ప్రస్తుతం ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా సెకండ్ వేవ్ తగ్గిన వెంటనే నాగార్జున ‘బంగార్రాజు’ ప్రాజెక్టును లాంఛ్ చేసేందుకు సిద్ధం అవుతుంది.. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్లో పాయల్ రాజ్పుత్ కనిపించబోతోందని వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన పాయల్.. ‘అవన్నీ పుకార్లే. నేను ఎలాంటి ఐటెంసాంగ్ చేయడం లేదు’ అని తెలిపింది. కాగా సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి సీక్వెల్గా వస్తున్న ఈ సినిమాను కల్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు.
Read More »మెగాస్టార్ తొలి అడుగు
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో… మెగాస్టార్ చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ నిన్న సోమవారం ప్రారంభమైంది. కర్ణాటక చింతామణి ప్రాంతంలో దాన్ని ఓపెన్ చేశారు. అఖిల భారత చిరంజీవి యూత్ ప్రెసిడెంట్ దాన్ని ప్రారంభించగా.. మెగాస్టార్ చిరు స్వయంగా అతడికి అభినందనలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు అభిమానుల మద్దతు ఎక్కువగా ఉన్న ఇతర ప్రాంతాల్లోనూ.. చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ లను నెలకొల్పనున్నారు.
Read More »రష్మిక పిలుపు
ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో మనమంతా ధైర్యంగా ఉండాలని హీరోయిన్ రష్మిక ఓ వీడియో ట్వీట్ చేసింది. ‘ రోజు రోజుకు విజృంభిస్తోన్న కరోనా సవాల్ విసురుతోంది. ఈ సమయంలో మనం సానుకూలంగా ఆలోచించాలి. ఈ యుద్ధంలో మనమే గెలుస్తాం. ప్రజల్లో ధైర్యం నింపడానికి వచ్చే వారం నుంచి మన పరిసరాల్లోని కొవిడ్ హీరోలను పరిచయం చేయాలి అనుకుంటున్నాను. మీ ముఖాల్లో చిరునవ్వు కోసం ఈ చిన్ని ప్రయత్నం’ అని …
Read More »సాయం చేయండి-శృతి హసన్ పిలుపు
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అనేక మంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారనీ, ఇలాంటి వారిని తమకు తోచిన విధంగా ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని హీరోయిన్ శృతిహాసన్ పిలుపునిచ్చింది. ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిన ‘లాభం’ చిత్రంలో నటించింది. అలాగే, తెలుగు, కన్నడ భాషల్లో కూడా మరికొన్ని ప్రాజెక్టుల్లో నటిస్తోంది. అయితే, లాక్డౌన్ కారణంగా సినిమాల షూటింగులన్నీ ఆగిపోవడంతో ప్రస్తుతం ముంబైలోని తన సొంతింటిలో ప్రియుడితో …
Read More »హీరోగా బాలనటుడు
బాహుబలి, రేసుగుర్రం, దువ్వాడ జగన్నాథం’ తదితర చిత్రాల్లో బాలనటుడిగా కనిపించిన సాత్విక్ వర్మ హీరోగా మారాడు. క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో సాగే ‘బ్యాచ్’లో అతను హీరోగా నటించాడు. దర్శకుడు శివ మాట్లాడుతూ ‘‘ఇదొక యూత్ఫుల్ కాలేజీ ఎంటర్టైనర్. పోకిరీ కుర్రాళ్లు క్రికెట్ బెట్టింగ్లో ఏం చేశారన్నది కథ’’ అని చెప్పారు. ‘‘చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉందీ సినిమా. త్వరలో విడుదల చేస్తాం’’ అని నిర్మాత రమేశ్ ఘనమజ్జి …
Read More »కంటతడిపెట్టిన సోను సూద్
కరోనా బాధితుల పాలిట ఆపద్బాంధవుడు సోనూ సూద్ ఓ ఇంటర్వ్యూలో కంటతడిపెట్టాడు. ప్రస్తుత పరిస్థితుల్లో తన తల్లిదండ్రులు బ్రతికుండి బెడ్లు, ఆక్సిజన్ కోసం పోరాడుతుంటే తాను తట్టుకోలేకపోయేవాడినని భావోద్వేగానికి గురయ్యాడు. కాగా సోనూ తండ్రి శక్తి సాగర్ సూద్ పంజాబ్లో వ్యాపారం చేసేవారు. ఆకలితో ఉన్నవారికి సోనూతో కలిసి సాయం చేసేవారు. ఇక సోనూ తల్లి సరోజ్ పేదలకు ఉచితంగా చదువు చెప్పేవారు. అనారోగ్యంతో కొంతకాలం క్రితం వారు కన్నుమూశారు.
Read More »కృతి సనన్ కు తప్పని ఆ కష్టాలు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో,యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ‘ఆదిపురుష్ ‘లో సీతగా నటిస్తోంది హీరోయిన్ కృతి సనన్. ఆమె చిత్రసీమలో అడుగుపెట్టి ఏడేళ్లు పూర్తైన సందర్భంగా ఓ భావోద్వేగ పోస్టు చేసింది. ‘నటిని అవుతానని ఊహించలేదు. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాను. మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డాను. కొన్ని చేదు అనుభవాలు, అవమానాలు ఎదురయ్యాయి. ఇప్పటికైనా సక్సెస్ రావడం సంతృప్తిగా ఉంది. ఇష్టమైన పాత్రలు దక్కుతున్నాయి’ …
Read More »ఆ హీరోతో నటించాలని ఉందంటున్న సమంత
వెండితెరపై అందంతో ఆకట్టుకునే హీరోయిన్ సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్ సిరీస్లో నెగటివ్ షేడ్స్ ఉన్న డీగ్లామరస్ పాత్ర చేసింది. ఈ ప్రాజెక్టు ప్రమోషన్లలో సామ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. బాలీవుడ్లో చాలా టాలెంట్ ఉందని కొనియాడింది. ఇంకా అవకాశమొస్తే రణ్ బీర్ కపూర్తో కలిసి నటించాలని ఉందని తెలిపింది. కాగా సామ్ ప్రస్తుతం తెలుగులో ‘శాకుంతలం’, తమిల్లో ‘కాతు వాకులా రెండు కాదల్ అనే చిత్రాలు …
Read More »RGV ఇంట్లో విషాదం
వివాదస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ సోదరుడు పి. సోమశేఖర్ ఆదివారం కరోనాతో కన్నుమూశారు. ఇటీవల ఆయనకు కరోనా సోకగా హైదరాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ‘ముస్కురాకే దేఖ్ జరా’ అనే బాలీవుడ్ మూవీకి దర్శకుడిగా పనిచేసిన ఆయన రంగీలా, దౌడ్, సత్య, జంగిల్, కంపెనీ వంటి సినిమాలకు ప్రొడక్షన్ బాధ్యతలు నిర్వర్తించారు. కాగా తన జీవితంలో కీలకమైన వ్యక్తులలో సోమశేఖర్ ఒకరని RGV పలు సందర్భాలలో చెప్పారు.
Read More »ఆ స్టార్ హీరోయిన్ కూతురుతో మహేష్
తెలుగు సినిమా ఇండస్ట్రీ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు.. ఈ మూవీ అనంతరం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేయనున్నాడు. త్రివిక్రమ్-మహేష్ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారనే వార్తలు వస్తుండగా.. ఒక హీరోయిన్ పూజా హెగ్దే పేరు ఫిక్స్ అయ్యింది. మరో హీరోయిన్ జాన్వీకపూర్ పేరు తెరపైకి రాగా.. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.
Read More »