TimeLine Layout

May, 2021

  • 25 May

    అసలు టూల్‌కిట్‌ రభస ఏమిటి?

    సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారంతో, విద్వేష జాఢ్యంతో ప్రతిపక్షాలపై నిత్యం విషం గక్కే బిజెపి, కాషాయ పరివారం ఈ సారి తాను తవ్వుకున్న గోతిలో తానే పడింది. – దేశాన్ని, ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతిష్టను దిగజార్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధం చేసుకున్న టూల్‌కిట్‌ చూడండి అంటూ ఎఐసిసి అధికారిక లెటర్‌ హెడ్‌ కాపీగా ఒక పత్రాన్ని జతచేసి ‘కాంగ్రెస్‌టూల్‌కిట్‌ ఎక్స్‌పోజ్డ్‌’ హ్యాష్‌ట్యాగ్‌తో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో సహా …

    Read More »
  • 25 May

    ఏపీలో కాస్త తగ్గిన కరోనా కేసులు

    ఏపీ రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 58,835 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 12,994 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడి 96 మంది మృతి చెందారు. మరోవైపు కరోనా నుంచి కోలుకొని 18,373 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,03,762 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా గత 24 గంటల్లో తూర్పు గోదావరిలో అత్యధికంగా 2652 కేసులు రాగా.. అత్యల్పంగా కృష్ణా జిల్లాలో 274 కేసులు నమోదయ్యాయి.

    Read More »
  • 25 May

    సమంత అందుకే అది చేయలేదంట

    తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత తెలుగుతో పాటు దక్షిణాది ఇండస్ట్రీల్లో మంచి పేరు తెచ్చుకుంది. స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నా.. ఒక్క హిందీ సినిమాలో కూడా నటించని ఆమె, ఇటీవల ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్లో నటించింది. ఇన్నాళ్లూ హిందీ సినిమాలకు ఎందుకు సైన్ చేయలేదన్న ప్రశ్నకు స్పందించిన ఆమె.. ‘ఏమో భయం అయ్యిండొచ్చు’ అని బదులిచ్చింది. అటు ఇకపై బాలీవుడ్ …

    Read More »
  • 25 May

    గ్రీన్ టీ తాగితే…?

    గ్రీన్ టీ తాగడం వలన అనేక లాభాలున్నయంటున్నారు నిపుణులు.అయితే గ్రీన్ టీ తాగడం వలన కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. జీర్ణక్రియ మెరుగవుతుంది గుండె సమస్యలు తగ్గుతాయి. త్వరగా బరువు తగ్గుతారు క్యాన్సర్లను నివారిస్తుంది ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది రక్తపోటును నియంత్రిస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచుతుంది.

    Read More »
  • 25 May

    నాపై అవన్నీ పుఖార్లే

    ప్రస్తుతం ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా సెకండ్ వేవ్ తగ్గిన వెంటనే నాగార్జున ‘బంగార్రాజు’ ప్రాజెక్టును లాంఛ్ చేసేందుకు సిద్ధం అవుతుంది.. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్లో పాయల్ రాజ్పుత్ కనిపించబోతోందని వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన పాయల్.. ‘అవన్నీ పుకార్లే. నేను ఎలాంటి ఐటెంసాంగ్ చేయడం లేదు’ అని తెలిపింది. కాగా సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి సీక్వెల్గా వస్తున్న ఈ సినిమాను కల్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు.

    Read More »
  • 25 May

    మెగాస్టార్ తొలి అడుగు

    టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో… మెగాస్టార్ చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ నిన్న సోమవారం ప్రారంభమైంది. కర్ణాటక చింతామణి ప్రాంతంలో దాన్ని ఓపెన్ చేశారు. అఖిల భారత చిరంజీవి యూత్ ప్రెసిడెంట్ దాన్ని ప్రారంభించగా.. మెగాస్టార్ చిరు స్వయంగా అతడికి అభినందనలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు అభిమానుల మద్దతు ఎక్కువగా ఉన్న ఇతర ప్రాంతాల్లోనూ.. చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ లను నెలకొల్పనున్నారు.

    Read More »
  • 25 May

    కరోనా కట్టడీపై సీఎం కేసీఆర్ సమీక్ష

    తెలంగాణలో కరోనా థర్డ్ వేవు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. కరోనాపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రజల ఆరోగ్యం కోసమే లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నామన్నారు. రెండో డోసుకు సరిపడా టీకాలను సమకూర్చుకోవాలని అధికారులకు చెప్పారు. బ్లాక్ ఫంగస్కు అవసరమైన మందులు సమకూర్చుకోవాలన్నారు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు గాంధీలో 150, ENTలో 250 బెడ్లు ఉన్నట్లు తెలిపారు.

    Read More »
  • 25 May

    తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

    తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 3,043 కరోనా కేసులు వెలుగుచూశాయి. మరో 21 మంది మరణించారు. ఫలితంగా కరోనా కేసుల సంఖ్య 5,56,320కు పెరిగింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా ధాటికి 3,146 మంది మరణించారు. కొత్తగా 4,693 మంది కోలుకోగా, రికవరీల సంఖ్య 5,13,968కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 39,206యాక్టివ్ కేసులున్నాయి. తాజా కేసుల్లో GHMCలో 424 నమోదయ్యాయి.

    Read More »
  • 25 May

    ప్రధాని మోదీకి కేరళ సీఎం పినరయి విజయన్ లేఖ

    ప్రధాని మోదీకి కేరళ సీఎం పినరయి విజయన్ లేఖ రాశారు. కరోనా వ్యాక్సిన్ల కోసం కేంద్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను పిలవాలన్న ఆయన.. కేంద్రమే రాష్ట్రాలకు ఉచితంగా వ్యాక్సిన్లు అందించాలన్నారు. కరోనా వ్యాక్సిన్ల కోసం పలు రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లకు వెళ్లాయి.. వ్యాక్సిన్లు ఇచ్చేందుకు మోడర్నా, ఫైజర్ వంటి అమెరికా సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే వ్యాక్సిన్లు ఇస్తామన్న నేపథ్యంలో కేరళ సీఎం లేఖ ఆసక్తిగా మారింది.

    Read More »
  • 25 May

    లాక్డౌన్ సడలింపుల దిశగా అడుగులు

    మహారాష్ట్రలో క్రమంగా కరోనా కేసులు, మరణాలు తగ్గుతుండటంతో లాక్డౌన్ సడలింపుల దిశగా ఆ రాష్ట్ర సర్కారు అడుగులు వేస్తోంది. లాక్డౌన్ను దశలవారీగా సడలిస్తామని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే తెలిపారు. జూన్ 30 నాటికి అన్లాక్ ప్రక్రియ పూర్తవుతుందని, అయితే ఎప్పటి నుంచి అన్లాక్ ప్రారంభించాలనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదన్నారు. మొత్తం నాలుగు దశల్లో అన్లాక్ అమలు చేయనున్నట్లు చెప్పారు.

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat