డ్రగ్స్ కేసు విచారణ చేస్తున్న బెంగళూరులోని బాణసవాడి ఉప విభాగం పోలీసులు హీరో తనీష్ తో పాటు మరో ఐదుగురికి నోటీసులిచ్చారు. ఈ రోజు విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. నోటీసులు అందిన వారిలో ఓ పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత శంకర గౌడ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆయన తన కార్యాలయాల్లో మద్యం, విందు పార్టీలు ఇస్తున్నట్లు వెల్లడించారు. కాగా తనీష్ 2017లో జరిగిన డ్రగ్స్ కేసులో HYD సిట్ …
Read More »TimeLine Layout
March, 2021
-
13 March
విలన్ గా భూమిక
టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం వరస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ‘వైల్డ్ డాగ్’ APR 2న రాబోతుండగా ‘బంగరాజు’తో పాటు మరో ప్రాజెక్టును సెట్స్ మీదకి తీసుకొస్తున్నాడు. కల్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ భూమిక విలన్ గా నటించనుందట. ఇది ‘నరసింహా’లో నీలాంబరి తరహా పాత్రని సినీటాక్. కాగా గతంలో వీరిద్దరు నటించిన స్నేహమంటే ఇదేరా’ ఫ్లాప్ అయింది. మరి ఈసారి వీరి కాంబో ఎలా …
Read More » -
13 March
మహాత్మా గాంధీపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఈసారి మహాత్మా గాంధీని టార్గెట్ చేసింది. ‘గాంధీ తన సొంత బిడ్డలను వేధించారు. అతిథుల టాయిలెట్లు శుభ్రం చేయలేదని తన భార్యను ఇంటి నుంచి బయటకు నెట్టివేసినట్లు పలు కథనాలు ఉన్నాయి. అయినప్పటికీ గాంధీ జాతిపిత అయ్యారు. గాంధీ మంచి భర్త, తండ్రి కాకపోయినా.. దేశంలో ఒక గొప్ప నాయకుడు అయ్యారు. అది కేవలం పురుషాధిక్యత వల్లే సాధ్యమైంది’ అని ట్విట్టర్ లో …
Read More » -
13 March
తెలంగాణలో కొత్తగా 216 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి గడిచిన 24 గంటల్లో కొత్తగా 216 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,00,933కి చేరింది. ఇందులో 1,918 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటివరకు 2,97,363 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఇద్దరు చనిపోగా, మొత్తం మరణాల సంఖ్య 1,652కి చేరింది. రాష్ట్రంలో కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 52 ఉన్నాయి
Read More » -
13 March
రోహిత్ శర్మ ఆడకపోవడం వెనక అసలు కారణం ఇదే..?
ఇంగ్లండ్తో జరిగిన తొలి T20లో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఆడకపోవడంపై పెద్ద చర్చ జరిగింది ఫామ్ లో ఉన్న హిట్ మ్యాన్ను ఎందుకు తప్పించారని విమర్శలు వచ్చాయి. రొటేషన్ పద్ధతిలో భాగంగానే అతడికి విశ్రాంతినిచ్చారని తెలిసింది. ప్రపంచకప్ కోసం సన్నద్ధమవుతున్న భారత్.. ఎక్కువ మంది ఆటగాళ్లను పరీక్షించాలనే ఈ విధానాన్ని అమలు చేస్తోందట. ఈ ఏడాది ICC T20 వరల్డ్ కప్ భారత్ లో జరగనుంది.
Read More » -
13 March
కంగనా రనౌత్ పై కేసు నమోదు
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై కేసు నమోదు చేయాలని ముంబై కోర్టు పోలీసులను ఆదేశించింది. ‘కాశ్మీర్ కీ యోధ రాణి దిద్దా పుస్తక రచయిత ఆశిష్ కౌల్. ఆమెపై ఫిర్యాదు చేశారు. కంగన కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడిందని కోర్టును ఆశ్రయించారు. గతేడాది ‘పంగా ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ అందాల భామ ప్రస్తుతం జయలలిత బయోపిక్ ‘తలైవి’, ‘ధాకడ్’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది
Read More » -
13 March
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 210 మందికి కరోనా
ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో 47,803 శాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 210 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,91,388కి చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 1,227 ఉన్నాయి.. ఇప్పటివరకు 8,82,981 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా కరోనాతో ఇద్దరు మృతిచెందగా.. మొత్తం 7,180 మంది కరోనాతో చనిపోయారు
Read More » -
13 March
దేశంలో కొత్తగా 24,882 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 24,882 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 19,957 మంది కరోనా నుంచి కోలుకోగా, 140 మంది మరణించారు మొత్తం కేసుల సంఖ్య 1,13,33,728కి చేరింది. ఇప్పటివరకు 1,09,73,260 మంది కరోనా నుంచి కోలుకోగా, 2,02,022 యాక్టివ్ కేసులు ఉన్నాయి మొత్తం 1,58,446 మంది మరణించారు.
Read More » -
12 March
దండి యాత్ర అద్భుత ఘట్టం : సీఎం కేసీఆర్
స్వాతంత్ర్య భారత్ 75వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా.. శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం పబ్లిక్ గార్డెన్స్లో ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. 75 వారాలపాటు ఈ …
Read More » -
12 March
రాజకీయ శక్తులను ఎదుర్కొని రాష్ర్టం సాధించాం : మంత్రి కేటీఆర్
తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పడు టీఆర్ఎస్ పార్టీకి మనీ పవర్ లేదు.. మజిల్ పవర్ లేదు.. మీడియా పవర్ లేదు.. మూడు ప్రబలమైన రాజకీయ శక్తులను ఎదుర్కొని కేసీఆర్ ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించారని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. బేగంపేట్ హరిత ప్లాజాలో తెలంగాణ జీవితం – సామరస్య విలువలపై తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. …
Read More »