TimeLine Layout

August, 2021

  • 15 August

    ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగుర వేసిన ప్రధాని మోదీ

    75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగుర వేశారు. అంతకు ముందు ఆయన రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఎర్రకోటకు చేరుకున్నారు. అక్కడ మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అజయ్‌భట్‌ స్వాగతం పలికారు. ఆ తర్వాత త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించి.. ఎర్రకోటపై జాతీయ జెండా ఎగుర వేసి, గౌరవ వందనం సమర్పించారు. …

    Read More »
  • 15 August

    దేశంలో తగ్గని కరోనా ఉధృతి

    దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో 36,083 కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 37,927 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అవగా.. మరో 493 మహమ్మారి బారినపడి మృత్యువాతపడ్డారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,21,92,576కు పెరిగింది. ఇందులో 3,13,76,015 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం దేశంలో 3,85,336 యాక్టివ్‌ కేసులున్నాయి. మహమ్మారి …

    Read More »
  • 15 August

    సైనిక వీరులకు సీఎం కేసీఆర్‌ నివాళులు

    సైనిక వీరులకు సీఎం కేసీఆర్‌ నివాళులర్పించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లోని సైనిక వీరుల స్మారకం వద్ద పుష్పగుచ్చం సమర్పించి అమరులకు నివాళి అర్పించారు. అటునుంచి స్వాతంత్య్ర దినోత్సవ వేదికైన గోల్కొండ కోటకు చేరుకుంటారు. కోటలోని రాణిమహల్ ప్రాంగణంలో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేస్తారు. అనంతరం పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. కాగా, పంద్రాగస్టు వేడుకల కోసం గోల్కొండ కోట సర్వాంగ …

    Read More »
  • 15 August

    ప్రగతి భవన్‌లో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు

    ప్రగతి భవన్‌లో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు ఆయన మహనీయుల చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. దేశానికి వారు చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

    Read More »
  • 15 August

    గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం కేసీఆర్

    గోల్కొండ కోటపై జాతీయ జెండా రెపరెపలాడింది. 75వ స్వాంతంత్య్ర దినోత్సవం సందర్భంగా కోటలోని రాణిమహల్ ప్రాంగణంలో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌ నుంచి గోల్కోండకు చేరుకున్న సీఎం కేసీఆర్‌కు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, కళాకారులు స్వాగతం పలికారు. అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌.. సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో ఉన్న సైనిక వీరుల …

    Read More »
  • 15 August

    దుమ్ములేపుతున్న పవన్ “బీమ్లా నాయక్ “ఫ‌స్ట్ గ్లింప్స్

    ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా అప్‌డేట్ వ‌స్తుంది అంటే అభిమానుల‌లో ఎంత ఆస‌క్తి నెల‌కొని ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. రీసెంట్‌గా ప‌వ‌న్ గ‌ళ్ల లుంగీ క‌ట్టిన ఫొటో ఒక‌టి షేర్ చేస్తూ.. మూవీ టైటిల్‌, ఫ‌స్ట్ గ్లింప్స్ విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. స్వాతంత్ర్య దినోత్స‌వం కానుక‌గా రానున్న అప్‌డేట్ ఏ రేంజ్‌లో ఉంటుందా అని అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూడ‌గా, వారి అంచ‌నాలును మించేలా ఇది ఉంది. కొద్ది సేప‌టి క్రితం …

    Read More »
  • 14 August

    ఆస‌రా పెన్ష‌న్లు.. 57 ఏండ్లు నిండిన వారి నుంచి ద‌ర‌ఖాస్తుల‌కు ఆహ్వానం

    గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన మేరకు 57 ఏండ్లు నిండిన వారిలో అర్హులకు ఆస‌రా పెన్ష‌న్లు ఇచ్చేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌ల‌ను వేగ‌వంతం చేసింది. ఇప్ప‌టికే జీవో జారీ కాగా, ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు నిన్న‌ ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. 57 ఏండ్లు నిండి అర్హులైన వారు ఆగ‌స్టు 31వ తేదీ వ‌ర‌కు మీ-సేవ‌, ఈ-సేవ కేంద్రాల ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తుతో పాటు ఫోటో, ఆధార్ కార్డు జిరాక్స్‌ను …

    Read More »
  • 14 August

    దళిత బంధు పథకం అందరికి వర్తింప చేస్తాం-మంత్రి తన్నీరు హరీష్ రావు

    హుజురాబాద్ నియోజకవర్గంలో ని అర్హులైన ప్రతి దళిత కుటంబానికి దళిత బంధు పథకం వర్తింప చేయడం జరుగుతుందని, ఇందులో ఎలాంటి అనుమానాలు వద్దని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు స్పష్టం చేశారు. శనివారం హుజురాబాద్ నియోజకవర్గ సర్పంచ్ లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధుల తో టేలికాన్ఫరెన్స్ లో వారు మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన ప్రకారం నియోజకవర్గంలో ని 20 వేల కుటుంబాల కు పైగా …

    Read More »
  • 14 August

    రాహుల్ గాంధీ ట్విట్ట‌ర్ అకౌంట్ అన్‌లాక్‌

    కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ  తో పాటు ఆ పార్టీకి చెందిన ఇత‌ర నేత‌ల అకౌంట్ల‌ను.. ట్విట్ట‌ర్ సంస్థ అన్‌లాక్ చేసింది. ఇటీవ‌ల ఢిల్లీలో రేప్‌, హ‌త్య‌కు గురైన ఓ తొమ్మిదేళ్ల బాలిక ఫ్యామిలీ ఫోటోను ట్వీట్ చేసిన నేప‌థ్యంలో రాహుల్‌తో పాటు ఆ పార్టీ నేత‌ల అకౌంట్ల‌ను ట్విట్ట‌ర్ సంస్థ తాత్కాలికంగా లాక్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే శుక్ర‌వారం రాహుల్ .. ట్విట్ట‌ర్‌పై విరుచుకుప‌డ్డారు. భార‌తీయ రాజ‌కీయ …

    Read More »
  • 14 August

    నా వంటకు బలయ్యేది వారే!! 

    మిల్కీబ్యూటీ తమన్నాను ఇప్పటి వరకూ కథానాయికగానే చూశాం. నిజ జీవితంలో ఆమె ఎలా ఉంటారు? ఏం ఇష్టపడతారు? ఎలా ప్రవర్తిస్తుంటారు. ఈ వివరాలేవీ పెద్దగా బయటకు తెలీదు. తెర వెనక తమన్నా ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే త్వరలో ప్రసారమయ్యే కుకింగ్‌ షో చూడాల్సిందే అంటున్నారు. దీని గురించి ఆమె ఆసక్తికర విషయాలు వెల్లడించారు.  సినిమాల్లో నటించడం, డబ్బింగ్‌ చెప్పడం వేరు. ఓ ప్రాంతీయ కుకింగ్‌ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరించడం …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat