త‌గా 25,467 క‌రోనా పాజిటివ్ ( Corona Positive )కేసులు న‌మోదు అయ్యాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో వైర‌స్ వ‌ల్ల 354 మంది ప్రాణాలు కోల్పోయిన‌ట్లు ఇవాళ కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. సుమారు 39,486 మంది వైర‌స్ నుంచి కోలుకున్నారు. దేశ‌వ్యాప్తంగా యాక్టివ్ క‌రోనా కేసుల సంఖ్య 3,19,551గా ఉంది. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా వైర‌స్ వ‌ల్ల మ‌ర‌ణించిన వారి సంఖ్య 4,35,110గా ఉంది. వ్యాక్సినేష‌న్ రిపోర్ట్‌ను …

    Read More »
  • 24 August

    వాట్సాప్ లో ఇక నుండి వ్యాక్సినేష‌న్ బుకింగ్‌

    వ్యాక్సినేష‌న్ బుకింగ్‌ ( Vaccine Booking )పై కేంద్ర ప్ర‌భుత్వం కొత్త విధానాన్ని తీసుకువ‌చ్చింది. పౌరుల సౌల‌భ్యం కోసం మొబైల్ ఫోన్ల‌లో ఉండే వాట్సాప్ ద్వారానే టీకా స్టాట్‌లు బుక్ చేసుకునే వీలు క‌ల్పించింది. దీనికి సంబంధించి ఇవాళ కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి మ‌న్సూక్ మాండ‌వీయ ఓ ట్వీట్ చేశారు. ఈ విధానం వ‌ల్ల టీకా రిజిస్ట్రేష‌న్ మ‌రింత సులువుగా మార‌నున్న‌ది. వాట్సాప్ ద్వారా టీకా బుక్ చేసుకునే ప‌ద్ధ‌తి …

    Read More »
  • 21 August

    కేంద్ర ప్రభుత్వంపై మంత్రి పువ్వాడ అజయ్ ఫైర్

    తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదని మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ పేర్కొన్నారు. కేంద్రం మొండి చేయి చూపించినా.. కేసీఆర్​ నాయకత్వంలో అభివృద్ధి ఆగదని స్పష్టం చేశారు. ఖమ్మంలో నిర్వహించిన గ్రామీణ రహదారుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. కేంద్రం నుంచి ఏం నిధులు తీసుకువచ్చారని.. రాష్ట్రానికి ఏం మేలు చేశారని రాష్ట్రంలో కేంద్ర మంత్రులు యాత్రలు చేస్తున్నారో చెప్పాలని రాష్ట్ర మంత్రి పువ్వాడ …

    Read More »
  • 21 August

    బుల్లెట్ క‌ల‌క‌లం కేసు- విచారణకు హాజరైన పరిటాల సిద్ధార్థ్

    మూడు రోజుల క్రితం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో శ్రీనగర్ వెళుతున్న ప్ర‌యాణికుడి బ్యాగులో సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ఓ బుల్లెట్‌ను గుర్తించారు. దీంతో విచార‌ణ నిమిత్తం బుల్లెట్‌ను, స‌ద‌రు ప్ర‌యాణికుడిని శంషాబాద్ పోలీసుల‌కు అప్ప‌గించారు. ప్ర‌యాణికుడు ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత తనయుడు పరిటాల సిద్ధార్థ్. ఇత‌డి బ్యాగులోనే బుల్లెట్ లభించింది. దీంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసులు 41 సీఆర్‌పీసీ కింద సిద్ధార్థ్ కు నోటీసులు అందజేశారు. లైసెన్స్ …

    Read More »
  • 21 August

    తెలంగాణలో స్థానిక సంస్థలకు రూ.432కోట్లు విడుదల

    తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ సంస్థలకు రూ.432కోట్ల నిధులను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్‌ గ్రాంట్‌ నిధులు కేటాయించింది. గ్రామ పంచాయతీలకు రూ.182.49 కోట్లు, మండల పరిషత్‌లకు రూ.124.11 కోట్లు, జిల్లా పరిషత్‌లకు రూ.125.95కోట్లు విడుదల చేస్తూ పంచాయతీరాజ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా సమయంలోనూ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా స్థానిక సంస్థలకు నిధులు విడుదల …

    Read More »
  • 21 August

    బాధితుడి భార్య‌కు ఎల్‌వోసీ అంద‌జేసిన మంత్రి ఎర్ర‌బెల్లి

    జ‌న‌గామ జిల్లా పాల‌కుర్తి మండ‌లం బ‌మ్మెర గ్రామానికి చెందిన ఓర్సు తిరుప‌తి అనే వ్య‌క్తి అనారోగ్యం పాల‌య్యాడు. హైద‌రాబాద్ నిమ్స్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. తిరుపతికి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి నుండి మంజూరైన రూ. 1,50,000 ఎల్‌వోసీ ని ఆయ‌న‌ భార్య ఉపేంద్రకు మంత్రి అంద‌జేశారు. హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం మంత్రి ఈ ఎల్‌వోసీని అందజేశారు.

    Read More »
  • 21 August

    ఉత్త‌రాఖండ్‌ అసెంబ్లీ ఎన్నిక‌లే ల‌క్ష్యంగా బీజేపీ చీఫ్ జేపీ న‌డ్డా పర్యటన

    ఉత్త‌రాఖండ్‌లో వ‌చ్చే ఏడాది ఆరంభంలో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌లే ల‌క్ష్యంగా బీజేపీ చీఫ్ జేపీ న‌డ్డా ఆ రాష్ట్రంలో రెండు రోజుల ప‌ర్య‌ట‌న చేప‌ట్టారు. ఆప్ఘ‌నిస్తాన్ సంక్షోభం నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చేతుల్లో దేశం భ‌ద్రంగా ఉంద‌ని న‌డ్డా పేర్కొన్నారు. అత్యాధునిక ఆయుధాల కొనుగోలుకు మోదీ హ‌యాంలో ఇప్ప‌టివ‌ర‌కూ రూ 1.35 ల‌క్ష‌ల కోట్ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం వెచ్చించింద‌ని చెప్పారు.డెహ్రాడూన్‌, రైవాల‌లో మాజీ సైనికుల‌తో న‌డ్డా ముచ్చ‌టించారు. వాజ్‌పేయి …

    Read More »
  • 21 August

    పూజా హెగ్డేపై దర్శకుడు ఆర్‌కే సెల్వమణి సంచలన వ్యాఖ్యలు

    స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేపై రోజా భర్త, దర్శకుడు ఆర్‌కే సెల్వమణి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకే సంవత్సరం ‘ముకుంద’, ‘ఒక లైలా కోసం’ సినిమాలతో తెలుగు తెరకి పరిచయమైంది పూజా హెగ్డే. ఈ రెండు సినిమాలు అంతగా సక్సెస్ కాలేదు. అదే సమయంలో బాలీవుడ్‌లో ఆఫర్ వస్తే అక్కడ హృతిక్ రోషన్‌తో మొహంజాదారో సినిమా చేసి భారీ ఫ్లాప్ అందుకుంది. మళ్ళీ టాలీవుడ్‌లో ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలో …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat