ఏపీ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వైెఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర టీడీపీ నేతలపై తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది. ప్రస్తుతం జగన్ పాదయాత్ర కర్నూలు జిల్లాలో జరుగుతుంది. ప్రజాసంకల్పయాత్ర 20వ రోజు షెడ్యూల్ ఖరారు అయింది. ఆయన మంగళవారం ఉదయం ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండలం పుట్టపాశం నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి హెచ్ కిరవడి, గాజులదిన్నె క్రాస్ చేరుకుంటారు. …
Read More »